ఉద్యోగాలు ఇవ్వాలని మొర
వార్డులో సామాజిక భవనం మంజూరు చేయాలని ఉపముఖ్యమంత్రి రాజన్నదొరను గాంధీనగర్ ప్రజలు కోరారు. నిధులు మంజూరు చేస్తామని, పనులకు గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నందున నిర్మాణాన్ని మీరే చేసుకోవాలని వారికి ఆయన సూచించారు.
ఉపముఖ్యమంత్రికి దివ్యాంగ పింఛను కోరుతున్న యువకుడు
సాలూరు, న్యూస్టుడే: వార్డులో సామాజిక భవనం మంజూరు చేయాలని ఉపముఖ్యమంత్రి రాజన్నదొరను గాంధీనగర్ ప్రజలు కోరారు. నిధులు మంజూరు చేస్తామని, పనులకు గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నందున నిర్మాణాన్ని మీరే చేసుకోవాలని వారికి ఆయన సూచించారు. ఆదివారం ఆ వార్డులో ‘గడప గడపకూ వెళ్లి ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు. దివ్యాంగ పింఛను మంజూరు చేయాలని ఓ యువకుడు వినతిపత్రం ఇచ్చారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పూర్తి చేసి చాలా మంది ఉద్యోగాల కోసం చూస్తున్నామని, అవకాశాలు కల్పించాలని పలువురు యువకులు రాజన్నదొర వద్ద మొరపెట్టుకున్నారు. ఇప్పటికే సచివాలయ పోస్టులు చాలా భర్తీ చేశామని, స్థానికంగా వాలంటీరు పోస్టులు వేశామని, జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో పుర ఉపాధ్యక్షులు జె.దీప్తి, వి.అప్పలనాయుడు, మాజీ అధ్యక్షుడు జె.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్ను పంచుకున్న సముద్రఖని
-
Ap-top-news News
ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల పహారా