ప్రతి ఇంటిపై జెండా ఎగరాలి
మండలంలోని చినమేరంగిలో ఎంపీటీసీ మజ్జి పుణ్యవతి, సర్పంచి అల్లు రమణమ్మ, కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టారు. చినబజార్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 13, 14, 15 తేదీల్లో అందరూ ఇళ్లపై జెండాలు ఎగురవేయాలన్నారు. బస్స్టేషన్ వద్ద మానవహారం చేపట్టారు.
విద్యార్థుల మానవహారం
జియ్యమ్మవలస, పార్వతీపురం పురపాలిక, కలెక్టరేట్ ప్రాంగణం, పాచిపెంట, సీతంపేట, న్యూస్టుడే: మండలంలోని చినమేరంగిలో ఎంపీటీసీ మజ్జి పుణ్యవతి, సర్పంచి అల్లు రమణమ్మ, కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టారు. చినబజార్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 13, 14, 15 తేదీల్లో అందరూ ఇళ్లపై జెండాలు ఎగురవేయాలన్నారు. బస్స్టేషన్ వద్ద మానవహారం చేపట్టారు. * ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా తపాల శాఖ అదనపు ఎస్పీ శ్రీకర్బాబు పుర కమిషనర్ ఆనంద్ను కలిసి జాతీయ జెండాలు అందజేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో అమ్మకాలు చేపట్టినట్లు తెలిపారు. * క్విట్ ఇండియా స్ఫూర్తితో అందరూ ఏకం కావాలని సీపీఎం, సిటూ నాయకులు పార్వతీపురంలో ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణత్యాగాలు చేసింది కమ్యూనిస్టులని పేర్కొన్నారు. * పాచిపెంట జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు సాలూరు పట్టణానికి చెందిన ‘మీకే మేము వెల్ఫేర్ అసోషియేన్’, స్థానిక గౌరమ్మ ఛారిటబుల్ ట్రస్టు దేశభక్తిపై వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. * సీతంపేట మండలం పెద్దూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగ్గురి పాలిట మృత్యువు
[ 29-03-2024]
మృత్యువు ఒకేసారి మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.. కన్నవారు లేకపోయినా తోడబుట్టిన వారికి అండగా ఉన్న మరొకరిని బలితీసుకుంది.. -
ఇదేం బాదుడు
[ 29-03-2024]
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని వైష్ణపు వీధిలో 998 చ.అ. ఓ నివాస భవనం (జీ+1) ఏఆర్వీ (వార్షిక అద్దె విలువ విధానం) అమల్లో ఉన్నప్పుడు 2020-21లో ఏడాదికి ఆస్తి పన్ను రూ.3792 ఉండేది. -
వేరే దారి లేక.. డోలీ మోత
[ 29-03-2024]
సరైన రోడ్లు లేకపోతే మనం అడుగు తీసి అడుగు బయట పెట్టలేం. అలాంటిది ఆ గిరిజన గ్రామంలో అసలు దారే లేదు. అలాంటి చోట ఏదైనా ప్రమాదం జరిగితే, ఆసుపత్రి దగ్గరలో లేకపోతే ఇక అంతే సంగతి. -
రోడ్లు లేవు.. సేవలూ కానరావు
[ 29-03-2024]
రైతులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీలు ఆదాయ వనరుగానే మిగిలాయి. చెక్పోస్టుల ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరుతున్నా కనీస సేవలు కూడా అందించలేని పరిస్థితి నెలకొంది. -
నిండు గర్భిణులకు ‘నడక’ యాతన
[ 29-03-2024]
కొమరాడ మండలంలోని కొండ శిఖర గ్రామం గుమడంగి. ఇక్కడికి ఎలాంటి రోడ్డు సౌకర్యమూ లేదు. గిరిజనులు ఆరు కిలోమీటర్లు నడిస్తే ఒడిశా రాష్ట్రంలోని వంటామాడకి, 17 కి.మీ వెళ్తే ఆంధ్రాలోని కుంతేసు చేరుకుంటారు. -
మీ ఓటు పదిలమేనా..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ప్రతిసారి ఓటు వేస్తున్నాం ఈ సారి పోలింగ్ రోజున వినియోగించుకుంటామని ధీమాగా ఉంటే పొరబడినట్టే. -
సహకారం కరవు
[ 29-03-2024]
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్లు) నిస్తేజమవుతున్నాయి. లావాదేవీలు లేకపోవడంతో కొన్నేళ్లుగా సేవలు నిలిచిపోయాయి. -
అక్కడ సమస్యలనే చదవాలి!!
[ 29-03-2024]
వేలాది పుస్తకాలు.. పాఠకులకు పూర్తిస్థాయిలో వసతులు.. విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు సేదదీరేందుకు గదులు.. మరుగుదొడ్లు.. నచ్చిన పుస్తకాలు, పత్రికలు.. -
పరిశ్రమలు రావాలంటే.. చంద్రబాబు సీఎం కావాలి
[ 29-03-2024]
కూటమి అధికారంలోకి వచ్చి, చంద్రబాబునాయుడు సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. -
వాన కాదు.. వల్లకాడుకు దారి లేదు
[ 29-03-2024]
గజపతినగరంలో రైల్వే మూడో లైను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల్లో స్థానిక రాళ్ల చెరువుకు సంబంధించిన కల్వర్టును రైల్వే అధికారులు పొరపాటున కప్పేయడంతో సమీపంలోని రైల్వే కాలనీ వాసులు, రైతులు ఇక్కట్లు పడుతున్నారు.