త్వరలో పైడితల్లి ఆలయ అభివృద్ధి
వీలైనంత త్వరగా పైడితల్లి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు
దుకాణదారుకు చెక్కు అందజేస్తున్న ఉప సభాపతి కోలగట్ల
కంటోన్మెంట్, న్యూస్టుడే: వీలైనంత త్వరగా పైడితల్లి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చిలో గుడి పక్కనున్న దుకాణాలు తరలించి ఆ ప్రాంతాన్ని అధికారులకు అప్పగించాలని యజమానులకు సూచించారు. అనంతరం ఆలయ విస్తరణ, భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై చర్చించారు. స్టూడెంట్స్ ఎంపోరియం దుకాణ యజమాని రవ్వా వెంకటేశ్వరరావుకు రూ.11 లక్షలు, ఆయర్వేద దుకాణం యజమాని కృష్ణప్రియకు రూ.4.35 లక్షల చెక్కును అందజేశారు. దేవస్థానం ఏసీ కిశోర్కుమార్, పూజారి బంటుపల్లి వెంకటరావు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా