logo

సేవలతోనే సాలూరుకు కీర్తి

క్షేత్రస్థాయిలో అందిస్తున్న సేవలతోనే సాలూరు పట్టణం జాతీయస్థాయిలో కీర్తినొందిందని ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర అన్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రథమస్థానం, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ అవార్డు రావడం అభినందనీయమన్నారు.

Published : 05 Oct 2022 03:34 IST

కమిషనర్‌, సిబ్బందిని అభినందిస్తున్న ఉపముఖ్యమంత్రి రాజన్నదొర

సాలూరు, న్యూస్‌టుడే: క్షేత్రస్థాయిలో అందిస్తున్న సేవలతోనే సాలూరు పట్టణం జాతీయస్థాయిలో కీర్తినొందిందని ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర అన్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రథమస్థానం, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ అవార్డు రావడం అభినందనీయమన్నారు. మంగళవారం పురపాలిక కౌన్సిల్‌ హాలులో అభినందన సభ నిర్వహించి కమిషనర్‌ హెచ్‌.శంకరరావు, సిబ్బందిని సత్కరించారు. చెత్తశుద్ధి, పారిశుద్ధ్య చర్యల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. పుర అధ్యక్షురాలు పి.ఈశ్వరమ్మ, ఉపాధ్యక్షుడు వి.అప్పలనాయుడు, సూరిబాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని