స్థానిక సంస్థల ఖాళీల భర్తీకి ఎన్నికలు
చీపురుపల్లి గ్రామీణం, పార్వతీపురం, న్యూస్టుడే: ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలను భర్తీ చేసేందుకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో రెండు సర్పంచి, 25 వార్డుల్లో అవకాశం
మార్చి 2న ఓటరు జాబితా ప్రకటన
చీపురుపల్లి గ్రామీణం, పార్వతీపురం, న్యూస్టుడే: ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలను భర్తీ చేసేందుకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనరు నీలంసహాని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీ అయిన సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలు భర్తీ కానున్నాయి. కురుపాం మండలంలోని గుమ్మ, పాలకొండ మండలంలోని పనుకువలస సర్పంచి స్థానాలతో పాటు వివిధ పంచాయతీల్లోని 25 వార్డులను ప్రస్తావిస్తూ ఓటరు జాబితా రూపొందించాలని పంచాయతీ అధికారులకు, కలెక్టర్లకు ఉత్తర్వులు వచ్చాయి. జనవరి 5న ప్రకటించిన ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని మార్చి 2లోపు కొత్త జాబితాను ప్రకటించాల్సి ఉంటుందని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బి.సత్యనారాయణ ‘న్యూస్టుడే’కు తెలిపారు. విజయనగరం జిల్లాలో విజయనగరం మండలంలోని పడాలపేట, గజపతినగరం మండలం లోగిశ, గంట్యాడ మండలం పి.ఎస్.ఆర్పురం, వంగర మండలం ఓనిఅగ్రహారం, లక్ష్మీపేట, పూసపాటిరేగ మండలం కొప్పర్లలో సర్పంచి ఎన్నికలతో పాటు 49 పంచాయతీల్లోని 53 వార్డు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
మండలాల వారీగా వార్డుల వివరాలు..
పార్వతీపురం మన్యంలో..: సాలూరు: పెదపదం-9, జిల్లేడువలస-2, జీగిరాం-4, పురోహితునివలస-2, పాచిపెంట: మెళియాకంచూరు-6, మాతుమూరు-5, పణుకువలస-7, సీతానగరం: జోగింపేట-1, 7, లచ్చయ్యపేట-6, సీతంపేట: కీసరజోడు-4, కొత్తగూడ-6, కడదండి-8, పూతికవలస-3, దుగ్గి-1, చినబగ్గ-7, పాలకొండ: వి.పి.రాజుపేట-1, 7, పనుకువలస-7, సర్పంచి, అన్నవరం-6, వీరఘట్టం: నీలానగరం-4, గరుగుబిల్లి: పెదగుడబ-7, కొమరాడ: పరుశురాంపురం-5, గుమడ-10, జియ్యమ్మవలస: కొండచిలకాం-4, కురుపాం: గుమ్మ-సర్పంచి.
విజయనగరం జిల్లాలో..: రేగిడి ఆమదాలవలస: అడవరం-8, కండ్యాం-3, 5, పారంపేట-4, అంబకండి-4, రాజాం: పొగిరి-2, కంచరాం-8, సంతకవిటి: కె.రామచంద్రాపురం-4, బొండపల్లి: దేవుపల్లి-13, మరువాడ-2, కొండకిండాం-5, ఓంపల్లి-2, దత్తిరాజేరు: మరడాం-7, పెదమానాపురం-11, చీపురుపల్లి: అలజంగి-8, ఇటకర్లపల్లి-10, గుర్ల: దేవునికణపాక-8, గొలగాం-8, వల్లాపురం-8, జామి: తాండ్రంగి-7, లొట్లపల్లి-10, ఎస్కోట: కిల్తంపాలెం-9, వేపాడ: కె.ఆర్.పేట-3, సింగరాయి-4, 7, జగ్గయ్యపేట-4, బొద్దాం-3, కొత్తవలస: కంటాకాపల్లి-2, తుమ్మికాపల్లి-3, విజయనగరం: కొండకరకాం-9, తెర్లాం: పనుకువలస-3, 5, సుందరాడ-8, లింగాపురం-8, బొబ్బిలి: కారాడ-1, 2, శివడవలస-1, కొండదేవుపల్లి-2, మెంటాడ: చింతలవలస-5, గుర్ల-5, బాడంగి: పాలతేరు-6, గజపతినగరం: జిన్నాం-5, సాలిపేట-1, రామభద్రపురం: రొంపిల్లి-7, గంట్యాడ: జగ్గాపురం-2, వంగర: ఇరువాడ-7, రుషింగి-2, కొట్టిశ-8, కొప్పవలస-4,
గరివిడి: గెడ్డపువలస-8, నెల్లిమర్ల: గుషిణి-3.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదు పదుల వయసులోనూ పది పరీక్షకు హాజరు
[ 19-03-2024]
చదువుకోవాలనే తపన ఉండాలే కాని వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు గుమ్మలక్ష్మీపురం మండలంలోని మూలపాడుకు చెందిన పెద్దమ్మి. -
జీవనాధారం కల్పించండి సారూ!
[ 19-03-2024]
మన్యం జిల్లాలో ఏనుగులు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఐదేళ్లుగా జిల్లా నుంచి కదలకపోవడంతో రైతులతో పాటు పలు వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
కళ్లికోటలో కరిరాజుల అలజడి
[ 19-03-2024]
కొమరాడ మండలంలోని కళ్లికోట సమీపంలో కరిరాజుల గుంపు సంచరిస్తోంది. -
బిందెడు నీటికి ఎన్ని బాధలో..
[ 19-03-2024]
పార్వతీపురం మండలంలోని చినబొండపల్లిలో పరిస్థితి ఇది. గ్రామంలో ఇంటికో కుళాయి వేశారు. డి.శిర్లాం పైలెట్ ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా చేసేవారు. -
96.99 శాతం హాజరు
[ 19-03-2024]
జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 66 కేంద్రాల్లో 10,746 మందికి గాను 10,423 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఈ కష్టాలు ఎప్పుడు తీరేనో..?
[ 19-03-2024]
-
దోపిడీలకు దారొదిలేశారు!!
[ 19-03-2024]
గరుగుబిల్లి మండలంలోని ఖడ్గవలస కూడలి వద్ద ఓ రైస్ మిల్లు యజమాని తన భార్యతో కలిసి నివాసముంటున్నారు. గత నెల 26న ఉదయం సదరు వ్యక్తి మోటారు వేసేందుకు బయటకు వచ్చారు. -
ఐదేళ్లు ఊరుకున్నారు.. చివరిలో జారుకున్నారు!
[ 19-03-2024]
బొబ్బిలి పట్టణంలోని రామన్నదొరవలస వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాల్లో కొన్నింటిని ఎట్టకేలకు పూర్తి చేశారు. మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేదు. -
ఎమ్మెల్యే సారూ..90 రోజుల్లో ఇల్లెక్కడ
[ 19-03-2024]
నిజంగా ప్రభుత్వం ఇస్తుందేమోనని కొందరు స్థలం కోసం, ఇంకొందరు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకుంటామని ముందుకొచ్చారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. -
అమృత్ అందలే
[ 19-03-2024]
పురపాలక సంఘాల్లో మరో 20 ఏళ్ల వరకు దాహార్తి సమస్య లేకుండా చేయాలన్నది అమృత్ 2.0 ఉద్దేశం. పార్కులు, మురుగునీటి శుద్ధి ప్లాంటు వంటి పనులు ప్రతిపాదించారు. తీరా ఈ ప్రభుత్వంలో పనులు చేస్తే బిల్లులు వస్తాయా? -
వదలా.. బొమ్మాళీ
[ 19-03-2024]
అధికారంలో ఉన్నాం.. మమ్మల్నెవరు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో అధినేత జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల ఫ్ల్లెక్సీలను విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. -
పట్టా పుట్టించారు.. సాయం పెంచేశారు
[ 19-03-2024]
ఓట్ల వేటలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు లేని పట్టాలను పుట్టిస్తోంది వైకాపా ప్రభుత్వం. వివిధ పథకాల కింద అందిన సొమ్ము సైతం ఎక్కువ అందినట్లు చెబుతూ ప్రచారం చేసుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
-
Hyd News: నకిలీ సాస్లు తయారు చేస్తున్న ముఠా అరెస్టు
-
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
-
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
-
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు