జగనన్న కాలనీలకు వెలుగులెక్కడ
ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు సంతోషించారు. కష్టపడి నిర్మించుకున్నారు.. శ్రావణమాసం కదా.. మంచి ముహూర్తాలు ఉండటంతో అందరినీ పిలుచుకొని
పార్వతీపురం మండలం చినబొండపల్లి లేఅవుట్లో 39 మందికి పట్టాలు అందించారు. మండలంలో ఇక్కడే ముందుగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. కాలనీ వరకు విద్యుత్తు సదుపాయం కల్పించినా.. గృహావసరాలకు మాత్రం కనెక్షన్ ఇవ్వలేదు. ఓ లబ్ధిదారు తన సొంత ఖర్చుతో బోరు తవ్వించుకుని గోడలు తడుపుకోవడానికి కరెంటు లేక జనరేటర్ను అద్దెకు తెచ్చుకున్నారు.
మక్కువ మండల కేంద్రంలోని లేఅవుట్లో 320 గృహాలను కేటాయించారు. సుమారు 15 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఓ వీధిలో వరుసగా స్తంభాలు వేసినా కనెక్షన్ మాత్రం ఇవ్వలేదు. ఇక్కడ నీటి అవసరాలకు చేతిపంపులపై ఆధారపడుతున్నారు.
ఈనాడు-విజయనగరం, సాలూరు, పార్వతీపురం గ్రామీణం, మక్కువ, న్యూస్టుడే: ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు సంతోషించారు. కష్టపడి నిర్మించుకున్నారు.. శ్రావణమాసం కదా.. మంచి ముహూర్తాలు ఉండటంతో అందరినీ పిలుచుకొని గృహ ప్రవేశం చేద్దామనుకుంటే విద్యుత్తు సదుపాయం లేకపోవడంతో అడుగు పెట్టలేని పరిస్థితి.
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ప్రభుత్వం నిరుపేదలకు స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా వందలాది మంది పూర్తి చేసుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 906 లేవుట్లకు గాను 269 లేఅవుట్లను ప్రాధాన్య క్రమంలో ఎంచుకొని విద్యుద్దీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. 85 చోట్ల ప్రారంభించగా 25 చోట్ల ఈ నెలాఖరులోగా, మిగతావి సెప్టెంబరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రస్తుతానికి 35 వేల విద్యుత్తు స్తంభాలు, 3 వేల నియంత్రికలు అవసరమని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల తాత్కాలిక ఏర్పాట్లు చేయడంతో నిర్మాణాలకు నీటి అవసరాలు తీరుతున్నాయి. ఇళ్లకు మాత్రం కనెక్షన్లు ఇవ్వనందున లబ్ధిదారులు చేరడానికి ఆస్కారం లేకుండా పోతుంది.
సాలూరులోని నెల్లిపర్తి-2 లేఅవుట్ ఇది. ఇక్కడ 218 మందికి ఇళ్లను కేటాయించారు. మూడిళ్లు పూర్తి కాగా.. ఒకరు గృహ ప్రవేశం చేశారు. కాలనీల్లో స్తంభాలు వేసి వదిలేశారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వేసిన బోర్లకు సమీపంలోని లైన్ నుంచి తాత్కాలికంగా కనెక్షన్ ఇచ్చారు.
వృథాగా మోటార్లు
నీరు లేకుండా నిర్మాణాలు సాధ్యం కావని అధికారులు అన్నిచోట్లా బోర్లు వేశారు. తక్కువ గృహాలు ఉన్న చోట చేతిపంపులు బిగించారు. మిగతా ప్రాంతాల్లో బోర్ల ఏర్పాటుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల వద్ద మోటార్లు సిద్ధంగా ఉన్నా విద్యుత్తు లేక ఆగిపోయారు. కొన్నిచోట్ల బిగించినవి వృథాగా ఉండిపోయాయి. ఇప్పటివరకు ఏ ఒక్క కాలనీలోనూ విద్యుద్దీకరణ పనులు పూర్తిస్థాయిలో కాలేదు. అయినప్పటికీ నిర్మాణాలు ప్రారంభించకపోతే పట్టాలు రద్దు చేస్తామని అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకురావడంతో కొందరు అప్పులు చేసి పనులు మొదలెట్టారు.
వేగవంతం చేస్తున్నాం: జగనన్న కాలనీల్లో విద్యుద్దీకరణ పనులు వేగవంతం చేస్తున్నాం. ఈ నెలాఖరులో కొన్ని పూర్తవుతాయి. ఆయా చోట్ల కనెక్షన్లు ఇచ్చేస్తాం. ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టి లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.
- నాగేశ్వరరావు, ఎస్ఈ, విద్యుత్తు శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన ఇంతే.. మీ దారి మీరే చూసుకోండి
[ 25-04-2024]
మన్యంలోని కొండలపై ఉన్న గ్రామాలకు వస్తే వీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుంది. అందుకేనేమో వీరు అక్కడికి వెళ్లరు.. ఒక వేళ వెళ్దామా అంటే రోడ్డు ఉంటే కదా.. అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వ పాలన. -
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!