logo

సచివాలయం, రైతు భరోసా కేంద్రం ప్రారంభం

మండలంలోని అరసాడ గ్రామంలో ప్రభుత్వ నిధులు రూ. 21.8 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, రూ. 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను ఎమ్మెల్యే ఎ. జోగారావు ఆదివారం ప్రారంభించారు. 

Updated : 05 Feb 2023 18:31 IST

బలిజిపేట: మండలంలోని అరసాడ గ్రామంలో ప్రభుత్వ నిధులు రూ. 21.8 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, రూ. 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను ఎమ్మెల్యే ఎ. జోగారావు ఆదివారం ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో సేవలందించేందుకు వీటిని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగమణి, జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌, పార్టీ అధ్యక్షుడు కృష్ణ, మండల ఉపాధ్యక్షుడు సాయిరాం, గ్రామ వైకాపా నాయకులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని