ప్రజల అవసరాలు తీర్చే బాధ్యత ప్రభుత్వానిదే
పేదల అవసరాలు తీర్చే బాధ్యత ప్రభుత్వానిదే అని.. ప్రధానంగా విద్య, వైద్యం వంటి వాటిని వెంటనే కల్పించాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనరు కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.
అశోక్గజపతిరాజు
కేన్సర్ ఆసుపత్రి సాధన సమితి దీక్షకు మద్దతు
దీక్షలో బాబ్జీకి సంఘీభావం తెలుపుతున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు, పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామేశ్వరరావు తదితరులు
విజయనగరం గంటస్తంభం, న్యూస్టుడే: పేదల అవసరాలు తీర్చే బాధ్యత ప్రభుత్వానిదే అని.. ప్రధానంగా విద్య, వైద్యం వంటి వాటిని వెంటనే కల్పించాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనరు కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. జిల్లాలో కేన్సర్ ఆసుపత్రిని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. ప్రభుత్వం కేన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని కోరుతూ ఐకాస ఛైర్మన్ భీశెట్టి బాబ్జీ చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు వారు సంఘీభావం తెలిపారు. జిల్లాలో ఎక్కువగా కేన్సర్తో మరణిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అశోక్ అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున కేంద్రం ఇస్తామని చెప్పిందని, మూడేళ్లు మాత్రమే ఇచ్చినట్లు తనకు గుర్తుందన్నారు. అక్కడి నుంచి ఆ నిధులు ఎందుకు తెప్పించుకోలేకపోతున్నారని, కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన వ్యక్తులు.. ఎవరి మెడలు వంచారని..? ఆయన ప్రశ్నించారు. విశాఖ, విజయనగరాన్ని యాస్పిరేషన్ జిల్లాలుగా కేంద్రం గుర్తించిందని, ఈ విషయాన్ని మెడలు వంచేవారు మరిచిపోయారన్నారు. ప్రభుత్వానికి జ్ఞానం ఇప్పించు తల్లీ! అని పైడిమాంబను కోరారు. కొణతాల మాట్లాడుతూ సరైన వైద్య సౌకర్యం లేక కేన్సర్ బాధితులు మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామేశ్వరరావు, వైకాపా నాయకులు పిల్లా విజయ్కుమార్, అవనాపు విజయ్, భాజపా నాయకులు కుసుమంచి సుబ్బారావు కాంగ్రెస్ ఉత్తరాంధ్ర జోనల్ సమన్వయకర్త హేమంత్, జనసేన నాయకులు గురాన అయ్యలు, యలమంచిలికి చెందిన పరిపూర్ణ సర్వేంద్ర స్వామి, ఐకాస కన్వీనర్ మమ్ముల తిరుపతిరావు, కోకన్వీనర్ గోపాలరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన ఇంతే.. మీ దారి మీరే చూసుకోండి
[ 25-04-2024]
మన్యంలోని కొండలపై ఉన్న గ్రామాలకు వస్తే వీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుంది. అందుకేనేమో వీరు అక్కడికి వెళ్లరు.. ఒక వేళ వెళ్దామా అంటే రోడ్డు ఉంటే కదా.. అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వ పాలన. -
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!