మద్దతు ధర పెంచి చింత తీర్చండి...!
సీతంపేట మన్యంలో చింతపండు సీజన్ ప్రారంభమైంది. పంటను సేకరిస్తున్న గిరిజనులు వారపు సంతలు, మార్కెట్లకు తెచ్చి విక్రయిస్తున్నారు. నాణ్యత, పెద్ద సైజు బొడస ఉంటే మంచి ధర పలుకుతోంది.
సీతంపేట వారపు సంతలో అమ్మకానికి తెచ్చిన చింతపండు
సీతంపేట, న్యూస్టుడే: సీతంపేట మన్యంలో చింతపండు సీజన్ ప్రారంభమైంది. పంటను సేకరిస్తున్న గిరిజనులు వారపు సంతలు, మార్కెట్లకు తెచ్చి విక్రయిస్తున్నారు. నాణ్యత, పెద్ద సైజు బొడస ఉంటే మంచి ధర పలుకుతోంది. ఈ ఏడాది పంట కూడా ఆశాజనకంగా ఉండటంతో గిరిజన రైతుల మోముల్లో సంతోషం కన్పిస్తోంది.
సీతంపేట ఐటీడీఏ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 130 ఎకరాల్లోని చెట్ల ద్వారా 468 టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. చెట్లు విడివిడిగా ఉంటాయి కనుక స్పష్టమైన లెక్కలు దొరకవని, ఇంతకంటే ఎక్కువ విసీర్ణంలోనే ఉండొచ్చని అంటున్నారు. తిత్లీ తుపాను తర్వాత చెట్లు బలహీనపడడం, చాలా కాలం కిందట నాటినవి కావడంతో ముదిరిపోవడం వంటి వాటి వల్ల కొన్నిసార్లు దిగుబడులు తగ్గుతున్నాయి. కొత్తగా నాటే పరిస్థితి లేకపోవడంతో ఒడిశాపైనా ఆధారపడాల్సి వస్తోందని వినియోగదారులు, వ్యాపారులు అంటున్నారు.
కాస్త సంతృప్తికరంగానే..: పెద్ద సైజు పండు అయితే ఒక రకంగా, చిన్నవైతే మరో రకంగా ధర పలుకుతుంది. కిలో రూ.45 నుంచి రూ.70, రూ.80 వరకూ అమ్ముడుపోతుంది. పంట ఎక్కువగా వస్తే ధర తగ్గే వీలుందని గిరిజనులు అంటున్నారు. ప్రస్తుతం బయట మార్కెట్లో మంచి రేటు పలుకుతున్నప్పటికీ గిరిజన సహకార సంస్థ(జీసీసీ) మాత్రం ప్రస్తుతం గతేడాది ప్రకటించినట్లు కిలో రూ.32.40 ధరనే అమలు చేస్తోంది. ఈ ఏడాది మద్దతు ధర ఇంత వరకు ప్రకటించలేదు. బయట మార్కెట్లో మంచి రేటు వస్తున్న నేపథ్యంలో మద్దతు ధరను పెంచాలని గిరిజనులు జీసీసీని కోరుతున్నారు.
కాపుతో చెట్లు కనిపిస్తున్నాయి..: ఈ ఏడాది చింత చెట్లు కాపుతో కనిపిస్తున్నాయి. 18 చెట్ల ద్వారా గతేడాది రూ.40 వేలు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే రూ.2 వేల సరకు విక్రయించాం. మిగతా పంట సేకరించి, తర్వాత అమ్ముతాం. వర్షాలు లేకపోవడంతో ఆశాజనకంగా ఉంది. జీసీసీ మద్దతు ధరను పెంచాలి.
సవర మల్లేష్, జగతిపల్లిరామన్నగూడ, సీతంపేట మండలం.
గతేడాది ధరకే కొనుగోలు: మంచి చింతపండు వస్తే గతేడాది జీసీసీ ప్రకటించిన ధరకే ప్రస్తుతం కొనుగోలు చేస్తాం, గతేడాది కిలో రూ.32.40 పైసలుగా ప్రకటించారు. ఇప్పటికైతే అదే ధరకు కొనుగోలు చేస్తాం. ఈ ఏడాది ఇంకా ఎలాంటి సూచనలు రాలేదు. గిరిజనులకు నష్టం జరగకుండా జీసీసీ ద్వారా మద్దతు ధర దొరికేలా చూస్తాం.
దాసరి కృష్ణ, మేనేజర్, జీసీసీ, సీతంపేట బ్రాంచి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదు పదుల వయసులోనూ పది పరీక్షకు హాజరు
[ 19-03-2024]
చదువుకోవాలనే తపన ఉండాలే కాని వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు గుమ్మలక్ష్మీపురం మండలంలోని మూలపాడుకు చెందిన పెద్దమ్మి. -
జీవనాధారం కల్పించండి సారూ!
[ 19-03-2024]
మన్యం జిల్లాలో ఏనుగులు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఐదేళ్లుగా జిల్లా నుంచి కదలకపోవడంతో రైతులతో పాటు పలు వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
కళ్లికోటలో కరిరాజుల అలజడి
[ 19-03-2024]
కొమరాడ మండలంలోని కళ్లికోట సమీపంలో కరిరాజుల గుంపు సంచరిస్తోంది. -
బిందెడు నీటికి ఎన్ని బాధలో..
[ 19-03-2024]
పార్వతీపురం మండలంలోని చినబొండపల్లిలో పరిస్థితి ఇది. గ్రామంలో ఇంటికో కుళాయి వేశారు. డి.శిర్లాం పైలెట్ ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా చేసేవారు. -
96.99 శాతం హాజరు
[ 19-03-2024]
జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 66 కేంద్రాల్లో 10,746 మందికి గాను 10,423 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఈ కష్టాలు ఎప్పుడు తీరేనో..?
[ 19-03-2024]
-
దోపిడీలకు దారొదిలేశారు!!
[ 19-03-2024]
గరుగుబిల్లి మండలంలోని ఖడ్గవలస కూడలి వద్ద ఓ రైస్ మిల్లు యజమాని తన భార్యతో కలిసి నివాసముంటున్నారు. గత నెల 26న ఉదయం సదరు వ్యక్తి మోటారు వేసేందుకు బయటకు వచ్చారు. -
ఐదేళ్లు ఊరుకున్నారు.. చివరిలో జారుకున్నారు!
[ 19-03-2024]
బొబ్బిలి పట్టణంలోని రామన్నదొరవలస వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాల్లో కొన్నింటిని ఎట్టకేలకు పూర్తి చేశారు. మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేదు. -
ఎమ్మెల్యే సారూ..90 రోజుల్లో ఇల్లెక్కడ
[ 19-03-2024]
నిజంగా ప్రభుత్వం ఇస్తుందేమోనని కొందరు స్థలం కోసం, ఇంకొందరు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకుంటామని ముందుకొచ్చారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. -
అమృత్ అందలే
[ 19-03-2024]
పురపాలక సంఘాల్లో మరో 20 ఏళ్ల వరకు దాహార్తి సమస్య లేకుండా చేయాలన్నది అమృత్ 2.0 ఉద్దేశం. పార్కులు, మురుగునీటి శుద్ధి ప్లాంటు వంటి పనులు ప్రతిపాదించారు. తీరా ఈ ప్రభుత్వంలో పనులు చేస్తే బిల్లులు వస్తాయా? -
వదలా.. బొమ్మాళీ
[ 19-03-2024]
అధికారంలో ఉన్నాం.. మమ్మల్నెవరు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో అధినేత జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల ఫ్ల్లెక్సీలను విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. -
పట్టా పుట్టించారు.. సాయం పెంచేశారు
[ 19-03-2024]
ఓట్ల వేటలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు లేని పట్టాలను పుట్టిస్తోంది వైకాపా ప్రభుత్వం. వివిధ పథకాల కింద అందిన సొమ్ము సైతం ఎక్కువ అందినట్లు చెబుతూ ప్రచారం చేసుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
-
Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
-
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
-
CAA: సీఏఏపై స్టే కోరుతూ పిటిషన్లు.. కేంద్రానికి మూడు వారాల గడువిచ్చిన సుప్రీం
-
Sita Soren: జేఎంఎంకు షాక్..! భాజపాలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
-
Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు