భూ సమస్యలకు.. ‘స్పందన ప్లస్’తో పరిష్కారం
ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ‘స్పందన’లో భూసంబంధిత అర్జీలే ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల సబ్ కలెక్టరు భావన, పాలకొండ ఆర్డీవో హేమలత ఆధ్వర్యంలో జరిగిన ‘స్పందన’లోనూ ఈ ఫిర్యాదులే కనిపించాయి.
జిల్లాలో వినూత్న ప్రయత్నానికి శ్రీకారం
వినతులు పరిశీలిస్తున్న కలెక్టరు నిశాంత్కుమార్
పార్వతీపురం, న్యూస్టుడే: ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ‘స్పందన’లో భూసంబంధిత అర్జీలే ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల సబ్ కలెక్టరు భావన, పాలకొండ ఆర్డీవో హేమలత ఆధ్వర్యంలో జరిగిన ‘స్పందన’లోనూ ఈ ఫిర్యాదులే కనిపించాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ‘స్పందన్ ప్లస్’ అనే కార్యక్రమాన్ని జిల్లాలో త్వరలో ప్రారంభించనున్నారు.
కార్యక్రమం సాగేదిలా..
ఇప్పటివరకు కలెక్టరు, ఎస్పీ నిర్వహించిన ‘స్పందన’లో వచ్చిన భూ సమస్యలను ముందుగా పరిశీలిస్తారు. తమ పరిధిలోనివి, కోర్టు వివాదాల్లో లేని వాటిపై దృష్టి సారిస్తారు. ఆయా మండలాల తహసీల్దార్లు, పోలీసుస్టేషను హౌస్ ఆఫీసర్లు హాజరై కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు. అనంతరం అర్జీదారులు, వారు ఫిర్యాదు చేసిన వ్యక్తులను పిలిపించి చర్చిస్తారు. ఇలా వారంలో గరిష్ఠంగా 10 అర్జీలనైనా పరిష్కరించాలని చూస్తున్నారు.
* తన ఇంటి స్థలాన్ని కొందరు దొంగ సంతకాలతో కబ్జా చేశారని సీతానగరం మండలానికి చెందిన తిరుపతిరావు ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు కలెక్టరేట్ నుంచి లేఖ వెళ్లింది. వారం గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తిరుపతిరావు మరోసారి కలెక్టరేట్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
* తమ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని, దీనికి సంబంధించిన రికార్డులు తారుమారు కావడంలో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందని నర్సిపురానికి చెందిన కుమార్ తరచూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రతి వారం కలెక్టరేట్కు వచ్చి పరిష్కారం కోసం విన్నవిస్తున్నారు.
రెవెన్యూ అర్జీలే అధికం
* జిల్లా ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు జరిగిన ‘స్పందన’లో 3,301 వినతులు వచ్చాయి. వీటిలో 899 రెవెన్యూ శాఖవే. ఇందులో ఎక్కువ పరిష్కారం కాలేదని అధికారులే గుర్తించారు. ప్రస్తుతం వీటిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
* భూ సమస్యలను కోర్టుల్లో తేల్చుకోవాలని చాలా మంది సూచిస్తారు. ఇలా కాకుండా రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో చర్చిస్తే పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. వీటిపై కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక చొరవ చూపడం ద్వారా పరిష్కారం దొరికే అవకాశముందని అర్జీదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వినూత్న ప్రయత్నం -నిశాంత్కుమార్, కలెక్టరు
అర్జీదారులు అధికారులపై ఎంతో నమ్మకంతో వచ్చి సమస్యలు చెబుతున్నారు. వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. కొన్ని భూ సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అందుకే ‘స్పందన ప్లస్’ను రూపొందించాం. త్వరలోనే కార్యక్రమం ప్రారంభిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్కు తరలివెళ్లిన తెదేపా తమ్ముళ్లు
[ 25-04-2024]
తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర గురువారం నామినేషన్కు వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని బలిజిపేట మండలంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగు తమ్ముళ్లు పార్వతీపురం జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. -
మా పాలన ఇంతే.. మీ దారి మీరే చూసుకోండి
[ 25-04-2024]
మన్యంలోని కొండలపై ఉన్న గ్రామాలకు వస్తే వీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుంది. అందుకేనేమో వీరు అక్కడికి వెళ్లరు.. ఒక వేళ వెళ్దామా అంటే రోడ్డు ఉంటే కదా.. అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వ పాలన. -
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?