ఇళ్లెందుకు కట్టలేరు?
‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద జగనన్న కాలనీల్లోని లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అయితే.. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 960 లేఅవుట్లు ఉండగా.. చాలా చోట్ల అవి లేక గృహాలు నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు.
సౌకర్యాలు ఉండాలి కదండీ
‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద జగనన్న కాలనీల్లోని లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అయితే.. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 960 లేఅవుట్లు ఉండగా.. చాలా చోట్ల అవి లేక గృహాలు నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు.
ఎస్.కోట మండలం వెంకటరమణపేట లేఅవుట్లో 58 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు. సింగిల్ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, ఆరు విద్యుత్తు స్తంభాలు వేశారు. ఆ తర్వాత ఎటువంటి పనులు చేపట్టలేదు.
విజయనగరం అర్బన్, ఎస్.కోట, పార్వతీపురం పురపాలిక, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ న్యూస్టుడే
రెండు జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.17.65 కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించారు. పార్వతీపురం మన్యంలో రూ.6.83 కోట్లు, విజయనగరం జిల్లాలో రూ.10.82 కోట్లు మంజూరు చేశారు. తాగునీరు, అప్రోచ్ రోడ్లు, అంతర్గత రహదారులు, విద్యుత్తు లైన్ల మార్పిడి, గోదాముల నిర్మాణం, స్థలాల చదును తదితర వాటిని ఈ నిధులతో చేపట్టాల్సి ఉంది. తాగునీటి పనుల్లో కొంత పురోగతి కనిపిస్తున్నా, ఇతర వాటిలో అంతంతమాత్రమే. విజయనగరం జిల్లాలో 962 తాగునీటి పనులకు గానూ 912 పూర్తయ్యాయి. 436 పనులకే విద్యుత్తు సౌకర్యం కల్పించారు. పార్వతీపురం మన్యంలో 328 తాగునీటి పనులకు గానూ 216 పూర్తి కాగా, 63 పనులకు మాత్రమే విద్యుత్తు సౌకర్యం కల్పించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
కొమరాడ మండలం మాదలింగి కాలనీలో 15 ఇళ్లు మంజూరు చేశారు. రెండు విద్యుత్తు స్తంభాలు వేసినా కరెంట్ ఇవ్వలేదు. భూమిని చదును చేసి రోడ్డు వేసినా వదిలేయడంతో ఇలా మారిపోయింది.
వేగవంతం చేయాలని ఆదేశించాం
పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చూస్తున్నాం. అయితే వర్షాల వల్ల నిలిచిపోయాయి. మంజూరు చేసినవి వేగవంతం చేయాలని సంబంధిత శాఖలకు జిల్లా ఉన్నతాధికారుల ద్వారా ఆదేశించాం. వాటిని పర్యవేక్షిస్తాం.
- ఎస్.వి.రమణమూర్తి, రఘురాం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల గృహ నిర్మాణ శాఖ అధికారులు
ఇటీవల జడ్పీ సర్వసభ్య సమావేశానికి తెలియజేసిన సమాచారం ఆధారంగా వివరాలిలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని