ఇవి చేస్తే.. మన్యం మకుటమే
సరిగ్గా వంద రోజుల క్రితం గిరిజనుల ఆశలకు పెద్దపీట వేస్తూ పార్వతీపురం మన్యం పేరుతో జిల్లాలో పాలన ప్రారంభమైంది. కొత్త అధికార యంత్రాంగం ఎలా పని చేస్తుంది.. సమస్యలను ఎలా ఎదుర్కొంటుందని అందరూ భావించే లోపే కొన్ని దీర్ఘకాలిక
జిల్లా ఏర్పడి నేటికి వంద రోజులు
న్యూస్టుడే, పార్వతీపురం
గుమ్మలక్ష్మీపురం మండలంలో కాలినడకన కొండ దిగుతున్న గిరిజనులు
సరిగ్గా వంద రోజుల క్రితం గిరిజనుల ఆశలకు పెద్దపీట వేస్తూ పార్వతీపురం మన్యం పేరుతో జిల్లాలో పాలన ప్రారంభమైంది. కొత్త అధికార యంత్రాంగం ఎలా పని చేస్తుంది.. సమస్యలను ఎలా ఎదుర్కొంటుందని అందరూ భావించే లోపే కొన్ని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి ప్రజల మన్నన పొందింది. గిరిజనుల ఆదాయం పెరిగేలా అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. వసతులు సమకూర్చుకుంటూ, వనరులను వినియోగించుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు.. అయితే కొన్ని శాఖలకు కార్యాలయాలు.. క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకపోవడం, గతం నుంచి వెంటాడుతున్న సమస్యలు.. అవరోధాలుగా నిలుస్తున్నాయి. వీటన్నింటినీ అధిగమించి, గిరిపుత్రులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రగతి పథంలో పయనించాలని ఆకాంక్షిస్తూ.. ప్రత్యేక కథనం.
మాకో దారి చూపండయ్యా
జియ్యమ్మవలస మండలంలో గర్భిణిని డోలీలో తీసుకెళ్తున్న యువకులు
కొత్త జిల్లాలో చాలా గిరిజన ప్రాంతాలకు రోడ్లు లేవు. ప్రభుత్వం రహదారులకు నిధులు మంజూరు చేసినా అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవడంలో జాప్యంతో అడుగులు ముందుకు పడటం లేదు.
* సాలూరు నియోజకవర్గంలో 11 రహదారులు మంజూరు కాగా అనుమతులు వచ్చాయి. కురుపాంలో 7, పాలకొండలో 7 మార్గాలకు అభ్యంతరాలున్నాయి. ఇవి పూర్తయితే 52 గ్రామాలకు రాకపోకలు సాగనున్నాయి.
* గిరిజన ప్రాంతంలో రహదారి సౌకర్యం లేనివి సుమారు 417 గ్రామాలున్నాయి. ఉపాధి పథకంలో భాగంగా వీటికి కొత్త మార్గాలు వేసేందుకు నిధులు కేటాయించినా పనులు ముందుకు సాగడం లేదు.
కొన్నింటికే పల్లెవెలుగు
* జిల్లాలో 916 గ్రామాలుండగా 305 వరకు బస్సులు తిరుగుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో 80 శాతం సర్వీసులు నడుస్తుండగా గిరిజనులకు అరకొరగానే సేవలందుతున్నాయి. కొన్ని గ్రామాలకు రోడ్లు లేకపోవడంతో ప్రజలకు నడకదారే దిక్కవుతోంది.
సారథులు చూడాలి వారధులు
పూర్తికాని నారాయణపురం వంతెన
* కొమరాడ మండలంలోని పూర్ణపాడు- లాబేసు మధ్య నాగావళిపై 2017లో రూ.14 కోట్ల అంచనాతో చేపట్టిన వంతెన నిర్మాణం 60 శాతమే అయింది. నిధులు చాలక మిగిలిన పనులు వదిలేశారు. ఫలితంగా కొమరాడ మండల కేంద్రానికి చేరేందుకు 32 గ్రామాల ప్రజలు అదనంగా 30 కి.మీ.లు పయనిస్తున్నారు. బీ సీతానగరం వద్ద సువర్ణముఖిపై గతేడాది జులైలో వంతెన పనులు ప్రారంభించారు. వచ్చే మార్చికి పూర్తి చేయాల్సి ఉన్నా రూ.5 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండటంతో పనులు నిలిపేశారు. ప్రస్తుతం 1936లో నిర్మించిన శిథిల వంతెన పైనుంచే రోజూ 2 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. బీ బలిజిపేట మండలంలోని నారాయణపురం-పెద్దింపేట వంతెన పనులు నాలుగేళ్ల క్రితమే అర్ధాంతరంగా నిలిచాయి.
అధికారులెక్కడ..?
* ఇటీవల ఐటీడీఏ పీవో బదిలీపై వెళ్లగా జేసీకి ఆయన బాధ్యతలను అప్పగించారు.
* ప్రస్తుతం చాలా పనులు ఉపాధి హామీ పథకంలో చేస్తున్నారు. పూర్తిస్థాయి పీడీ లేక విజయనగరం పీడీ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
* డీఆర్డీఏ పీడీగా ఐటీడీఏ పరిధిలోని టీపీఎంయూ ఏపీడీ ఉన్నారు.
* పౌర సరఫరాల అధికారిగా ఇక్కడ పనిచేసిన మధుసూదన్ విజయనగరం వెళ్లారు. అక్కడి అధికారి ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టారు. విద్యాశాఖదీ అదే పరిస్థితి.
* తూ.కొ., గనులు, భూగర్భ, అటవీ, దివ్యాంగుల శాఖలు పూర్వ జిల్లా కేంద్రాల నుంచే సేవలు అందిస్తున్నాయి.
* శ్రీకాకుళం పర్యాటక అధికారి జిల్లాకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
* పరిశ్రమల శాఖకు డీడీ లేరు.
విద్య-వైద్యంలో వెనకడుగు..
గిరిజనులకు సాంకేతిక విద్యను అందించేందుకు కురుపాంలో మూడేళ్ల క్రితం గిరిజన ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణాన్ని ప్రారంభించారు. పనులు పూర్తికాక విద్య అందుబాటులోకి రాలేదు. 2022 నుంచి ఇక్కడ తరగతులు ప్రారంభిస్తామని ముందుగా ప్రకటించినా ఏడాది పాటు వాయిదా వేశారు. బీ 2016లో గిరిజన విశ్వవిద్యాలయం కేటాయించారు. ఇటీవల దీనికి మెంటాడ-దత్తిరాజేరు మధ్య స్థలం కేటాయించారు. ఇది పూర్తయితే గిరిజన ప్రాంతానికే మకుటంగా నిలవనుంది. బీ జిల్లా కేంద్రంలో ఆధునిక వైద్య సేవలు అందించేలా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు అధికారులు స్థలం కేటాయించారు. ఆ ప్రాంతంలోని పశు వైద్యశాలను ఖాళీ చేసేందుకు ఆ శాఖ షరతు పెట్టడంతో రెండేళ్లుగా ముందడుగు పడడం లేదు.
పట్టణాభివృద్ధి.. పారిశ్రామిక ప్రగతి
- నిశాంత్కుమార్, కలెక్టర్
వందరోజుల్లో జిల్లాకు ఏం అవసరమో సమకూర్చుకోగలిగాం. రానున్న రోజుల్లో పట్టణాభివృద్ధికి కార్యాచరణ అమలుచేస్తాం. గ్రామీణ పరిశ్రమల ప్రోత్సాహానికి ఎంఎస్ఎంఈ పథకం రూపొందించింది. చింతపండు, జీడిపప్పు, బియ్యం తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. రానున్న రోజుల్లో కలెక్టరేట్, ఏఆర్ సముదాయాలు, పోలీసు పరేడ్ గ్రౌండ్ నిర్మాణానికి చర్యలు చేపడతాం. ప్రజలకు మంచి పాలన అందించేలా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన ఇంతే.. మీ దారి మీరే చూసుకోండి
[ 25-04-2024]
మన్యంలోని కొండలపై ఉన్న గ్రామాలకు వస్తే వీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుంది. అందుకేనేమో వీరు అక్కడికి వెళ్లరు.. ఒక వేళ వెళ్దామా అంటే రోడ్డు ఉంటే కదా.. అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వ పాలన. -
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్