logo

మన్యంలో సందర్శకుల సందడి

సీతంపేట మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు ఆదివారం పర్యాటకులు పొటెత్తారు. ఎన్టీఆర్‌ సాహస ఉద్యానవనంలో బోటుషికారు, సాహస క్రీడలు, కయాకింగ్‌ చేస్తూ కేరింతలు కొట్టారు.

Updated : 30 Jan 2023 06:23 IST

సీతంపేట పార్కులో చెరువుపై ఊగే వంతెనపై నడుస్తున్న యువతులు, ఉద్యానవనంలో బోటుషికారు

సీతంపేట మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు ఆదివారం పర్యాటకులు పొటెత్తారు. ఎన్టీఆర్‌ సాహస ఉద్యానవనంలో బోటుషికారు, సాహస క్రీడలు, కయాకింగ్‌ చేస్తూ కేరింతలు కొట్టారు. ఇక్కడ 5డీ థియేటర్‌లో ప్రదర్శనలు వీక్షించారు. 3డీ పెయింటింగ్‌ వద్ద ఫొటోలు దిగారు. ఆనంద వేదిక వద్ద నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మెట్టుగూడ, దోనుబాయి వద్ద సున్నపుగెడ్డ జలపాతాలు, ఆడలి వ్యూపాయింట్‌, జగతిపల్లి కొండలను సందర్శించారు. ఆహ్లాదకర ప్రకృతి ఒడిలో.ఆనందంగా గడిపి మధురానుభూతులతో తిరుగు పయనమయ్యారు. సీతంపేట పార్కులో  సందర్శకులకు అవసరమైన ఏర్పాట్లను కేర్‌ టేకర్‌ సవర రాజు పర్యవేక్షించారు.  

- న్యూస్‌టుడే, సీతంపేట

సీతంపేట పార్కులో క్లైంబింగ్‌ వాల్‌ ఎక్కుతున్న యువతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని