logo

ఉద్యోగాలు ఇవ్వాలని మొర

వార్డులో సామాజిక భవనం మంజూరు చేయాలని ఉపముఖ్యమంత్రి రాజన్నదొరను గాంధీనగర్‌ ప్రజలు కోరారు. నిధులు మంజూరు చేస్తామని, పనులకు గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నందున నిర్మాణాన్ని మీరే చేసుకోవాలని వారికి ఆయన సూచించారు.

Published : 06 Feb 2023 04:29 IST

ఉపముఖ్యమంత్రికి దివ్యాంగ పింఛను కోరుతున్న యువకుడు

సాలూరు, న్యూస్‌టుడే: వార్డులో సామాజిక భవనం మంజూరు చేయాలని ఉపముఖ్యమంత్రి రాజన్నదొరను గాంధీనగర్‌ ప్రజలు కోరారు. నిధులు మంజూరు చేస్తామని, పనులకు గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నందున నిర్మాణాన్ని మీరే చేసుకోవాలని వారికి ఆయన సూచించారు. ఆదివారం ఆ వార్డులో ‘గడప గడపకూ వెళ్లి ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు. దివ్యాంగ పింఛను మంజూరు చేయాలని ఓ యువకుడు వినతిపత్రం ఇచ్చారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ పూర్తి చేసి చాలా మంది ఉద్యోగాల కోసం చూస్తున్నామని, అవకాశాలు కల్పించాలని పలువురు యువకులు రాజన్నదొర వద్ద మొరపెట్టుకున్నారు. ఇప్పటికే సచివాలయ పోస్టులు చాలా భర్తీ చేశామని, స్థానికంగా వాలంటీరు పోస్టులు వేశామని, జాబ్‌ క్యాలెండర్‌ను అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో పుర ఉపాధ్యక్షులు జె.దీప్తి, వి.అప్పలనాయుడు, మాజీ అధ్యక్షుడు జె.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని