దూరాభారం!
జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో ప్రజల అవసరాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పాత రహదారులను నియోజకవర్గాల మధ్య అనుసంధానం చేస్తే మరింత సౌకర్యం ఏర్పడుతుంది.
నియోజకవర్గాల మధ్య రహదారులకు మోక్షమేదీ?
నిధులున్నా కానరాని ప్రగతి
న్యూస్టుడే, గజపతినగరం, బొబ్బిలి, గరివిడి
జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో ప్రజల అవసరాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పాత రహదారులను నియోజకవర్గాల మధ్య అనుసంధానం చేస్తే మరింత సౌకర్యం ఏర్పడుతుంది. గజపతినగరం, బొబ్బిలి, చీపురుపల్లి నియోజకవర్గాల్లో నాలుగేళ్ల కిందట ఏపీఆర్ఆర్ పథకంలో రూ.120 కోట్లతో 64 పనులు మంజూరు చేశారు. వాటిలో 24 పూర్తి కాగా 15 పనులను ప్రారంభించలేదు. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.
* గజపతినగరం నియోజకవర్గంలో మర్రివలస వంతెన నిర్మాణం, పాపయ్యవలస, కరకవలస రహదారుల పనులు ప్రారంభించాల్సి ఉంది. మరడాం, మర్రివలస, ఎస్.చింతలవలస పనులు జరుగుతుండగా.. గోభ్యాం, వంగర గ్రామాల్లో ప్రారంభదశలో ఉన్నాయి.
* బొబ్బిలిలో 20 పనులు ప్రారంభదశలో ఉన్నాయి. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో ఆరు పూర్తి కాగా.. మరో పది ప్రారంభంలోనే మూలుగుతున్నాయి.
* గజపతినగరం నియోజకవర్గంలో కెంగువ రహదారి అభివృద్ధికి రూ.7.5 కోట్లతో ప్రతిపాదనలున్నాయి. ఉపాధి హామీ నిధులతో 50 రహదారులను తారురోడ్లుగా మార్చేందుకు ప్రతిపాదనలున్నాయి.
* చీపురుపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులు రూ.24 కోట్లతో 42 రహదారుల అభివృద్ధికి టెండర్లు పిలవాల్సి ఉంది.
ఇది తెర్లాం మండలం ఉద్దవోలు నుంచి గడిముడిదాం మీదుగా రాజాంకు వెళ్లే రహదారి. 5 కి.మీ. రహదారిని అభివృద్ధి చేస్తే బొబ్బిలి, రాజాం నియోజకవర్గాల మధ్య కొన్ని గ్రామాలకు దగ్గర దారి ఏర్పడుతుంది. చదును చేసే పనులకు రూ.6 లక్షలు వినియోగించారు. అభివృద్ధి పనులకు రూ.1.5 కోట్ల ఉపాధి హామీ నిధులు మంజూరయ్యాయి. సాంకేతిక సమస్యలతో పనులు నిలిచిపోయాయని పీఆర్ ఏఈఈ రుక్మాంగదనాయుడు తెలిపారు.
న్యూస్టుడే, తెర్లాం
ఇది గజపతినగరం మండలం వేమలి, దత్తిరాజేరు మండలం ఎం.కొత్తవలస గ్రామాల రహదారి. మధ్యలో కొండవాగుకు కల్వర్టు నిర్మించాల్సి ఉంది. రెండు కి.మీ. రహదారిని అభివృద్ధి చేస్తే చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల మధ్య దూరం తగ్గుతుంది. రెండు దశాబ్దాల కిందట నుంచి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం నుంచి బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలాన్ని కలిపే రహదారిలో ఎర్రిగెడ్డపై వంతెన నిర్మిస్తే రాకపోకలు సులభమవుతాయి. మెంటాడ మండల వాసులు నేరుగా బొబ్బిలి డివిజన్ కార్యాలయానికి వెళ్లేందుకు 20 కి.మీ. దూరం తగ్గుతుంది. పోరాం ఉన్నత పాఠశాల సమీపంలో రహదారి నిర్మాణానికి గ్రావెల్ వేసి వదిలేశారు. రహదారి, వంతెన నిర్మాణ పనులను ప్రతిపాదించాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
న్యూస్టుడే, మెంటాడ
దగ్గర దారులకు ప్రతిపాదనలేవీ?
కొత్తగా జిల్లాల స్వరూపం మారిన నేపథ్యంలో చిన్న చిన్న రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంది. గజపతినగరం, గుర్ల మండలాల్లో మునకాలపేట రోడ్డు, కెంగువ వద్ద కల్వర్టు, వేమలి నుంచి ఎం.లింగాలవలస రహదారి, బాడంగి మండలంలో గొల్లాది వద్ద వంతెన, మెంటాడ మండలంలో పోరాం వద్ద ఎర్రిగెడ్డపై కల్వర్టు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రాజాం, తెర్లాం మండలాల మధ్య చిన్న రహదారులను అభివృద్ధి చేయాలి. వీట మంజూరుకు ప్రయత్నిస్తే మరింత సౌకర్యంగా ఉంటుందని ప్రజలు అంటున్నారు.
పనులు వేగవంతం చేయిస్తాం
- అప్పలనాయుడు, రమణమూర్తి, రామ్మోహనరావు, పీఆర్ ప్రాజెక్టు విభాగం డీఈఈలు, గజపతినగరం, చీపురుపల్లి, బొబ్బిలి
ఏపీఆర్ఆర్పీ నిధులతో మంజూరైన రహదారుల పనులు ప్రారంభమయ్యాయి. వాటిని వేగవంతం చేయిస్తాం. రహదారుల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం, ఏఎంసీ నిధులతో ప్రతిపాదనలున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావయ్యా.. మాగోడు వినవేమయ్యా!
[ 24-04-2024]
మాతాశిశు సంరక్షణే ధ్యేయమని చెప్పుకొంటున్న వైకాపా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అవస్థల్లోకి నెట్టింది. కనీస సదుపాయాలు లేక చిన్నారులు, లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. -
జగనన్న ఏలుబడి.. అవస్థల అంగన్వాడీ!
[ 24-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులకు ఆటపాటలతో కూడిన చదువు చెప్పడం, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడానికి సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వీటికి సొంత భవనాలు సమకూరక.. రేకుల షెడ్లలో, చాలీచాలని అద్దె కొంపల్లో కొనసాగుతున్నాయి. -
ఆడబిడ్డల సింహగర్జనలో.. వైకాపా కొట్టుకుపోతుంది
[ 24-04-2024]
‘తెదేపా ఎప్పుడూ మహిళా పక్షపాతి. ఆడపిల్లల అక్షరజ్ఞానంతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని నమ్మి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలికలంతా చదువుకోవాలని 8, 9, 10 తరగతుల వారికి సైకిళ్లు ఇచ్చా. -
స్ట్రాంగ్ రూంలు సిద్ధం చేయండి
[ 24-04-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూంలను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు -
జనాలు తక్కువ.. జెండాలెక్కువ
[ 24-04-2024]
విజయనగరం సమీపంలోని చెల్లూరులో మంగళవారం వైకాపా సిద్ధం సభ పేలవంగా సాగింది. -
డ్రైవర్లు... అల్లాడుతున్నారు!
[ 24-04-2024]
-
ఆర్వో కల్పనాకుమారి ఆకస్మిక బదిలీ
[ 24-04-2024]
సీతంపేట ఐటీడీఏ పీవో కల్పనాకుమారిని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆమె పాలకొండ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిణిగా కూడా ఉన్నారు. -
హామీల జగన్మోసం..పనులంటే నిర్లక్ష్యం!
[ 24-04-2024]
‘మేం అధికారంలోకి వస్తే మడ్డువలస జలాశయం రెండోఫేజ్ పూర్తిచేసి, 37 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం’ అంటూ అయిదేళ్ల కిందట ఊదరగొట్టిన వైకాపా నేతలు ఆ సర్కారు కొలువు దీరిన తరువాత మాత్రం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది -
తెదేపాలోకి వైకాపా ఎంపీటీసీ సభ్యులు
[ 24-04-2024]
కొత్తవలసకు చెందిన పలువురు వైకాపా ఎంపీటీసీ సభ్యులు, ఆ పార్టీ నాయకులు తెదేపాలో చేరారు. శృంగవరపుకోటలో ప్రజాగళం సభకు వచ్చి సిరికి రిసార్ట్స్లో... -
బి-ఫారం అందుకున్న బేబినాయన
[ 24-04-2024]
బొబ్బిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి బేబినాయన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నుంచి బి-ఫారం అందుకున్నారు -
అన్నొస్తే.. ఇబ్బందులే
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘సిద్ధం’ సభ జరుగుతోందంటే ప్రజలకు ప్రయాణానికి పాట్లు తప్పడం లేదు. -
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి
[ 24-04-2024]
పుర్లి, దేవుదళ తదితర గ్రామాల్లో నియోజకవర్గ కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ప్రచారం నిర్వహించారు. కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, గెలిపించాలని విజ్ఞప్తి చేశారు