logo

సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలి

వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలను, చేస్తున్న అభివృద్ధి గురించి గ్రామప్రజలకు గృహ సారథులు, సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్లు, కార్యకర్తలు తెలియజేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు కోరారు.

Updated : 06 Feb 2023 20:57 IST

బలిజిపేట: వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలను, చేస్తున్న అభివృద్ధి గురించి గ్రామప్రజలకు గృహ సారథులు, సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్లు, కార్యకర్తలు తెలియజేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు కోరారు. బలిజిపేట కళింగ వైశ్య కల్యాణ మండపంలో సోమవారం తొమ్మిది గ్రామాల గృహ సారథులకు, సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రామాల్లోని వాలంటీర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి అర్హులందరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తూ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. లబ్ధి పొందిన వారంతా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేందుకు సారథులు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మామిడి శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిని, ఈ ప్రాంత అభివృద్ధిని చూసి జోగారావును ఎమ్మెల్యేగా, జగన్‌ మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు అలజంగి రవికుమార్‌, ఎంపీపీ గుడివాడ నాగమణి, వైస్‌ ఎంపీపీలు వెలిది సాయిరాం, బెవర హేమలత, పార్టీ అధ్యక్షుడు మురళీకృష్ణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పది గ్రామాల వాలంటీర్లు, సారథులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని