logo

ఉక్కు పరిశ్రమ రక్షణకు కృషి

విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణకు  ప్రతిఒక్కరూ కృషిచేయాలని, అంతా ఏకమై కాపాడుకోవాలని తెదేపా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ టీఎన్‌టీయూఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లెనిన్‌బాబు,

Published : 26 Sep 2022 03:11 IST

ప్రచార పత్రాలను ఆవిష్కరిస్తున్న నాగార్జున, నాయకులు

చీపురుపల్లి, న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణకు  ప్రతిఒక్కరూ కృషిచేయాలని, అంతా ఏకమై కాపాడుకోవాలని తెదేపా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ టీఎన్‌టీయూఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లెనిన్‌బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి జి.నరేంద్రకుమార్‌ తదితరులు చీపురుపల్లిలో నాగార్జునను ఆయన నివాసంలో ఆదివారం కలిసి విన్నవించారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీఎన్‌టీయూఎస్‌ పార్లమెంటరీ అధ్యక్షుడు వి.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని