ఊరొదిలి.. ఇళ్లొదిలి ఎక్కడికి పొమ్మంటారు!
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి 2200 ఎకరాలు అవసరం కాగా.. ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల కోసం మరో 500 ఎకరాలు సేకరించింది. మరడపాలెంలో 223, ముడసర్లపేటలో 33, బొల్లింకలపాలెంలో 55, రెల్లిపేటలో 85 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తున్నారు.
ఈనాడు-విజయనగరం, భోగాపురం, న్యూస్టుడే
ఓ వైపు పునరావాస కాలనీల్లో ఇంకా గృహాల నిర్మాణం జరుగుతోంది. మరో వైపు ఆదివారం అధికారులు వచ్చి గ్రామాలు ఖాళీ చేయండి.. మీరున్న ఇళ్లు కూల్చేస్తామనడంతో కంగుతిన్నారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వాసితులు. పోనీ.. కాలనీలో సదుపాయాలు ఉన్నాయా అంటే పనులు కొనసాగుతున్నాయి. అలాంటప్పుడు ఊరొదిలి పొమ్మంటే ఎలా అని ఆందోళన చెందుతున్నారు.
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి 2200 ఎకరాలు అవసరం కాగా.. ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల కోసం మరో 500 ఎకరాలు సేకరించింది. మరడపాలెంలో 223, ముడసర్లపేటలో 33, బొల్లింకలపాలెంలో 55, రెల్లిపేటలో 85 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా గూడెపువలసలో 17 ఎకరాలు, పోలిపల్లి రెవెన్యూ లింగాలవలసలో 25 ఎకరాల్లో కాలనీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఇళ్లు చాలావరకు నిర్మాణంలో ఉండగా గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు చెబుతున్నారు. వెళ్లకపోతే విద్యుత్తు, నీటి సరఫరా ఆపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ముడసర్లపేట, బొల్లింకపాలెంలో నాలుగు ఇళ్లతో పాటు ఒక పాఠశాల భవనాన్ని జేసీబీలతో తొలగించారు.
చదువులు అగమ్యగోచరం
నిర్వాసిత గ్రామాల్లోని పాఠశాలలు మూసేయాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ చదువుతున్న పిల్లలను ఎక్కడ సర్దుబాటు చేస్తారో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. శనివారం రాత్రి ఆయన చరవాణి ద్వారా ఓ వాయిస్ మెసేజ్ పంపించారు. అందులో ‘రేపు ఉదయం పాఠశాలలను కూల్చేస్తారు. ముందుగానే నోటీసు ఇచ్చినట్లు భావించండి. విలువైన రిజిస్టర్లు, రికార్డులు, సామగ్రి సురక్షిత ప్రదేశానికి తరలించండి. ఉపాధ్యాయులు, సిబ్బంది సెలవులు పెడితే నాకు సంబంధం లేదు. పొరపాటున ఏదైనా జరగరానిది జరిగితే మీరే బాధ్యులు.’’ అని ఉంది. దీంతో ఆదివారం ఉపాధ్యాయులంతా విధుల్లో ఉండి సామగ్రిని తరలించారు.
అంతన్నారు.. ఇంతన్నారు
ఇంటి గ్రాంటు రూ.2.75 లక్షలు, ఆర్థిక సాయం రూ.5 లక్షలు, తాత్కాలిక భృతి నెలకు రూ.3 వేల చొప్పున 12 నెలలకు రూ.36 వేలు, పాత గ్రామం నుంచి నిర్వాసిత గ్రామానికి రవాణా ఛార్జీలు రూ.50 వేలు, పశువులశాలలు లేదా బడ్డీలకు రూ.25 వేలు, కుల వృత్తులు, చిరు వ్యాపారులకు రూ.25 వేలు, రీసెటిల్మెంట్ అలవెన్స్ రూ.50 వేలు ఇస్తామని ముందుగా ప్రకటించారు. కానీ రూ.9.20 లక్షల చొప్పున నిర్వాసితుల ఖాతాలో జమ చేశారు. ఈ మొత్తంలో దేనికి ఎంత అనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. చాలామంది ఈ మొత్తం ఇంటి కోసం ఇచ్చారని, మిగతావి తర్వాత ఇస్తారేమోనని భావిస్తున్నారు. సామగ్రి తరలించడానికి రూ.50 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
స్థానికులు కాదు.. పరిహారం ఇవ్వలేం
ఆ నాలుగు గ్రామాల నుంచి చాలామంది పొట్ట కూటి కోసం విశాఖ, కాకినాడ, విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లిపోయారు. వీరిలో చాలామంది ప్రతి నెలా రాలేక సరకులు ఉన్నచోటే తీసుకోవచ్చనే ఉద్దేశంతో రేషన్, ఆధార్ కార్డులను బదిలీ చేయించుకున్నారు. ఇప్పుడిదే వారికి శాపంగా మారింది. వీరంతా స్థానికులు కాదని, పునరావాస కాలనీలో స్థలం, ఇళ్లను కేటాయించలేదు. వారంతా కొన్ని నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పుట్టిన ఊరిని వదిలేసి ఇప్పుడు తమను ఎక్కడికి వెళ్లమంటారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సాయం చేస్తే పునరావాస కాలనీలో ఇల్లు కట్టుకుంటామని సుమారు 74 కుటుంబాలు వేడుకుంటున్నాయి. ఊరు వదిలి వెళ్లే సమయంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారు సుమారు 70 మంది వరకు ఉన్నారు.
తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలి... నిర్వాసితులంతా పునరావాస కాలనీలోనే తాత్కాలిక వసతి ఏర్పాటు చేసుకొని ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వలస వెళ్లిన వారి విషయంలో నోటిఫికేషన్ జారీ చేసిన నాటికి మూడేళ్ల ముందు వరకు గ్రామంలో ఉంటే పరిహారం అందించాం. గ్రామసభలు ఏర్పాటు చేసిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాం. గ్రామం వదిలేసి వెళ్లే నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అడుగుతున్నారు. ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉంది.
లింగాలవలస కాలనీలో నిర్మించిన ఈ పాఠశాల భవనానికి విద్యుత్తు సదుపాయం కల్పించలేదు. మరుగుదొడ్లు, మూత్ర శాలలు కడుతుండగా తాగునీటి అవసరాలకు బోరు వేయలేదు. మధ్యాహ్న భోజనం వంటగది కానరాలేదు. ఇవన్నీ ఇలా ఉండగా.. పాత గ్రామాల్లో పాఠశాలలను మూసేస్తున్నారు.
ఈ రెండు చిత్రాల్లో మొదటిది బొల్లింకలపాలెంలోని ప్రాథమిక పాఠశాల. బడి మూసేయడంతో తాత్కాలికంగా వరండాలో పిల్లలు కూర్చుని చదువుకుంటున్నారు. ఇక్కడి సామగ్రి అంతా పక్కనే ఉన్న గుడిసెలో ఉంచారు. రెండో చిత్రమే అది. ఇక్కడ ఏడుగురు విద్యార్థులుండగా.. ఐదుగురు సమీపంలోని రాళ్లపాలెం నుంచి వస్తారు. వీరంతా చదువుకోవాలంటే నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని గూడెపువలస లేదా దల్లిపేటకు వెళ్లాలి.
లింగాలవలసలో నిర్వాసితుల పునరావాస కాలనీ ఇది. ఇక్కడ చాలా ఇళ్లు ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. కొందరు డబ్బులు చాలక పనులు ఆపేశారు. అధికారులు ఉన్న ఫళంగా వెళ్లిపోమంటే పూర్తి కాని ఇళ్లల్లో ఎక్కడ ఉండాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
బొల్లింకలపాలెంలో ఓ నిర్వాసితుడి ఇంటిని ఆదివారం కూల్చేయడంతో సమీపంలోని ఓ పూరి గుడిసెలో తలదాచుకుంటున్నారు. కాలనీలో ఇంటి నిర్మాణం పూర్తి కాలేదని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి విజయంతోనే భవిష్యత్తు
[ 19-04-2024]
మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కోరారు. -
బడాయి మావయ్యా.. బువ్వ.. గుడ్డు ఏదయ్యా
[ 19-04-2024]
మీకు అన్నను.. మీ పిల్లలకు మావయ్యను అని చెప్పుకొని తిరిగే సీఎం జగన్మోహన్రెడ్డి ఆ మాటలను నిజం చేసుకోలేకపోయారు. ఈ ఐదేళ్లూ పిల్లలకు నాసిరకం భోజనాలే అందించారు. -
భేష్.. ముహూర్త బలం
[ 19-04-2024]
శుక్రవారం.. ఏకాదశి.. మంచి ముహూర్తం, యోగ బలం బాగుంది.. పండితులు చెప్పిన మాట.. -
తొలిరోజు 12 నామినేషన్లు
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. చీపురుపల్లి, రాజాం, గజపతినగరం నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. తొలిరోజు అసెంబ్లీ స్థానాలకు 10, విజయనగరం ఎంపీ స్థానానికి ఇద్దరు అందించారు. -
బడ్డుకొండ సంపద రూ.11.25 కోట్లేనట!!
[ 19-04-2024]
నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడి (52) సంపద అయిదేళ్లలో రూ.3 కోట్లే పెరిగిందట. ఇది విన్న నియోజకవర్గ ప్రజలు అబ్బే అంత తక్కువ ఉండటం ఏమిటని అనుకోవడం వినిపించింది. -
మాయల పకీరు జగన్ అవసరమా?: కళా
[ 19-04-2024]
మాయల పకీరు ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజలంతా ఆలోచించాలని కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. మెరకముడిదాం మండలం గర్భాం మేజరు పంచాయతీలో గురువారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. -
బోసినవ్వుల చిన్నారిని.. వైకాపా రథం చిదిమేసింది
[ 19-04-2024]
‘అమ్మా..వెంటనే వచ్చేస్తాను’ అంటూ బయటకు వెళ్లిన ఆ చిన్నారి తీరని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్లెదుటే అంత వరకూ హుషారుగా ఇంట్లో తిరిగిన ఆ బాలుడు నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయాడు. -
ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలేవీ?
[ 19-04-2024]
శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. -
జగన్ దగాతో రైతు బేజారు!
[ 19-04-2024]
గత ప్రభుత్వం రూ.36లక్షల నిధులతో సాలూరులోని దండిగాం రోడ్డులో రైతు బజారు నిర్మించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతకుముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక్క దుకాణం కూడా ఏర్పాటు చేయలేదు. -
శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం
[ 19-04-2024]
శుభకార్యానికి వెళ్లేందుకు అందరూ సరదాగా బయలుదేరారు. ప్రత్యేకంగా సమకూర్చుకున్న వాహనంలో కబుర్లు చెప్పుకొంటూ వెళ్తున్నారు. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొనడంతో ముందు భాగం ఛిద్రమైంది. -
జంఝాటం
[ 19-04-2024]
తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైకాపా ఏనాడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం అన్నదాత వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి రాక ముందు అనేక హామీలను నీటిమూటల్లో నింపేసిన సీఎం జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మేమింతే అన్నట్లు వాటన్నింటినీ అటకెక్కించేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి