మీరూ..స్టీరింగ్ తిప్పేయండి
భారీ వాహనాలు నడపాలని ఉందా.. శిక్షణ పొందేందుకు మీ సమీపంలో ఎలాంటి సంస్థలూ లేవా.. అయితే తమ దగ్గరకు రండి అంటోంది ఆర్టీసీ.
ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ
న్యూస్టుడే, విజయనగరం కోట: భారీ వాహనాలు నడపాలని ఉందా.. శిక్షణ పొందేందుకు మీ సమీపంలో ఎలాంటి సంస్థలూ లేవా.. అయితే తమ దగ్గరకు రండి అంటోంది ఆర్టీసీ. లారీలు, బస్సులతో పాటు ఇతర పెద్దతరహా వాహనాల చోదకానికి తర్ఫీదునిస్తోంది. సాధారణంగా చాలాచోట్ల కార్లు, ఇతర వాటికి సంబంధించి మెలకువలు నేర్పిస్తారు. కానీ ఇక్కడ అన్నివిభాగాల వారూ చేరొచ్చు. కేవలం ఆర్టీసీ సిబ్బందికే కాకుండా బయటవారు సైతం ప్రవేశాలు పొందవచ్చు. తద్వారా పలువురికి ఉపాధి బాటలు వేస్తూనే ఆదాయాన్ని ఆర్జిస్తోందని ప్రజా రవాణా సంస్థ. విజయనగరం జిల్లా కేంద్రంలో జోనల్ శిక్షణా కళాశాల పేరుతో ఈ సేవలు అందిస్తోంది.
డ్రైవింగ్కు ఉపయోగిస్తున్న బస్సు
చేరాలంటే ఇలా..
శిక్షణ పొందాలనుకునే వారు సమీపంలోని ఆర్టీసీ అధికారులను సంప్రదించాలి. చిన్నతరహా వాహనాలు నడిపేందుకు రవాణాశాఖ ఇచ్చిన లైసెన్స్ ఉండాలి. భారీ అయితే ఎల్ఎల్ఆర్ తప్పనిసరి. కొత్తగా కావాలంటే దరఖాస్తు సైతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, సంబంధిత పత్రాలు అందిస్తే ప్రవేశం కల్పిస్తారు. 40 రోజుల పాటు మెలకువలు నేర్పిస్తారు. ఒక్కో అభ్యర్థీ రూ.23,600 చెల్లించాలి. ప్రక్రియ పూర్తయిన తరువాత ధ్రువపత్రం అందిస్తారు. ఆర్టీసీ ఆమోద ముద్ర ఉండడంతో దీనికి ఎంతో విలువ ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
చోదకమే కాదు..
అభ్యర్థులకు చోదకంతో పాటు అత్యవసర సమయాలు, విపత్తులు సంభవించేటప్పుడు ఎలా వ్యవహరించాలో నేర్పుతారు. టైర్లు మార్చడం, ఇంజిన్లో సమస్యలను పరిష్కరించడం, ఇతరత్రా మరమ్మతులను సొంతంగానే చేసుకోవడం, వేగం, డీజిల్ పొదుపు.. తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఈ కేంద్రంలో ఇప్పటి వరకు 10 బృందాలు చేరాయి. ఒక్కో బ్యాచ్లో 16 మంది చొప్పున ఉంటారు. త్వరలో 11 బ్యాచ్ రానుంది.
సొంత వారికి కూడా..
ఆర్టీసీలో ఇప్పటికే పనిచేస్తున్న వారికి కూడా ఈ కళాశాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈమేరకు ప్రతి డిపోలో ఒక సేఫ్టీ డ్రైవింగ్ ఇనస్ట్రక్టర్ను నియమించారు. వీరు ఎప్పటికప్పుడు బస్సులు నడపడంపై సూచనలు చేస్తారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అధికంగా ఇంధనాన్ని వాడడం, ప్రమాదాలకు పాల్పడేవారిని గుర్తించి, ఇక్కడ చేర్పిస్తారు. ఇలా ఇప్పటివరకు 24 మంది వరకు చేరారు. అలాగే పొరుగు సేవల డ్రైవర్లు ఇక్కడ తప్పనిసరిగా శిక్షణ పొందాలని అధికారులు ఆదేశించారు.
ఇంజిన్పై అవగాహన కల్పిస్తున్న నిపుణులు
శిక్షణలో భాగంగా టైరు మార్చుతున్న అభ్యర్థులు
ఆసక్తి ఉన్నవారికి అవకాశం..
ఆసక్తి గలవారు ఎవరైనా రావొచ్చు. తమను సంప్రదిస్తే ప్రవేశాలు కల్పిస్తాం. తరగతుల నిర్వహణకు నిపుణులైన సిబ్బందిని నియమించాం. వారు అభ్యర్థులకు తగిన సూచనలు చేస్తారు. అభ్యర్థుల్లో ఎవరైనా బాగా రాణిస్తే.. అవసరం మేరకు ఆర్టీసీలో పొరుగు సేవల కింద తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
కె.శ్రీనివాసరావు, ప్రజా రవాణా అధికారి, విజయనగరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొమ్మాలమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠ
[ 23-04-2024]
మండలంలోని తుమరాడ గ్రామంలో పడాల వంశీయులు నూతనంగా నిర్మించిన బొమ్మాలమ్మతల్లి ఆలయ ప్రతిష్ఠ ఉత్సవం మంగళవారం ప్రారంభించారు. -
నేను ఉన్నానన్నావ్.. విన్నానన్నావ్.. ఐదేళ్లుగా ఏం చేశావ్!
[ 23-04-2024]
‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో నమ్మించారు జగన్. ఆ మాటలు ఉమ్మడి జిల్లా ప్రజలు నిజమే అనుకున్నారు. ఇక తమ కష్టాలు తీరినట్లేనని ఓట్లు వేసి గద్దెనెక్కించారు. -
ఎంపీ అభ్యర్థినిగా కొత్తపల్లి గీత నామినేషన్
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు పార్లమెంటరీ స్థానానికి ఐదు, కురుపాం శాసనసభకు రెండు, పార్వతీపురం, పాలకొండ శాసనసభలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. -
వేదనలోనూ విజయం
[ 23-04-2024]
పరీక్ష రోజే తండ్రి మృతి చెందినా ఆయన ఆశయాన్ని కుమారుడు నిలబెట్టాడు. సరిగ్గా నెల రోజుల క్రితం మార్చి 22న పదో తరగతి గణితం పరీక్ష జరిగింది. ఆ రోజు ఉదయాన్నే లేచి హడావుడిగా సిద్ధమవుతున్న ఆ విద్యార్థికి తన తండ్రి మృతి చెందిన వార్త తెలిసి తల్లడిల్లిపోయాడు. -
ఎస్.కోటను అభివృద్ధి చేస్తా
[ 23-04-2024]
ప్రశాంతమైన విశాఖ నగరానికి తాము ఐటీ కంపెనీలు తీసుకొస్తే జగన్ భూ బకాసురులను దించి కబ్జాలతో కబళించాడని, రాక్షస మూకలను దించి అశాంతి నగరంగా మార్చేశాడని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. -
పదిలో అయిదో స్థానం
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా అయిదో స్థానంలో నిలిచింది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. -
వైకాపా పతనం తప్పదు: కళా
[ 23-04-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాకు పతనం తప్పదని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి, కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు తెలిపారు. -
పార్లమెంటుకు 05 .. అసెంబ్లీకి 24
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి 05, అసెంబ్లీ స్థానాలకు 24 వచ్చాయి. ఎంపీ స్థానానికి వైకాపా అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ రెండు సెట్ల నామపత్రాలు అందజేశారు. -
కోటలో జనసంద్రం
[ 23-04-2024]
శృంగవరపుకోటలో చంద్రబాబు పాల్గొన్న ప్రజాగళం సభకు ఉమ్మడి జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. జగ్గంపేట సభ అనంతరం వచ్చిన చంద్రబాబుకు హెలీప్యాడ్ వద్ద అభ్యర్థులు శ్రీభరత్, కోళ్ల లలితకుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ, కార్యదర్శి ఐ.సుధారాజు, జనసేన నియోజకవర్గ కన్వీనర్ వబ్బిన సత్యనారాయణ, భాజపా నియోజకవర్గ కన్వీనర్ జగదీశ్వరి స్వాగతం పలికారు. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలు
[ 23-04-2024]
అరకు పార్లమెంటరీ.. -
నాలుగు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
[ 23-04-2024]
కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడు అసెంబ్లీ, విజయనగరం పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. నెల్లిమర్ల నియోజకవర్గం అభ్యర్థిగా సరగడ రమేష్కుమార్ (పార్టీ జిల్లా అధ్యక్షుడు), గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థిగా విజయనగరానికి చెందిన డోల శ్రీనివాసరావు (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ఉన్నారు. -
ప్రకటనల మోత.. ఏదీ రైలుబస్సు కూత
[ 23-04-2024]
మారుమూల ప్రాంతంలో సౌకర్యంగా ఉన్న రైలుబస్సు సేవలకు గ్రహణం పట్టింది. ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే సాలూరు రైల్వే స్టేషన్లో రైలు కూత వినిపించకుండా పోయింది. -
ట్రాఫిక్ నియంత్రణ కత్తిమీద సామే
[ 23-04-2024]
నగరం సమీపంలోని చెల్లూరు కూడలిలో మంగళవారం జరిగే సిద్ధం సభ నిర్వహణపై పోలీసులు, అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విజయనగరం, మన్యం, విశాఖ జిల్లాలకు అతిప్రధానమైన రెండు జాతీయ రహదారులకు ఆనుకుని వేదిక ఏర్పాటు చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
జగన్ చెప్పారంటే.. చేయరంతే!
[ 23-04-2024]
ప్రతి ఒక్కరి గుండెచప్పుడు విన్నా.. ప్రజల కన్నీళ్లను చూశా.. సమస్యలన్నీ తీరుస్తా.. అని పాదయాత్రలో హామీల వర్షం కురిపించిన సీఎం జగన్ గద్దె ఎక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. -
పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. బొబ్బిలి గురుకుల పాఠశాల విద్యార్థులు కె.వరుణ్ 600కు 592, ఎం.హర్షవర్థన్ 592, కె.రాకేష్ 590 మార్కులు సాధించారు. -
‘ప్రజల్ని దోచేసిన వైకాపా’
[ 23-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజల కష్టాన్ని అధిక ధరలు, ఛార్జీల రూపంలో దోచేసిందని కూటమి చీపురుపల్లి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. గరివిడి మండలం కోడూరు, ఏనుగువలస గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM