ఉద్యోగోన్నతులు గురూ..!
ప్రభుత్వ, జడ్పీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్జీటీ, పాఠశాల సహాయకుల ఉద్యోగోన్నతులకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. సీనియార్టీ జాబితాల విడుదల, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహించనుంది. ఈ నెల ఏడో తేదీన ప్రొవిజినల్ సీనియార్టీ జాబితా విడుదల చేస్తుంది.
ఉమ్మడి జిల్లాలో 132 మందికి అవకాశం
హేతుబద్ధీకరణతో తగ్గిన అవకాశాలు
ధ్రువపత్రాల పరిశీలన (పాత చిత్రం)
విజయనగరం విద్యా విభాగం, న్యూస్టుడే: ప్రభుత్వ, జడ్పీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్జీటీ, పాఠశాల సహాయకుల ఉద్యోగోన్నతులకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. సీనియార్టీ జాబితాల విడుదల, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహించనుంది. ఈ నెల ఏడో తేదీన ప్రొవిజినల్ సీనియార్టీ జాబితా విడుదల చేస్తుంది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత పదో తేదీన తుది జాబితా ప్రదర్శిస్తారు. 11, 12 తేదీల్లో ఉద్యోగోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు ఉపాధ్యాయులకు ఇస్తారు. ఈ నెల 13 వరకూ దీన్ని కొనసాగిస్తారు. విద్యాశాఖ ఇప్పటికే ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత నెల 26, 27 తేదీల్లో ధ్రువపత్రాల్ని పరిశీలించారు. హేతుబద్ధీకరణ వల్ల ఉమ్మడి జిల్లాలో 132 మందికి ప్రయోజనం కలుగుతుందని విద్యాశాఖ గణాంకాల బట్టి తెలుస్తోంది.
ఇదీ పరిస్థితి: పాఠశాల సహాయకులు(హిందీ)లో కొరత ఉన్న 25 పోస్టుల్లో 70 శాతం కోటా కింద 15 మందికే ఉద్యోగోన్నతి లభించనుంది. ఎస్జీటీలో హిందీ చేసిన వారికి ప్రాధాన్యమిస్తారు. బీ పీడీ పోస్టుల్లో పీఈటీ (వ్యాయామ ఉపాధ్యాయులు)లకు ఉద్యోగోన్నతి కల్పిస్తారు. ఎస్జీటీల్లో బీపీఈడీ చేసిన వారికి పీడీగా అవకాశం ఇవ్వాలనుకున్నా...అభ్యర్థులు లేకపోవడంతో 72 పోస్టులు ఖాళీగానే ఉండిపోనున్నాయి.
6న పరిశీలన
పాఠశాల సహాయకుల హిందీకి అర్హులైన వారికి ఉద్యోగోన్నతిని కల్పించనున్నాం. ఈ నెల 6న డీఈవో కార్యాలయంలో అర్హుల ధ్రువపత్రాలను పరిశీలిస్తాం. ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చాం.
- కె.వెంకటేశ్వరరావు, ఇన్ఛార్జి డీఈవో
ఉపాధ్యాయుల కొరతతో...: హేతుబద్ధీకరణతో కొన్ని కేడర్లలో ఉపాధ్యాయుల కొరత ఉండడంతో వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. మిగులు పోస్టుల్ని సర్దుబాటు చేయగా తొలుత గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సహాయకుల ఆంగ్లం, పీడీ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా పాఠశాల సహాయకుల హిందీ సబ్జెక్టులోనూ ఉద్యోగోన్నతులు కల్పించాలని ఆదేశాలు రావడంతో సీనియార్టీ జాబితా ప్రకారం ఉపాధ్యాయుల ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి విజయంతోనే భవిష్యత్తు
[ 19-04-2024]
మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కోరారు. -
బడాయి మావయ్యా.. బువ్వ.. గుడ్డు ఏదయ్యా
[ 19-04-2024]
మీకు అన్నను.. మీ పిల్లలకు మావయ్యను అని చెప్పుకొని తిరిగే సీఎం జగన్మోహన్రెడ్డి ఆ మాటలను నిజం చేసుకోలేకపోయారు. ఈ ఐదేళ్లూ పిల్లలకు నాసిరకం భోజనాలే అందించారు. -
భేష్.. ముహూర్త బలం
[ 19-04-2024]
శుక్రవారం.. ఏకాదశి.. మంచి ముహూర్తం, యోగ బలం బాగుంది.. పండితులు చెప్పిన మాట.. -
తొలిరోజు 12 నామినేషన్లు
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. చీపురుపల్లి, రాజాం, గజపతినగరం నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. తొలిరోజు అసెంబ్లీ స్థానాలకు 10, విజయనగరం ఎంపీ స్థానానికి ఇద్దరు అందించారు. -
బడ్డుకొండ సంపద రూ.11.25 కోట్లేనట!!
[ 19-04-2024]
నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడి (52) సంపద అయిదేళ్లలో రూ.3 కోట్లే పెరిగిందట. ఇది విన్న నియోజకవర్గ ప్రజలు అబ్బే అంత తక్కువ ఉండటం ఏమిటని అనుకోవడం వినిపించింది. -
మాయల పకీరు జగన్ అవసరమా?: కళా
[ 19-04-2024]
మాయల పకీరు ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజలంతా ఆలోచించాలని కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. మెరకముడిదాం మండలం గర్భాం మేజరు పంచాయతీలో గురువారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. -
బోసినవ్వుల చిన్నారిని.. వైకాపా రథం చిదిమేసింది
[ 19-04-2024]
‘అమ్మా..వెంటనే వచ్చేస్తాను’ అంటూ బయటకు వెళ్లిన ఆ చిన్నారి తీరని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్లెదుటే అంత వరకూ హుషారుగా ఇంట్లో తిరిగిన ఆ బాలుడు నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయాడు. -
ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలేవీ?
[ 19-04-2024]
శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. -
జగన్ దగాతో రైతు బేజారు!
[ 19-04-2024]
గత ప్రభుత్వం రూ.36లక్షల నిధులతో సాలూరులోని దండిగాం రోడ్డులో రైతు బజారు నిర్మించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతకుముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక్క దుకాణం కూడా ఏర్పాటు చేయలేదు. -
శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం
[ 19-04-2024]
శుభకార్యానికి వెళ్లేందుకు అందరూ సరదాగా బయలుదేరారు. ప్రత్యేకంగా సమకూర్చుకున్న వాహనంలో కబుర్లు చెప్పుకొంటూ వెళ్తున్నారు. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొనడంతో ముందు భాగం ఛిద్రమైంది. -
జంఝాటం
[ 19-04-2024]
తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైకాపా ఏనాడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం అన్నదాత వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి రాక ముందు అనేక హామీలను నీటిమూటల్లో నింపేసిన సీఎం జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మేమింతే అన్నట్లు వాటన్నింటినీ అటకెక్కించేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ