logo

గిరిజన సమస్యలపై పోరాటం తప్పదు

గిరిజనుల తరఫున పోరాడేందుకు తెదేపా ఎప్పుడూ ముందుంటుందని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

Published : 01 Feb 2023 03:05 IST

మాట్లాడుతున్న సంధ్యారాణి

సాలూరు, న్యూస్‌టుడే: గిరిజనుల తరఫున పోరాడేందుకు తెదేపా ఎప్పుడూ ముందుంటుందని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గిరిశిఖర గ్రామాలు, కొదమ పంచాయతీ నుంచి పలువురు మంగళవారం ఆమెను కలిసి సమస్యల గోడు వినిపించారు. రోడ్లు వేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇంటింటికీ చందాలు వేసుకున్నట్లు తెలిపారు. ఇలా రూ.14 లక్షల వరకు ఖర్చయిందని, ఇవి చెల్లించి పనులు పూర్తిచేస్తామని అధికారులు తమకు చెప్పి మోసం చేశారన్నారు. ప్రస్తుతం ఫీడర్‌ అంబులెన్సులు కూడా రాలేని పరిస్థితి ఉందన్నారు. వారికి సంధ్యారాణి భరోసా ఇచ్చారు. నాయకులు పరమేశు, శ్రీను, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని