logo

బొబ్బిలి కోటలో ఆయుధ పూజ

బొబ్బిలి కోటలో సంప్రదాయం ప్రకారం ఆయుధ పూజను శాస్త్రోక్తంగా రాజవంశీకులు మంగళవారం నిర్వహించారు. దర్బార్‌మహాల్‌లో జరిగిన ఉత్సవాల్లో మాజీ మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు, రామ్‌నాయన, బేబినాయన, విశాల్‌నాయన, వారసులు పాల్గొన్నారు.

Published : 05 Oct 2022 03:43 IST

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి కోటలో సంప్రదాయం ప్రకారం ఆయుధ పూజను శాస్త్రోక్తంగా రాజవంశీకులు మంగళవారం నిర్వహించారు. దర్బార్‌మహాల్‌లో జరిగిన ఉత్సవాల్లో మాజీ మంత్రి సుజయ్‌కృష్ణరంగారావు, రామ్‌నాయన, బేబినాయన, విశాల్‌నాయన, వారసులు పాల్గొన్నారు. బొబ్బిలి యుద్ధంలో వినియోగించిన ఆయుధాలు, బళ్లాలు, కత్తులు, ఇతర వస్తువులకు ప్రత్యేక పూజలు చేశారు. సందర్శకులు ఆసక్తిగా తిలకించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని