రారండోయ్... మునగ నర్సరీలకు!
మునగ ఆకు, మునగకాడలు తెలియని వారు ఉండరు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఎవరినడిగినా చెబుతారు. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా జిల్లాలో మునగ నర్సరీల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
గుర్లలో నర్సరీని పరిశీలిస్తున్న వెలుగు అధికారులు
విజయనగరం మయూరి కూడలి, న్యూస్టుడే: మునగ ఆకు, మునగకాడలు తెలియని వారు ఉండరు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఎవరినడిగినా చెబుతారు. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా జిల్లాలో మునగ నర్సరీల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డీఆర్డీఏ-వెలుగు ఆధ్వర్యంలో ఉపాధి హామీ నిధులతో ప్రత్యేక ప్రాజెక్టుగా నర్సరీల ఏర్పాటుకు ఈ ఏడాది మే, జూన్లో సర్వే చేశారు. మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. జిల్లాలో 48.40 ఎకరాల్లో మునగ నర్సరీలు ఏర్పాటవుతాయని తొలుత భావించారు. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. స్వయం సహాయక సంఘాల్లో 4,47,850 మంది సభ్యులకు ఐదు మొక్కల చొప్పున 22,39,250 అవసరం కాగా ప్రస్తుతం నర్సరీల్లో 5,52,500 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. కేవలం 19 మండలాల్లో 54 మంది రైతులు 8.10 ఎకరాల్లో 36 నర్సరీలను మాత్రమే ఏర్పాటు చేయడంతో అధికారులు కంగుతిన్నారు. డెంకాడ, బొబ్బిలి, తెర్లాం, బాడంగి, భోగాపురం, రామభద్రపురం, విజయనగరం, దత్తిరాజేరు, మెంటాడ మండలాలకు చెందిన 34 మంది రైతులు ముందుకు వచ్చి తర్వాత వెనకడుగు వేశారు. దీంతో జిల్లాలో మొక్కల పంపిణీని పూర్తిస్థాయిలో అధికారులు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు.
నిధుల కేటాయింపు..
నర్సరీలకు అవసరమైన నిధులు ఉపాధి హామీ (నరేగా) ద్వారా నేరుగా రైతు ఖాతాకే చెల్లిస్తారు. ఐదు నుంచి పది సెంట్ల నర్సరీ యూనిట్కు రూ.29,890, అదే ఎకరా యూనిట్కు రూ.5,56,000 ఇవ్వనున్నారు. మొక్కలు అందుబాటులోకి వచ్చాక అధికారుల సూచనల మేరకు ప్రతి మహిళకు ఉచితంగా అయిదేసి మొక్కలు ఇవ్వాలనేది నిబంధన. జిల్లాలో పెద్ద నర్సరీని చీపురుపల్లి మండలంలో ఎకరా పొలంలో ఏర్పాటు చేశారు.
దశల వారీగా అందరికి. : దశల వారీగా ఎక్కువ నర్సరీలు ఏర్పాటు చేసి ప్రతి మహిళకు మొక్కలు అందిస్తాం. మునగ ప్రయోజనాలపై అవగాహన కల్పించి రైతులతో నర్సరీల ఏర్పాటుకు చర్యలు చేపడతాం. అందుబాటులోకి వచ్చిన మొక్కలను తొలుత పంపిణీ చేస్తాం. మళ్లీ అదే నర్సరీలో రైతులకు ఆసక్తి ఉంటే మళ్లీ వారితోనే వీటిని పెంచేలా ప్రోత్సహిస్తాం.
-ఎ.కల్యాణ్ చక్రవర్తి, పథక సంచాలకుడు, డీఆర్డీఏ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన ఇంతే.. మీ దారి మీరే చూసుకోండి
[ 25-04-2024]
మన్యంలోని కొండలపై ఉన్న గ్రామాలకు వస్తే వీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుంది. అందుకేనేమో వీరు అక్కడికి వెళ్లరు.. ఒక వేళ వెళ్దామా అంటే రోడ్డు ఉంటే కదా.. అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వ పాలన. -
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు