తరుణం ఆసన్నం
ఏటా బ్యాంకులు పరపతి ప్రణాళికలు తయారు చేసినా... కొన్ని రంగాలకు సంబంధించి లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయి.
నాబార్డు ప్రణాళికను విడుదల చేస్తున్న అధికారులు
ఈనాడు-విజయనగరం, విజయనగరం అర్బన్, న్యూస్టుడే: ఏటా బ్యాంకులు పరపతి ప్రణాళికలు తయారు చేసినా... కొన్ని రంగాలకు సంబంధించి లక్ష్యాలను చేరుకోలేకపోతున్నాయి. తాజాగా ఉమ్మడి జిల్లాలో 2023-24 ఏడాదికి గానూ మళ్లీ పరపతి ప్రణాళికల రూపకల్పనకు సిద్ధమవుతున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, గృహ నిర్మాణాలకు పెద్దపీట వేయనున్న నేపథ్యంలో ముందునుంచే లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
వివరాలిలా...:
అన్ని రంగాలకు రుణ సామర్థ్య అంచనా ప్రణాళికను ఏటా నాబార్డు తయారు చేస్తుంది. దీని ఆధారంగానే జిల్లా స్థాయిలో లీడ్ బ్యాంకు రుణ లక్ష్యాలను రూపొందిస్తుంది. గత నెల 23న పీఎల్పీ (పొటెన్షియల్ లింక్డ్ ప్లాన్)ని నాబార్డు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో రూ.10,028.45 కోట్లతో ప్రణాళిక రూపొందించగా, విజయనగరానికి రూ.6095.92 కోట్లు, పార్వతీపురం మన్యానికి రూ.3932.53 కోట్లుగా పొందుపర్చారు. దీన్ని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆమోదానికి పంపించినట్లు అధికారులు చెబుతున్నారు.
గతేడాది కౌలురైతులకు మొండి చేయి..:
కౌలు రైతులకు బ్యాంకర్లు మొండిచెయ్యే చూపిస్తున్నారు. జిల్లాలో సుమారు 4 లక్షల మంది రైతులుండగా.. 30 నుంచి 40 శాతం కౌలురైతులే ఉంటారు. వీరికి సీసీఆర్సీ గుర్తింపు కార్డులివ్వడానికి అధికారులు ఆసక్తి చూపడం లేదు. ఇవి ఉంటేనే ప్రభుత్వ పథకాలతో పాటు బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. భూ యజమానులు సైతం భూమిని కౌలుకు ఇచ్చినట్లు సాగుదారులకు అంగీకార పత్రాలు ఇవ్వడం లేదు. 2022-23 ఏడాదిలో ఐదు వేల మంది కౌలురైతులను అర్హులుగా గుర్తించగా, 2 వేల మంది వివరాలనే బ్యాంకులకు అందించారు. మార్చి నాటికి అందరికీ రుణసాయం చేస్తామని బ్యాంకర్లు చెబుతున్నా.. రబీలో అవసరాలు ఎక్కువగా ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విద్యా రుణాలకు వెనుకడుగు..:
ఉన్నత, విదేశీ విద్య చదువుకొనే విద్యార్థులకు రుణాలు ఇవ్వడంలో 2022-23 ఏడాదికి సంబంధించి లక్ష్యాలు చేరుకోలేదు. అడ్డగోలు నిబంధనలు, పూచీకత్తు సమర్పణ వంటి వాటితో చాలామంది ప్రైవేటు రుణ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఏడాదికి రూ.35.89 కోట్లు లక్ష్యాలు నిర్దేశించుకోగా.. నవంబరు వరకు రూ.18 కోట్లు మాత్రమే ఇచ్చారు. వచ్చే ఏడాదికి నాబార్డు రుణ ప్రణాళికలో రూ.38.60 కోట్లు ప్రతిపాదించింది. ఈసారైనా సాధించాలని ఆశిద్దాం.
పరిశ్రమలకు చేయూత..:
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి 303 మందికి రుణాలు మంజూరు చేయగా..138 మందికి విడుదల చేశారు. ఇంకా 189 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. వచ్చే ఏడాది పరిశ్రమలకు సంబంధించి ఇప్పటికే కొన్నింటికి క్లస్టర్ విధానంలో ప్రతిపాదించారు. ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు బ్యాంకుల ద్వారా రుణసాయం అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భీమాళిలో తాండ్ర నిల్వకు శీతల కేంద్రం, రామభద్రపురం మండలంలో బెల్లం పొడి పరిశ్రమ, బుదరాయవలసలో ఇత్తడి బిందెల తయారీ, రూ.5 కోట్లతో తవుడు నుంచి నూనె తయారీ పరిశ్రమలకు రుణాలు ఇచ్చే అంశాన్ని ప్రణాళికలో చేర్చే అవకాశముంది.
* ఐక్యరాజ్య సమితి ఈ ఏడాదిని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో వాటి సాగును ప్రోత్సహించనున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు(ఎఫ్పీవో) ఇప్పటికీ నాబార్డు నేరుగా రుణ సాయమందిస్తోంది. ఈ ఏడాదిలో ఆయా సంస్థలకు రుణాలు అందించేలా లక్ష్యం నిర్దేశించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 50కి పైగా ఇవి ఉన్నాయి. విజయనగరం జిల్లాలో ఇటీవల కొత్తగా 16 ఎఫ్పీవోలు అనుమతి పొందినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది రూపొందించుకున్న లక్ష్యాలను చేరుకుంటామని విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల లీడ్ బ్యాంకు ప్రబంధకులు ఎ.శ్రీనివాసరావు, మూర్తి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సచివాలయం ఉద్యోగులు అందుబాటులో ఉండాలి
[ 28-03-2024]
బలిజిపేట మండలంలోని వంతరాం గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని గ్రామప్రజలు అధికారులను అభ్యర్థించారు. -
మూలకు చేరిన మూడు చక్రాల ఆటోలు
[ 28-03-2024]
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద మంజూరు చేసిన మూడు చక్రాల ఆటోలు కొన్ని చోట్ల మూలకు చేరాయి. -
లుంబూరు కాలనీలో సౌకర్యాలేవన్నా!
[ 28-03-2024]
ప్రభుత్వం ఆర్భాటంగా ఇళ్లు కాదు... ఊళ్లే నిర్మించేస్తామంటూ అట్టహాసంగా జగనన్న కాలనీలను మంజూరు చేసి నాలుగేళ్లవుతున్నా నేటికీ కనీస సదుపాయాలు కల్పించలేదు. స్థలాలిచ్చాం... మీరే కట్టుకోండంటూ లబ్ధిదారులను గాలికొదిలేసింది. -
అసంపూర్తి పనులు.. తప్పని అవస్థలు
[ 28-03-2024]
సీతానగరం మండల కేంద్రం నుంచి పలు గ్రామాలను అనుసంధానించేందుకు నిర్మించిన రహదారుల అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగలడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. పదేళ్లుగా అధ్వానంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి ఈ ఏడాది నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. -
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
[ 28-03-2024]
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వసతులు
[ 28-03-2024]
పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ కేంద్రాల వద్ద అన్ని వసతులు పక్కాగా ఉండాలని కలెక్టరు నిశాంత్కుమార్ ఆదేశించారు. -
జలకలే
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో 2020-21లో జలకళ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారు పది వేల దరఖాస్తులు వచ్చాయి. నాలుగేళ్లలో 373 బోర్లకు రూ.5.55 కోట్లతో పరిపాలనా అమోదం ఇచ్చారు. -
జనం జీవితాల్లో బూడిద
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలోని వేపాడ, ఎస్.కోట, ఎల్.కోట, బొండపల్లి, గురుగుబిల్లి, పాచిపెంట, పాలకొండ మండలాల్లో కొండలను పిండి చేస్తున్నారు. అనుమతులు కన్నా అదనపు విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి జేబులు నింపుకొంటున్నారు. -
బిల్లులు రాక.. నిర్మాణాలు సాగక
[ 28-03-2024]
-
ఔత్సాహికం.. అల్లంతదూరం
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలనే మాట వినిపించడం లేదు. వారికి అందించాల్సిన శిక్షణ తరగతులు, అవగాహన సదస్సులు దూరమయ్యాయి. దీంతో నిరుద్యోగ సమస్య రానురానూ తీవ్రమవుతోంది. -
ఆపద్బాంధవులకూ కష్టాలే!!
[ 28-03-2024]
అగ్ని ప్రమాదం సంభవిస్తే ఠక్కున గుర్తొచ్చేది అగ్నిమాపక దళమే. భారీ యంత్రాలు, బరువైన పరికరాలతో ఎంత పెద్ద భవనాలనైనా ఎక్కి మంటలను అదుపు చేసేందుకు మృత్యువుతో పోరాడుతారు. మరి ఆ విభాగానికే కష్టమొస్తే.. అలాంటి పరిస్థితే జిల్లాలో నెలకొంది. -
వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా చేరికలు
[ 28-03-2024]
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి రాజాం నియోజకవర్గ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. -
అనుమానంతోనే భార్యను చంపేశాడు
[ 28-03-2024]
ఆమె వృద్ధురాలు.. వయసు 60 ఏళ్లు.. కానీ తాగిన మైకంలో భర్త అనుమానించేవాడు. నిరంతరం వేధించేవాడు. చివరకు హత్య చేసి, దారుణానికి ఒడిగట్టాడు. జియ్యమ్మవలస మండలంలోని సింగనాపురంలో ఇటీవల జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. -
ఇంటర్ మూల్యాంకనం 50 శాతం పూర్తి
[ 28-03-2024]
కొత్తగా ఏర్పడిన జిల్లాలో తొలిసారిగా ఇంటర్మీడియట్ మూల్యాంకనం నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 50 శాతం దాటి జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి చేసినట్లు క్యాంపు అధికారి ఎస్.తవిటినాయుడు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల గగ్గోలు.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ