భవనాలు పూర్తి.. సమస్యలకు స్వస్తి
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఈ భవనం జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.06 కోట్లు మంజూరు చేసింది. మూడేళ్ల క్రితం పనులకు శంకుస్థాపన చేశారు. కొవిడ్ తదితర కారణాలతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది.
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఈ భవనం జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.06 కోట్లు మంజూరు చేసింది. మూడేళ్ల క్రితం పనులకు శంకుస్థాపన చేశారు. కొవిడ్ తదితర కారణాలతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. దీనిపై ‘ఈనాడు’లో పలుమార్లు వెలువడిన కథనాలకు ఇంజినీరింద్ అధికారులు స్పందించారు. ఆరు నెలలుగా పనులు జోరుగా సాగడంతో నిర్మాణం పూర్తయింది. ఇది అందుబాటులోకి వస్తే గ్రహణమొర్రితో పాటు చిన్నారులకు సంబంధించిన వివిధ రుగ్మతులకు వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ విభాగానికి సంబంధించి వైద్యాధికారితో పాటు సిబ్బంది నియామకాలు జరిగాయి.
పార్వతీపురం పట్టణం, న్యూస్టుడే: జిల్లా ఆసుపత్రిలో పడకల సమస్యకు త్వరలో పరిష్కారం దొరకనుంది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త భవనాల నిర్మాణాలు పూర్తవడంతో ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. జిల్లా ఏర్పాటు తర్వాత పార్వతీపురం ప్రాంతీయాసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చారు. పడకలను 100 నుంచి 150కి పెంచారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న స్థలంలో పడకలను సర్దుబాటు చేసి సేవలు అందిస్తున్నారు. కాలానుగుణ వ్యాధులు ప్రబలే సమయంలో ఒక్కో మంచంపై ముగ్గురు రోగులు ఉండే పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో చర్యలు చేపట్టారు.
త్వరలో ప్రారంభం..
బాలల సత్వర చికిత్స కేంద్రంతో పాటు బర్త్వెయిటింగ్ హాల్ను ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి 2020లో కేంద్రం రూ.30 లక్షలు మంజూరు చేసింది. అదే ఏడాది డిసెంబరులో పనులు ప్రారంభించారు. కొన్ని నెలల క్రితం భవనం సిద్ధమైనా సాంకేతిక ఇబ్బందులు రావడంతో ప్రారంభానికి నోచుకోలేదు. ఇటీవల అధికారులు వాటిని సరిచేశారు. దీంతోపాటు రూ.21 కోట్ల నాబార్డు నిధులతో ప్రత్యేక ప్రసూతి విభాగం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. అది పూర్తి అయ్యేందుకు కొంత సమయం పట్టనుంది. ఈ మూడు భవనాలు అందుబాటులోకి వస్తే ఆసుపత్రిలో వసతి సమస్య తీరనుందని సూపరింటెండెంటు వాగ్దేవి తెలిపారు. బాలల సత్వర చికిత్స కేంద్రం, బర్త్ వెయిటింగ్ హాల్ను త్వరలో ప్రారంభిస్తామని ఏపీఎంఐఎస్డీసీ ఈఈ సత్యప్రభాకర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి విజయంతోనే భవిష్యత్తు
[ 19-04-2024]
మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కోరారు. -
బడాయి మావయ్యా.. బువ్వ.. గుడ్డు ఏదయ్యా
[ 19-04-2024]
మీకు అన్నను.. మీ పిల్లలకు మావయ్యను అని చెప్పుకొని తిరిగే సీఎం జగన్మోహన్రెడ్డి ఆ మాటలను నిజం చేసుకోలేకపోయారు. ఈ ఐదేళ్లూ పిల్లలకు నాసిరకం భోజనాలే అందించారు. -
భేష్.. ముహూర్త బలం
[ 19-04-2024]
శుక్రవారం.. ఏకాదశి.. మంచి ముహూర్తం, యోగ బలం బాగుంది.. పండితులు చెప్పిన మాట.. -
తొలిరోజు 12 నామినేషన్లు
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. చీపురుపల్లి, రాజాం, గజపతినగరం నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. తొలిరోజు అసెంబ్లీ స్థానాలకు 10, విజయనగరం ఎంపీ స్థానానికి ఇద్దరు అందించారు. -
బడ్డుకొండ సంపద రూ.11.25 కోట్లేనట!!
[ 19-04-2024]
నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడి (52) సంపద అయిదేళ్లలో రూ.3 కోట్లే పెరిగిందట. ఇది విన్న నియోజకవర్గ ప్రజలు అబ్బే అంత తక్కువ ఉండటం ఏమిటని అనుకోవడం వినిపించింది. -
మాయల పకీరు జగన్ అవసరమా?: కళా
[ 19-04-2024]
మాయల పకీరు ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజలంతా ఆలోచించాలని కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. మెరకముడిదాం మండలం గర్భాం మేజరు పంచాయతీలో గురువారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. -
బోసినవ్వుల చిన్నారిని.. వైకాపా రథం చిదిమేసింది
[ 19-04-2024]
‘అమ్మా..వెంటనే వచ్చేస్తాను’ అంటూ బయటకు వెళ్లిన ఆ చిన్నారి తీరని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్లెదుటే అంత వరకూ హుషారుగా ఇంట్లో తిరిగిన ఆ బాలుడు నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయాడు. -
ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలేవీ?
[ 19-04-2024]
శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. -
జగన్ దగాతో రైతు బేజారు!
[ 19-04-2024]
గత ప్రభుత్వం రూ.36లక్షల నిధులతో సాలూరులోని దండిగాం రోడ్డులో రైతు బజారు నిర్మించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతకుముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక్క దుకాణం కూడా ఏర్పాటు చేయలేదు. -
శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం
[ 19-04-2024]
శుభకార్యానికి వెళ్లేందుకు అందరూ సరదాగా బయలుదేరారు. ప్రత్యేకంగా సమకూర్చుకున్న వాహనంలో కబుర్లు చెప్పుకొంటూ వెళ్తున్నారు. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొనడంతో ముందు భాగం ఛిద్రమైంది. -
జంఝాటం
[ 19-04-2024]
తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైకాపా ఏనాడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం అన్నదాత వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి రాక ముందు అనేక హామీలను నీటిమూటల్లో నింపేసిన సీఎం జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మేమింతే అన్నట్లు వాటన్నింటినీ అటకెక్కించేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత