ఖాళీ స్థలాలు.. రోగాలకు నిలయాలు
పార్వతీపురం పురపాలిక గ్రేడ్ 1గా కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంగానూ మారింది. కానీ పట్టణంలో 30 వార్డుల్లో ఉన్న ఖాళీ స్థలాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలతో ఎక్కడికక్కడ నీరు నిలిచి దుర్గంధంతో పాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయని పలువురు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోగాలు విజృంభిస్తున్నాయని చెబుతున్నారు.
నివాసాల మధ్య మురుగు నిల్వ ఉన్న ఈ ప్రాంతం పార్వతీపురం పట్టణంలోని రామానంద్నగర్ శివారులోని బైపాసు కాలనీ వెనక భాగం. వందల కుటుంబాలున్న ఈ ప్రాంతంలో ఖాళీ స్థలంలో వాడుక నీరు నిలుస్తోంది. ఏడాది పొడుగునా ఇదే పరిస్థితి ఉండటంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. దుర్గంధంతో పాటు దోమలు విజృంభిస్తున్నాయని వాపోతున్నారు.
పార్వతీపురం పట్టణం, న్యూస్టుడే: పార్వతీపురం పురపాలిక గ్రేడ్ 1గా కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంగానూ మారింది. కానీ పట్టణంలో 30 వార్డుల్లో ఉన్న ఖాళీ స్థలాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలతో ఎక్కడికక్కడ నీరు నిలిచి దుర్గంధంతో పాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయని పలువురు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోగాలు విజృంభిస్తున్నాయని చెబుతున్నారు.
ముఖ్యంగా ఇక్కడ..
పురలో సుమారు 60 వేల మంది జనాభా నివశిస్తున్నారు. ప్రతి వీధిలోనూ ఖాళీ స్థలలు ఉండటం, ఇక్కడ నీరు నిలుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సౌందర్యకాలనీ, జగన్నాథపురం, కొత్తవలస, ఎస్ఎన్పీ, బంగారమ్మ కాలనీలు, సాయినగర్, బైపాస్ కాలనీ, చర్చివీధి, నెల్లిచెరువు గట్టు దిగువ భాగం, ఇందిరాకాలనీ, పార్వతీనగర్ తదితర చోట్ల ఎక్కువగా ఖాళీ ప్రాంతాలను అధికారులు గుర్తించారు. వీటిని ఏళ్ల కింద కొనుగోలు చేసి ఖాళీగా వదిలేయడంతో లోతట్టుగా నిలిచి నీరు నిలుస్తోంది. ఇక్కడ పలువురికి నోటీసులు అందజేశారు. కానీ వాటిని శుభ్రం చేయించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కొన్ని చోట్ల తుప్పలు, పనికిరాని మొక్కలు నిలిచి అధ్వానంగా తయారవుతున్నాయి.
ఖజానాకు గండి..: ఖాళీ స్థలాలకు పన్ను విధించే అవకాశం ఉన్నా పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. దీంతో పురపాలిక ఏటా రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతోంది. స్థల యజమానులను గుర్తించి పన్ను వసూలు చేయడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే కాకుండా పరిసరాలు అధ్వానంగా ఉండటంతో పలు ప్రాంతాల్లో రోగాలు విజృంభిస్తున్నాయని, కాలానుగుణ వ్యాధుల బారిన పడుతున్నామని పలువురు చెబుతున్నారు.
* చర్యలు తీసుకుంటాం..: స్వచ్ఛ పరిరక్షణలో భాగంగా ఖాళీ స్థలాలను అభివృద్ధి చేయాలని ఆయా యజమానులకు సూచించాం. సుమారు 85 మందికి నోటీసులు జారీ చేశాం. సౌందర్య థియేటర్ వెనుక ఎక్కువ స్థలాలు గుర్తించాం. స్పందించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దోమల నివారణ చర్యల్లో భాగంగా ద్రావణం పిచికారీ చేస్తున్నాం. - ఆనంద్, పుర కమిషనరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావయ్యా.. మాగోడు వినవేమయ్యా!
[ 24-04-2024]
మాతాశిశు సంరక్షణే ధ్యేయమని చెప్పుకొంటున్న వైకాపా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అవస్థల్లోకి నెట్టింది. కనీస సదుపాయాలు లేక చిన్నారులు, లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. -
జగనన్న ఏలుబడి.. అవస్థల అంగన్వాడీ!
[ 24-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులకు ఆటపాటలతో కూడిన చదువు చెప్పడం, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడానికి సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వీటికి సొంత భవనాలు సమకూరక.. రేకుల షెడ్లలో, చాలీచాలని అద్దె కొంపల్లో కొనసాగుతున్నాయి. -
ఆడబిడ్డల సింహగర్జనలో.. వైకాపా కొట్టుకుపోతుంది
[ 24-04-2024]
‘తెదేపా ఎప్పుడూ మహిళా పక్షపాతి. ఆడపిల్లల అక్షరజ్ఞానంతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని నమ్మి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలికలంతా చదువుకోవాలని 8, 9, 10 తరగతుల వారికి సైకిళ్లు ఇచ్చా. -
స్ట్రాంగ్ రూంలు సిద్ధం చేయండి
[ 24-04-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూంలను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు -
జనాలు తక్కువ.. జెండాలెక్కువ
[ 24-04-2024]
విజయనగరం సమీపంలోని చెల్లూరులో మంగళవారం వైకాపా సిద్ధం సభ పేలవంగా సాగింది. -
డ్రైవర్లు... అల్లాడుతున్నారు!
[ 24-04-2024]
-
ఆర్వో కల్పనాకుమారి ఆకస్మిక బదిలీ
[ 24-04-2024]
సీతంపేట ఐటీడీఏ పీవో కల్పనాకుమారిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆమె పాలకొండ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిణిగా కూడా ఉన్నారు. -
హామీల జగన్మోసం..పనులంటే నిర్లక్ష్యం!
[ 24-04-2024]
‘మేం అధికారంలోకి వస్తే మడ్డువలస జలాశయం రెండోఫేజ్ పూర్తిచేసి, 37 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం’ అంటూ అయిదేళ్ల కిందట ఊదరగొట్టిన వైకాపా నేతలు ఆ సర్కారు కొలువు దీరిన తరువాత మాత్రం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది -
తెదేపాలోకి వైకాపా ఎంపీటీసీ సభ్యులు
[ 24-04-2024]
కొత్తవలసకు చెందిన పలువురు వైకాపా ఎంపీటీసీ సభ్యులు, ఆ పార్టీ నాయకులు తెదేపాలో చేరారు. శృంగవరపుకోటలో ప్రజాగళం సభకు వచ్చి సిరికి రిసార్ట్స్లో... -
బి-ఫారం అందుకున్న బేబినాయన
[ 24-04-2024]
బొబ్బిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి బేబినాయన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నుంచి బి-ఫారం అందుకున్నారు -
అన్నొస్తే.. ఇబ్బందులే
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘సిద్ధం’ సభ జరుగుతోందంటే ప్రజలకు ప్రయాణానికి పాట్లు తప్పడం లేదు. -
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి
[ 24-04-2024]
పుర్లి, దేవుదళ తదితర గ్రామాల్లో నియోజకవర్గ కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ప్రచారం నిర్వహించారు. కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, గెలిపించాలని విజ్ఞప్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM