పులి దాడిలో ఆవు మృతి
మండలంలోని దిగువకొండపర్తి పంచాయతీ పరిధిలోగల రాంపాలెం వద్ద పులి పంజాకు ఓ ఆవు బలైంది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో ఆ ప్రాంత గిరిజనుల్లో గుబులు రేగింది.
అటవీశాఖాధికారులు గుర్తించిన బెబ్బులి పాదముద్ర
గంట్యాడ గ్రామీణం, న్యూస్టుడే: మండలంలోని దిగువకొండపర్తి పంచాయతీ పరిధిలోగల రాంపాలెం వద్ద పులి పంజాకు ఓ ఆవు బలైంది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో ఆ ప్రాంత గిరిజనుల్లో గుబులు రేగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాటిపూడి జలాయానికి ఆవల ఉన్న రాంపాలేనికి చెందిన పైకరి నాగరాజు పశువులశాలపై బెబ్బులి దాడిచేసి ఆవును చంపేసింది. ఆదివారం ఉదయం ఆవు కళేబరాన్ని గమనించిన రైతు, గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా అటవీ అధికారులు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. అక్కడ పాదముద్రలను గుర్తించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చీపురుపల్లికి కొత్త కళా
[ 30-03-2024]
తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. చీపురుపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా మాజీ మంత్రి, ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావుకు అవకాశం దక్కింది. -
కలిశెట్టికి కలిసొచ్చె
[ 30-03-2024]
విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు పేరును ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఆది నుంచి ఎచ్చెర్ల శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. -
అరాచక ప్రభుత్వాన్ని దించితేనే రాష్ట్రానికి భవిత
[ 30-03-2024]
నందమూరి తారక రామారావు త్యాగశీలి అని, ప్రజల కోసమే ఆయన తెదేపాను ప్రారంభించారని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. -
అయిదు వేల ఇళ్ల రద్దు
[ 30-03-2024]
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద విజయనగరం జిల్లాలో మంజూరు చేసిన 78,127 గృహాల్లో 40,172 పూర్తి కాగా, పనులు ప్రారంభించనవి 2,263 ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో మంజూరైన 27,142 ఇళ్లలో 12,992 పూర్తి చేయగా, 2,725 ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు. -
చీపురుపల్లిలో వాలంటీర్లకు తాయిలాలు
[ 30-03-2024]
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని వాలంటీర్లకు రెండు రోజులుగా తాయిలాలు గుట్టుగా పంపిణీ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రతి ఒక్కరికీ రూ.5 వేల చొప్పున అందజేశారు. -
4న వారాహి యాత్ర
[ 30-03-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఈ నెల 4న నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించనున్నారు. -
‘నోటు’మాట కుదరదు
[ 30-03-2024]
ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు వినియోగించే మద్యం, నగదు రవాణా, పంపిణీపై విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పోలీసు యంత్రాంగం నిఘా వేసింది. -
ఏదీ ఆ పర్యవేక్షణ
[ 30-03-2024]
ఉమ్మడి జిల్లాలో క్షయ విజృంభిస్తోంది. గత మూడేళ్లలో ఏడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది విజయనగరం జిల్లాలో మూడు నెలల వ్యవధిలో 600 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. -
కొలువులకు ఎసరు!!
[ 30-03-2024]
చదువుతో పాటు నైపుణ్యాలను పెంచేందుకు గత ప్రభుత్వం డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక కోర్సులను అందించేది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంప్లాయిబిల్టీ స్కిల్ సెంటర్లను తీసుకొచ్చింది. చివరి ఏడాది చదువుతుండగానే తరగతులు పూర్తిచేసి, సంబంధిత ధ్రువపత్రాలు అందజేసేది. -
గిట్టుబాటు దక్కేనా?
[ 30-03-2024]
ఉపాధి పథకం కింద కేంద్రం అందిస్తున్న రోజు వారీ వేతనం రూ.300లకు పెరిగింది. ఇంతవరకు రూ.272గా ఉండేది. పెరిగిన కూలి ఏప్రిల్ 1 నుంచి జరిగే పనులకు వర్తించనుంది. -
విజయనగరమే
[ 30-03-2024]
ఎప్పుడో మే నెలలో ప్రతాపం చూపాల్సిన ఎండలు మార్చిలోనే దడదడలాడిస్తున్నాయి. ఏప్రిల్లో మరింత ముదరనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. -
కొండెక్కిన కొండలోయ గెడ్డ
[ 30-03-2024]
కొండలోయగెడ్డ రిజర్వాయర్ అర్థాంతరంగా నిలిచిపోవడంతో భామిని ప్రాంత రైతులు గత 17 ఏళ్లుగా నీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. పొందుపాము, చీకటితోట గెడ్డల నీటిని నిల్వ ఉంచి భామిని ప్రాంతంలో 1000 ఎకరాలకు అందించాలనే లక్ష్యంతో కొండలోయ గెడ్డ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు.