మద్దతు ధర పెంచి చింత తీర్చండి...!
సీతంపేట మన్యంలో చింతపండు సీజన్ ప్రారంభమైంది. పంటను సేకరిస్తున్న గిరిజనులు వారపు సంతలు, మార్కెట్లకు తెచ్చి విక్రయిస్తున్నారు. నాణ్యత, పెద్ద సైజు బొడస ఉంటే మంచి ధర పలుకుతోంది.
సీతంపేట వారపు సంతలో అమ్మకానికి తెచ్చిన చింతపండు
సీతంపేట, న్యూస్టుడే: సీతంపేట మన్యంలో చింతపండు సీజన్ ప్రారంభమైంది. పంటను సేకరిస్తున్న గిరిజనులు వారపు సంతలు, మార్కెట్లకు తెచ్చి విక్రయిస్తున్నారు. నాణ్యత, పెద్ద సైజు బొడస ఉంటే మంచి ధర పలుకుతోంది. ఈ ఏడాది పంట కూడా ఆశాజనకంగా ఉండటంతో గిరిజన రైతుల మోముల్లో సంతోషం కన్పిస్తోంది.
సీతంపేట ఐటీడీఏ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 130 ఎకరాల్లోని చెట్ల ద్వారా 468 టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. చెట్లు విడివిడిగా ఉంటాయి కనుక స్పష్టమైన లెక్కలు దొరకవని, ఇంతకంటే ఎక్కువ విసీర్ణంలోనే ఉండొచ్చని అంటున్నారు. తిత్లీ తుపాను తర్వాత చెట్లు బలహీనపడడం, చాలా కాలం కిందట నాటినవి కావడంతో ముదిరిపోవడం వంటి వాటి వల్ల కొన్నిసార్లు దిగుబడులు తగ్గుతున్నాయి. కొత్తగా నాటే పరిస్థితి లేకపోవడంతో ఒడిశాపైనా ఆధారపడాల్సి వస్తోందని వినియోగదారులు, వ్యాపారులు అంటున్నారు.
కాస్త సంతృప్తికరంగానే..: పెద్ద సైజు పండు అయితే ఒక రకంగా, చిన్నవైతే మరో రకంగా ధర పలుకుతుంది. కిలో రూ.45 నుంచి రూ.70, రూ.80 వరకూ అమ్ముడుపోతుంది. పంట ఎక్కువగా వస్తే ధర తగ్గే వీలుందని గిరిజనులు అంటున్నారు. ప్రస్తుతం బయట మార్కెట్లో మంచి రేటు పలుకుతున్నప్పటికీ గిరిజన సహకార సంస్థ(జీసీసీ) మాత్రం ప్రస్తుతం గతేడాది ప్రకటించినట్లు కిలో రూ.32.40 ధరనే అమలు చేస్తోంది. ఈ ఏడాది మద్దతు ధర ఇంత వరకు ప్రకటించలేదు. బయట మార్కెట్లో మంచి రేటు వస్తున్న నేపథ్యంలో మద్దతు ధరను పెంచాలని గిరిజనులు జీసీసీని కోరుతున్నారు.
కాపుతో చెట్లు కనిపిస్తున్నాయి..: ఈ ఏడాది చింత చెట్లు కాపుతో కనిపిస్తున్నాయి. 18 చెట్ల ద్వారా గతేడాది రూ.40 వేలు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే రూ.2 వేల సరకు విక్రయించాం. మిగతా పంట సేకరించి, తర్వాత అమ్ముతాం. వర్షాలు లేకపోవడంతో ఆశాజనకంగా ఉంది. జీసీసీ మద్దతు ధరను పెంచాలి.
సవర మల్లేష్, జగతిపల్లిరామన్నగూడ, సీతంపేట మండలం.
గతేడాది ధరకే కొనుగోలు: మంచి చింతపండు వస్తే గతేడాది జీసీసీ ప్రకటించిన ధరకే ప్రస్తుతం కొనుగోలు చేస్తాం, గతేడాది కిలో రూ.32.40 పైసలుగా ప్రకటించారు. ఇప్పటికైతే అదే ధరకు కొనుగోలు చేస్తాం. ఈ ఏడాది ఇంకా ఎలాంటి సూచనలు రాలేదు. గిరిజనులకు నష్టం జరగకుండా జీసీసీ ద్వారా మద్దతు ధర దొరికేలా చూస్తాం.
దాసరి కృష్ణ, మేనేజర్, జీసీసీ, సీతంపేట బ్రాంచి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన ఇంతే.. మీ దారి మీరే చూసుకోండి
[ 25-04-2024]
మన్యంలోని కొండలపై ఉన్న గ్రామాలకు వస్తే వీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుంది. అందుకేనేమో వీరు అక్కడికి వెళ్లరు.. ఒక వేళ వెళ్దామా అంటే రోడ్డు ఉంటే కదా.. అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వ పాలన. -
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!