పాడి అభివృద్ధికి ప్రణాళికాబద్ధ చర్యలు
ఉమ్మడి జిల్లాలోని ఒడిశా సరిహద్దు గ్రామాల్లో పశువులకు కొన్నాళ్లుగా ప్రబలుతున్న ముద్దచర్మ వ్యాధి కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, వేసవిలో పశుగ్రాసం కొరత రాకుండా రాయితీపై సరఫరా చేయనున్నట్లు పశుసంవర్ధకశాఖ ఉప సంచాలకుడు ఆర్.నీలయ్య తెలిపారు.
న్యూస్టుడే, బొబ్బిలి: ఉమ్మడి జిల్లాలోని ఒడిశా సరిహద్దు గ్రామాల్లో పశువులకు కొన్నాళ్లుగా ప్రబలుతున్న ముద్దచర్మ వ్యాధి కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, వేసవిలో పశుగ్రాసం కొరత రాకుండా రాయితీపై సరఫరా చేయనున్నట్లు పశుసంవర్ధకశాఖ ఉప సంచాలకుడు ఆర్.నీలయ్య తెలిపారు. రానున్న సీజన్లో తమ శాఖ చేపట్టబోయే ప్రణాళికలపై ఆయన ఆదివారం ‘న్యూస్టుడే’తో ముచ్చటించారు.
రాయితీపై దాణా..
ఏటా వేసవిలో పశుగ్రాసం కొరత పాడి రైతులను వేధిస్తోంది. అధిక ధరకు కొనుగోలు చేయలేక పశువులను అమ్మేస్తుండడంతో పాల ఉత్పత్తి తగ్గుతోంది. దీనిని నియంత్రించేందుకు పౌషకాలతో కూడిన దాణాను రాయితీపై అందిస్తున్నాం. కిలో రూ.52 విలువ చేసే ప్యాకెట్ రూ.38లకే ఇస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా, బొబ్బిలి డివిజన్లో 76 టన్నుల మేర అందజేస్తాం. చేయూత పథకంలో భాగంగా రైతులు పశువులు కొని ఉపాధి పొందొచ్చు.
పూర్తిస్థాయిలో టీకాలు
రెండు జిల్లాల్లో ముద్ద చర్మవ్యాధి సమీప ఒడిశా సరిహద్దు నుంచి వ్యాపించింది. ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టినా.. ఇంకా కొన్నిచోట్ల కేసులు బయటపడుతున్నాయి. నిర్మూలనకు సుమారు లక్ష డోసుల వ్యాక్సిన్లు సరఫరా చేశాం. వ్యాధి పూర్తి నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
393 కేంద్రాల్లో పాలసేకరణ
తమ పరిధిలో 393 పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 353కి స్థల సేకరణ పూర్తయింది. మిగిలిన వాటికి సంబంధించి గుర్తించాల్సి ఉంది. ఆపై నిర్మాణాలు చేపట్టాక సేకరణ ప్రారంభిస్తాం. విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. సేకరించిన పాలను నిల్వ చేసేందుకు కూడా కొన్ని కేంద్రాలను గుర్తించాం. వాటి నిర్మాణానికి స్థల సేకరణ జరుగుతోంది.
పాడి ఉత్పత్తికి చర్యలు
మన్యం జిల్లా, బొబ్బిలి డివిజన్ పరిధిలో మొత్తం 2,18,635 పశు సంపద ఉంది. పాడి అభివృద్ధి చేసేందుకు ఆడదూడల ఉత్పత్తి పథకంలో భాగంగా కృత్రిమ గర్భధారణ కోసం రెండు వీర్యనాళికలను రాయితీపై అందిస్తున్నాం. దీని ధర రూ.1600 కాగా రాయితీపై రూ.500 లకే ఇస్తాం. ఒకవేళ ఆడదూడలు పుట్టకపోతే రైతు చెల్లించిన డబ్బులు వాపసు చేస్తాం. జెర్సీ రకాలకు సంబంధించిన చూడు కడుతున్నాం. దీనివల్ల పాడి ఉత్పత్తి పెరుగుతుంది. రైతుకు మెరుగైన ఆదాయం వస్తోంది. మినీ గోకులాల పనులు 72 చోట్ల జరుగుతున్నాయి. ఇటీవలే బిల్లులు చెల్లించాం. కొన్నిచోట్ల సాంకేతిక కారణాలతో నిలిచాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పశువుల అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఉంది. ఎవరైనా తరలిస్తే చర్యలు తప్పవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదు పదుల వయసులోనూ పది పరీక్షకు హాజరు
[ 19-03-2024]
చదువుకోవాలనే తపన ఉండాలే కాని వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు గుమ్మలక్ష్మీపురం మండలంలోని మూలపాడుకు చెందిన పెద్దమ్మి. -
జీవనాధారం కల్పించండి సారూ!
[ 19-03-2024]
మన్యం జిల్లాలో ఏనుగులు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఐదేళ్లుగా జిల్లా నుంచి కదలకపోవడంతో రైతులతో పాటు పలు వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
కళ్లికోటలో కరిరాజుల అలజడి
[ 19-03-2024]
కొమరాడ మండలంలోని కళ్లికోట సమీపంలో కరిరాజుల గుంపు సంచరిస్తోంది. -
బిందెడు నీటికి ఎన్ని బాధలో..
[ 19-03-2024]
పార్వతీపురం మండలంలోని చినబొండపల్లిలో పరిస్థితి ఇది. గ్రామంలో ఇంటికో కుళాయి వేశారు. డి.శిర్లాం పైలెట్ ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా చేసేవారు. -
96.99 శాతం హాజరు
[ 19-03-2024]
జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 66 కేంద్రాల్లో 10,746 మందికి గాను 10,423 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఈ కష్టాలు ఎప్పుడు తీరేనో..?
[ 19-03-2024]
-
దోపిడీలకు దారొదిలేశారు!!
[ 19-03-2024]
గరుగుబిల్లి మండలంలోని ఖడ్గవలస కూడలి వద్ద ఓ రైస్ మిల్లు యజమాని తన భార్యతో కలిసి నివాసముంటున్నారు. గత నెల 26న ఉదయం సదరు వ్యక్తి మోటారు వేసేందుకు బయటకు వచ్చారు. -
ఐదేళ్లు ఊరుకున్నారు.. చివరిలో జారుకున్నారు!
[ 19-03-2024]
బొబ్బిలి పట్టణంలోని రామన్నదొరవలస వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాల్లో కొన్నింటిని ఎట్టకేలకు పూర్తి చేశారు. మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేదు. -
ఎమ్మెల్యే సారూ..90 రోజుల్లో ఇల్లెక్కడ
[ 19-03-2024]
నిజంగా ప్రభుత్వం ఇస్తుందేమోనని కొందరు స్థలం కోసం, ఇంకొందరు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకుంటామని ముందుకొచ్చారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. -
అమృత్ అందలే
[ 19-03-2024]
పురపాలక సంఘాల్లో మరో 20 ఏళ్ల వరకు దాహార్తి సమస్య లేకుండా చేయాలన్నది అమృత్ 2.0 ఉద్దేశం. పార్కులు, మురుగునీటి శుద్ధి ప్లాంటు వంటి పనులు ప్రతిపాదించారు. తీరా ఈ ప్రభుత్వంలో పనులు చేస్తే బిల్లులు వస్తాయా? -
వదలా.. బొమ్మాళీ
[ 19-03-2024]
అధికారంలో ఉన్నాం.. మమ్మల్నెవరు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో అధినేత జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల ఫ్ల్లెక్సీలను విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. -
పట్టా పుట్టించారు.. సాయం పెంచేశారు
[ 19-03-2024]
ఓట్ల వేటలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు లేని పట్టాలను పుట్టిస్తోంది వైకాపా ప్రభుత్వం. వివిధ పథకాల కింద అందిన సొమ్ము సైతం ఎక్కువ అందినట్లు చెబుతూ ప్రచారం చేసుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
Elon Musk: ‘అవును కెటామైన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
-
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్దేవ్బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్