రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన పూసపాటిరేగ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై నరేష్ వివరాల మేరకు.. కుమిలి గ్రామానికి చెందిన కుర్ని వెంకటేష్(16) ఆదివారం రెల్లివలస నుంచి స్వగ్రామం వెళ్తున్నాడు.
పూసపాటిరేగ, న్యూస్టుడే: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన పూసపాటిరేగ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై నరేష్ వివరాల మేరకు.. కుమిలి గ్రామానికి చెందిన కుర్ని వెంకటేష్(16) ఆదివారం రెల్లివలస నుంచి స్వగ్రామం వెళ్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన గేదెల పైడినాయుడు(29) కుమిలి నుంచి రెల్లివలస వెళ్తున్నారు. మార్గమధ్యలో వీరిద్దరూ ఎదురెదురుగా బలంగా ఢీకొన్నారు. వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా పైడినాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రుడ్ని వెంటనే సర్వజన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖకు తీసుకెళ్తుండగా మధ్యలోనే మరణించారు. వెంకటేష్ పూసపాటిరేగలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు రాజీనాయుడు, అసిరమ్మ, ఓ సోదరుడు ఉన్నారు. వ్యవసాయ పనులు చేస్తూ కుమారుడ్ని చదివిస్తున్నారు. వ్యక్తిగత పనిపై బైక్తో వెళ్తుండగా మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పైడినాయుడు పూసపాటిరేగలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇతనికి తల్లిదండ్రులు రాజీనాయుడు, రాములమ్మ, అన్నయ్య ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను సర్వజన ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదు పదుల వయసులోనూ పది పరీక్షకు హాజరు
[ 19-03-2024]
చదువుకోవాలనే తపన ఉండాలే కాని వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు గుమ్మలక్ష్మీపురం మండలంలోని మూలపాడుకు చెందిన పెద్దమ్మి. -
జీవనాధారం కల్పించండి సారూ!
[ 19-03-2024]
మన్యం జిల్లాలో ఏనుగులు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఐదేళ్లుగా జిల్లా నుంచి కదలకపోవడంతో రైతులతో పాటు పలు వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
కళ్లికోటలో కరిరాజుల అలజడి
[ 19-03-2024]
కొమరాడ మండలంలోని కళ్లికోట సమీపంలో కరిరాజుల గుంపు సంచరిస్తోంది. -
బిందెడు నీటికి ఎన్ని బాధలో..
[ 19-03-2024]
పార్వతీపురం మండలంలోని చినబొండపల్లిలో పరిస్థితి ఇది. గ్రామంలో ఇంటికో కుళాయి వేశారు. డి.శిర్లాం పైలెట్ ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా చేసేవారు. -
96.99 శాతం హాజరు
[ 19-03-2024]
జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 66 కేంద్రాల్లో 10,746 మందికి గాను 10,423 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఈ కష్టాలు ఎప్పుడు తీరేనో..?
[ 19-03-2024]
-
దోపిడీలకు దారొదిలేశారు!!
[ 19-03-2024]
గరుగుబిల్లి మండలంలోని ఖడ్గవలస కూడలి వద్ద ఓ రైస్ మిల్లు యజమాని తన భార్యతో కలిసి నివాసముంటున్నారు. గత నెల 26న ఉదయం సదరు వ్యక్తి మోటారు వేసేందుకు బయటకు వచ్చారు. -
ఐదేళ్లు ఊరుకున్నారు.. చివరిలో జారుకున్నారు!
[ 19-03-2024]
బొబ్బిలి పట్టణంలోని రామన్నదొరవలస వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాల్లో కొన్నింటిని ఎట్టకేలకు పూర్తి చేశారు. మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేదు. -
ఎమ్మెల్యే సారూ..90 రోజుల్లో ఇల్లెక్కడ
[ 19-03-2024]
నిజంగా ప్రభుత్వం ఇస్తుందేమోనని కొందరు స్థలం కోసం, ఇంకొందరు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకుంటామని ముందుకొచ్చారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. -
అమృత్ అందలే
[ 19-03-2024]
పురపాలక సంఘాల్లో మరో 20 ఏళ్ల వరకు దాహార్తి సమస్య లేకుండా చేయాలన్నది అమృత్ 2.0 ఉద్దేశం. పార్కులు, మురుగునీటి శుద్ధి ప్లాంటు వంటి పనులు ప్రతిపాదించారు. తీరా ఈ ప్రభుత్వంలో పనులు చేస్తే బిల్లులు వస్తాయా? -
వదలా.. బొమ్మాళీ
[ 19-03-2024]
అధికారంలో ఉన్నాం.. మమ్మల్నెవరు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో అధినేత జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల ఫ్ల్లెక్సీలను విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. -
పట్టా పుట్టించారు.. సాయం పెంచేశారు
[ 19-03-2024]
ఓట్ల వేటలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు లేని పట్టాలను పుట్టిస్తోంది వైకాపా ప్రభుత్వం. వివిధ పథకాల కింద అందిన సొమ్ము సైతం ఎక్కువ అందినట్లు చెబుతూ ప్రచారం చేసుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!