గందరగోళం
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్)లో పర్యవేక్షకుల నియామకాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోస్టుల నియామకం అంతా విశాఖ జోన్ కేంద్రంగా జరుగుతోంది.
అంగన్వాడీ పర్యవేక్షకుల నియామకాలపై అనుమానాలు
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్)లో పర్యవేక్షకుల నియామకాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోస్టుల నియామకం అంతా విశాఖ జోన్ కేంద్రంగా జరుగుతోంది. పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 50 ఏళ్లలోపు వయసున్న అంగన్వాడీ కార్యకర్తలు ఈ పోస్టులకు అర్హులు. ఈ నెల 18న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. ఫలితాలు విడుదల చేయకుండా నేరుగా మెరిట్ పేరిట కొందరి పేర్లతో జాబితా తయారు చేసి వారికి మాత్రమే సమాచారం ఇచ్చినట్లు భోగట్టా. దీంతో మిగిలిన వారికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈనాడు-విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 1925 మంది పర్యవేక్షకుల కోసం పరీక్ష రాశారు. ఇందులో 48 మందితో మాత్రమే ఎంపిక జాబితాను తయారు చేశారు. ఏ పరీక్షకైనా నిర్వహణ అనంతరం కీ విడుదల చేస్తారు. తరువాత ఫలితాలు, మార్కుల జాబితా వివరాలు ప్రకటిస్తారు. ఇవేవీ లేకుండా నేరుగా మౌఖిక పరీక్షకు ఎంపికైన వారి వివరాలు పంపించారు. శనివారం సాయంత్రం సూపర్వైజర్లకు దీనిపై సమాచారం ఇచ్చారు. ఆదివారం సాయంత్రంలోగా ఎంపికైన వారు ఆంగ్లంలో మాట్లాడిన వీడియోను అప్లోడ్ చేయించాలని సూచించారు. ఈ మేరకు జాబితా పంపిస్తామన్నారు.
రాతపరీక్ష
45 మార్కులకు రాత పరీక్ష నిర్వహించారు. ఐదు మార్కులకు మౌఖిక పరీక్ష ఉంటుంది. ఇక్కడే అనుమానాలు తలెత్తుతున్నాయి. వృత్తికి సంబంధించిన అంశంపై అభ్యర్థి మూడు నుంచి ఐదు నిమిషాల నిడివిలో ఆంగ్లంలో మాట్లాడి ఈ వీడియోను అప్లోడ్ చేయాలి. పదో తరగతి అర్హతతో ఉద్యోగం సాధించిన అంగన్వాడీ కార్యకర్తల్లో చాలా మందికి ఆంగ్లంలో మాట్లాడడం రాదు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారే. దీంతో ఎంపికైన వారు ఆందోళన చెందుతున్నారు. రాత పరీక్షల వరకు సజావుగానే జరిగినా.. ఆ తరువాత పరిణామాలపైనే అనుమానాలు కలుగుతున్నాయని అభ్యర్థులు అంటున్నారు. డబ్బులు కూడా చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
67 మందికి ఒక్కరే
సాలూరు ప్రాజెక్టు పరిధిలో ఎవరూ ఉత్తీర్ణత సాధించలేదని కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. రామభద్రపురం మండలం నుంచి ఒక్కరే మౌఖిక పరీక్షకు ఎంపికైనట్లు సమాచారం. గంట్యాడ ప్రాజెక్టు పరిధిలో 67 మంది రాస్తే ఒక్కరే ఎంపిక కావడం గమనార్హం. మార్కుల జాబితా విడుదల చేస్తే లోపాలు, తప్పొప్పులు తెలుస్తాయని, అధికారులు దాచిపెట్టడం ఎందుకని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ నియామకాలపై జిల్లా అధికారులు కేవలం దరఖాస్తులు తీసుకోవడానికి మాత్రమే పరిమితమయ్యారు. ఇతర అంశాలతో సంబంధం లేకపోవడంతో అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయలేకపోతున్నారు. దీనిపై విజయనగరం ఐసీడీఎస్ పీడీ అనంతలక్ష్మిని వివరణ కోరగా.. రాష్ట్ర స్థాయిలోనే నియామక ప్రక్రియ జరుగుతుందని, అంతా పారదర్శకంగానే చేస్తున్నారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా శిలువ యాత్ర
[ 29-03-2024]
బలిజిపేట మండలంలో గుడ్ ఫ్రైడేను క్రైస్తవ భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. -
ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బలిజిపేట పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ మండల అధ్యక్షుడు పెంకి వేణుగోపాలనాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. -
ముగ్గురి పాలిట మృత్యువు
[ 29-03-2024]
మృత్యువు ఒకేసారి మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.. కన్నవారు లేకపోయినా తోడబుట్టిన వారికి అండగా ఉన్న మరొకరిని బలితీసుకుంది.. -
ఇదేం బాదుడు
[ 29-03-2024]
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని వైష్ణపు వీధిలో 998 చ.అ. ఓ నివాస భవనం (జీ+1) ఏఆర్వీ (వార్షిక అద్దె విలువ విధానం) అమల్లో ఉన్నప్పుడు 2020-21లో ఏడాదికి ఆస్తి పన్ను రూ.3792 ఉండేది. -
వేరే దారి లేక.. డోలీ మోత
[ 29-03-2024]
సరైన రోడ్లు లేకపోతే మనం అడుగు తీసి అడుగు బయట పెట్టలేం. అలాంటిది ఆ గిరిజన గ్రామంలో అసలు దారే లేదు. అలాంటి చోట ఏదైనా ప్రమాదం జరిగితే, ఆసుపత్రి దగ్గరలో లేకపోతే ఇక అంతే సంగతి. -
రోడ్లు లేవు.. సేవలూ కానరావు
[ 29-03-2024]
రైతులకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీలు ఆదాయ వనరుగానే మిగిలాయి. చెక్పోస్టుల ద్వారా కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరుతున్నా కనీస సేవలు కూడా అందించలేని పరిస్థితి నెలకొంది. -
నిండు గర్భిణులకు ‘నడక’ యాతన
[ 29-03-2024]
కొమరాడ మండలంలోని కొండ శిఖర గ్రామం గుమడంగి. ఇక్కడికి ఎలాంటి రోడ్డు సౌకర్యమూ లేదు. గిరిజనులు ఆరు కిలోమీటర్లు నడిస్తే ఒడిశా రాష్ట్రంలోని వంటామాడకి, 17 కి.మీ వెళ్తే ఆంధ్రాలోని కుంతేసు చేరుకుంటారు. -
మీ ఓటు పదిలమేనా..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ప్రతిసారి ఓటు వేస్తున్నాం ఈ సారి పోలింగ్ రోజున వినియోగించుకుంటామని ధీమాగా ఉంటే పొరబడినట్టే. -
సహకారం కరవు
[ 29-03-2024]
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్లు) నిస్తేజమవుతున్నాయి. లావాదేవీలు లేకపోవడంతో కొన్నేళ్లుగా సేవలు నిలిచిపోయాయి. -
అక్కడ సమస్యలనే చదవాలి!!
[ 29-03-2024]
వేలాది పుస్తకాలు.. పాఠకులకు పూర్తిస్థాయిలో వసతులు.. విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు సేదదీరేందుకు గదులు.. మరుగుదొడ్లు.. నచ్చిన పుస్తకాలు, పత్రికలు.. -
పరిశ్రమలు రావాలంటే.. చంద్రబాబు సీఎం కావాలి
[ 29-03-2024]
కూటమి అధికారంలోకి వచ్చి, చంద్రబాబునాయుడు సీఎం అయితే యువతకు ఉద్యోగాలు వస్తాయని తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. -
వాన కాదు.. వల్లకాడుకు దారి లేదు
[ 29-03-2024]
గజపతినగరంలో రైల్వే మూడో లైను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల్లో స్థానిక రాళ్ల చెరువుకు సంబంధించిన కల్వర్టును రైల్వే అధికారులు పొరపాటున కప్పేయడంతో సమీపంలోని రైల్వే కాలనీ వాసులు, రైతులు ఇక్కట్లు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం