ఉచిత బియ్యానికి ఎగనామం
జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) బియ్యం పంపిణీ నిలిచిపోయింది.
నిలిచిపోయిన పీఎంజీకేఏవై
రెండింటినీ కలిపేసిన రాష్ట్ర ప్రభుత్వం
రేషన్ పంపిణీ (పాత చిత్రం)
విజయనగరం కలెక్టరేట్/భామిని, న్యూస్టుడే: జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) బియ్యం పంపిణీ నిలిచిపోయింది. కొవిడ్ లాక్డౌన్ నుంచి పేదవర్గాలకు, ఏఏవై కార్డుదారులకు కేంద్ర వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బియ్యాన్ని(నాన్ సార్టెక్స్) పంపిణీ చేస్తోంది. చౌకధరల దుకాణాల ద్వారా వీటిని అందజేసేవారు. కేంద్రం ఇస్తున్నా.. కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వీటి పంపిణీని నిలిపివేసింది. మధ్యలో ఒకట్రెండు నెలలు ఇచ్చినా... ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో వీటి ఊసే లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ కింద ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికే రేషన్ పంపిణీలో భాగంగా ప్రతి నెలా ఒకటి నుంచి 17వ తేదీ వరకు రాయితీపై సరకులు పంపిణీ చేస్తోంది. కిలో బియ్యానికి రూపాయి చొప్పున, కందిపప్పు, పంచదార రాయితీపై ఇచ్చేవారు. ఈ నెల నుంచి పట్టణ ప్రాంతాల్లో కార్డుదారులకు రెండు కిలోల చొప్పున గోధుమపిండి అదనంగా సరఫరా చేస్తున్నారు. ప్రతి నెలా పీఎంజీకేఏవై కింద ఉచిత బియ్యాన్ని 18 నుంచి 30వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా అందజేసేవారు.
నిలిపివేత
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గత నెల నుంచి పీడీఎస్ బియ్యాన్ని ఉచితంగానే సరఫరా చేస్తోంది. ఇదే సందర్భంలో కేంద్రమిస్తున్న పీఎంజీకేఏవై పంపిణీని పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్ర పౌరసరఫరాల అధికారుల నుంచి దీనిపై ఎటువంటి ఉత్తర్వులూ రాకపోవడంతో పంపిణీ నిలిపివేశామని జిల్లా అధికారులు చెబుతున్నారు. వెనుకబడిన జిల్లా కావడంతో విజయనగరంలో ఏఏవై(పీఎంజీకేఏవై లబ్ధిదారులు) కార్డుదారులు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం విజయనగరం జిల్లాలో సాధారణ బియ్యం కార్డులు 5.74 లక్షలు ఉంటే.. అందులో పీఎంజీకేఏవై లబ్ధిదారుల కార్డులు 5.71 లక్షలు ఉన్నాయి.
పార్వతీపురం మన్యంలో: 578 రేషన్ దుకాణాల పరిధిలో 2,76,783 కార్డులున్నాయి. కార్డులోని ఒక్కో సభ్యునికి 5 కిలోల చొప్పున నాన్ సార్టెక్స్ బియ్యం అందేది. ఒక కార్డులో నలుగురు సభ్యులుంటే 20 కిలోల బియ్యం వచ్చేవి. ఈ రకం బియ్యం బయట కొనాలంటే రూ.25 నుంచి రూ.30 వరకూ వెచ్చించాలి. ప్రస్తుతం ప్రభుత్వం పీడీఎస్నే ఉచితంగా ఇచ్చేసి (20 కిలోల బియ్యానికి రూ.20 మిగులు) పీఎంజీకేఏవైకు పూర్తిగా ఎగనామం పెట్టేసిందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ లెక్కన రెండు జిల్లాల్లో కోట్లాది రూపాయల లబ్ధికి పేదలు దూరమయ్యారు.
రూపాయి బియ్యం ఉచితమే.. : ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ బియ్యం(కిలో రూ.1) జనవరి నెల నుంచి ఉచితంగానే ఇస్తోంది. దీనివల్ల పీఎంజీకేఏవై ఉచిత బియ్యాన్ని ఇక ఇవ్వడం లేదు. రెండో కోటాపై ఎటువంటి ఆదేశాలూ లేవు.
మధుసూదనరావు, కేవీఎల్ఎన్ మూర్తి, విజయనగరం/పార్వతీపురం మన్యం జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదు పదుల వయసులోనూ పది పరీక్షకు హాజరు
[ 19-03-2024]
చదువుకోవాలనే తపన ఉండాలే కాని వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు గుమ్మలక్ష్మీపురం మండలంలోని మూలపాడుకు చెందిన పెద్దమ్మి. -
జీవనాధారం కల్పించండి సారూ!
[ 19-03-2024]
మన్యం జిల్లాలో ఏనుగులు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఐదేళ్లుగా జిల్లా నుంచి కదలకపోవడంతో రైతులతో పాటు పలు వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
కళ్లికోటలో కరిరాజుల అలజడి
[ 19-03-2024]
కొమరాడ మండలంలోని కళ్లికోట సమీపంలో కరిరాజుల గుంపు సంచరిస్తోంది. -
బిందెడు నీటికి ఎన్ని బాధలో..
[ 19-03-2024]
పార్వతీపురం మండలంలోని చినబొండపల్లిలో పరిస్థితి ఇది. గ్రామంలో ఇంటికో కుళాయి వేశారు. డి.శిర్లాం పైలెట్ ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా చేసేవారు. -
96.99 శాతం హాజరు
[ 19-03-2024]
జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 66 కేంద్రాల్లో 10,746 మందికి గాను 10,423 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఈ కష్టాలు ఎప్పుడు తీరేనో..?
[ 19-03-2024]
-
దోపిడీలకు దారొదిలేశారు!!
[ 19-03-2024]
గరుగుబిల్లి మండలంలోని ఖడ్గవలస కూడలి వద్ద ఓ రైస్ మిల్లు యజమాని తన భార్యతో కలిసి నివాసముంటున్నారు. గత నెల 26న ఉదయం సదరు వ్యక్తి మోటారు వేసేందుకు బయటకు వచ్చారు. -
ఐదేళ్లు ఊరుకున్నారు.. చివరిలో జారుకున్నారు!
[ 19-03-2024]
బొబ్బిలి పట్టణంలోని రామన్నదొరవలస వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాల్లో కొన్నింటిని ఎట్టకేలకు పూర్తి చేశారు. మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేదు. -
ఎమ్మెల్యే సారూ..90 రోజుల్లో ఇల్లెక్కడ
[ 19-03-2024]
నిజంగా ప్రభుత్వం ఇస్తుందేమోనని కొందరు స్థలం కోసం, ఇంకొందరు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకుంటామని ముందుకొచ్చారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. -
అమృత్ అందలే
[ 19-03-2024]
పురపాలక సంఘాల్లో మరో 20 ఏళ్ల వరకు దాహార్తి సమస్య లేకుండా చేయాలన్నది అమృత్ 2.0 ఉద్దేశం. పార్కులు, మురుగునీటి శుద్ధి ప్లాంటు వంటి పనులు ప్రతిపాదించారు. తీరా ఈ ప్రభుత్వంలో పనులు చేస్తే బిల్లులు వస్తాయా? -
వదలా.. బొమ్మాళీ
[ 19-03-2024]
అధికారంలో ఉన్నాం.. మమ్మల్నెవరు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో అధినేత జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల ఫ్ల్లెక్సీలను విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. -
పట్టా పుట్టించారు.. సాయం పెంచేశారు
[ 19-03-2024]
ఓట్ల వేటలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు లేని పట్టాలను పుట్టిస్తోంది వైకాపా ప్రభుత్వం. వివిధ పథకాల కింద అందిన సొమ్ము సైతం ఎక్కువ అందినట్లు చెబుతూ ప్రచారం చేసుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
-
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Salman Khan: సల్మాన్ ఖాన్- అట్లీ కాంబో.. అర్బాజ్ ఖాన్ ఏమన్నారంటే?
-
నాడు హిట్లర్ను అరెస్టు చేసిన జాన్.ఎఫ్. కెనడీ.. వైరల్ అవుతున్న ఈసీ పోస్ట్
-
IPL: ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ కొత్త హెయిర్స్టైల్ అదుర్స్.. ఫొటోలు వైరల్