logo

అర్జీదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలి

సచివాలయాల్లో మెరుగైన సేవలు అందితే జిల్లా ప్రగతి పథంలో నడుస్తుందని డ్వామా పీడీ కె.రామచంద్రరావు అన్నారు.

Published : 27 Nov 2022 02:21 IST

సమావేశంలో సూచనలిస్తున్నడ్వామా పీడీ రామచంద్రరావు, ఏపీడీ చంద్రమ్మ, చిట్టిబాబు

పార్వతీపురం, న్యూస్‌టుడే: సచివాలయాల్లో మెరుగైన సేవలు అందితే జిల్లా ప్రగతి పథంలో నడుస్తుందని డ్వామా పీడీ కె.రామచంద్రరావు అన్నారు. శనివారం గిరిమిత్ర సమావేశ మందిరంలో సచివాలయ ఉద్యోగులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా సమన్వయకర్త వి.చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని పీడీ సూచించారు. అర్జీలు ఇచ్చే వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడి, సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏపీడీ చంద్రమ్మ, డీఎల్‌డీవో గోపాలకృష్ణ, రాజేశ్‌, ప్రహ్లాద్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని