logo

గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా వేడుకలు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీతంపేటలో మంగళవారం జిల్లాస్థాయి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వి.కళావతి, ఐటీడీఏ పీవో బి.నవ్య తెలిపారు. ఏర్పాట్లపై ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం అధికారులతో చర్చించారు. వారు మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా

Published : 09 Aug 2022 05:36 IST

ఎమ్మెల్యే కళావతితో మాట్లాడుతున్న పీవో నవ్య

సీతంపేట, న్యూస్‌టుడే: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీతంపేటలో మంగళవారం జిల్లాస్థాయి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వి.కళావతి, ఐటీడీఏ పీవో బి.నవ్య తెలిపారు. ఏర్పాట్లపై ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం అధికారులతో చర్చించారు. వారు మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు జరపనున్నట్లు తెలిపారు. వీటిని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఈఈ జి.మురళి, ఎంపీపీ బి.ఆదినారాయణ, ఏఎంసీ అధ్యక్షుడు మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని