logo

ద్విచక్రవాహనం ఢీకొని లారీ డ్రైవర్‌ మృతి

మండలంలోని లింగాలవలస కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ జిల్లా భీమిలి మండలం మజ్జివలస గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ బట్టు అప్పలరాజు (46) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 26 Sep 2022 03:11 IST

అప్పలరాజు (పాతచిత్రం)

డెంకాడ, న్యూస్‌టుడే: మండలంలోని లింగాలవలస కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ జిల్లా భీమిలి మండలం మజ్జివలస గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ బట్టు అప్పలరాజు (46) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కూడలి వద్ద లారీ ఆపి రహదారి దాటుతుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం బలంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అప్పలరాజును విశాఖ కేజీహెచ్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై మహేష్‌ తెలిపారు. మృతుని భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


రహదారి ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

డెంకాడ, న్యూస్‌టుడే: డెంకాడ మండలంలోని పెదతాడివాడ కూడలి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో గుమ్మలక్ష్మీపురం మండలం బీరుపాడుకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి పి.చక్రవర్తి(22) దుర్మరణం చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సీతం కళాశాలలో బీటెక్‌ చదివిన చక్రవర్తి తన స్నేహితుడు జి.అనిష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో నాతవలస నుంచి విజయనగరం వైపు వస్తుండగా పెదతాడివాడ వద్ద ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యారు.రహదారి పక్కన ఉన్న విద్యుత్తు స్తంభాన్ని బలంగా ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో కేంద్రాసుపత్రికి తరలించారు. చక్రవర్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై మహేష్‌ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని