సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలి
వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలను, చేస్తున్న అభివృద్ధి గురించి గ్రామప్రజలకు గృహ సారథులు, సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్లు, కార్యకర్తలు తెలియజేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు కోరారు.
బలిజిపేట: వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలను, చేస్తున్న అభివృద్ధి గురించి గ్రామప్రజలకు గృహ సారథులు, సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్లు, కార్యకర్తలు తెలియజేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు కోరారు. బలిజిపేట కళింగ వైశ్య కల్యాణ మండపంలో సోమవారం తొమ్మిది గ్రామాల గృహ సారథులకు, సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గ్రామాల్లోని వాలంటీర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి అర్హులందరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తూ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. లబ్ధి పొందిన వారంతా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేందుకు సారథులు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ మామిడి శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిని, ఈ ప్రాంత అభివృద్ధిని చూసి జోగారావును ఎమ్మెల్యేగా, జగన్ మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు అలజంగి రవికుమార్, ఎంపీపీ గుడివాడ నాగమణి, వైస్ ఎంపీపీలు వెలిది సాయిరాం, బెవర హేమలత, పార్టీ అధ్యక్షుడు మురళీకృష్ణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పది గ్రామాల వాలంటీర్లు, సారథులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదు పదుల వయసులోనూ పది పరీక్షకు హాజరు
[ 19-03-2024]
చదువుకోవాలనే తపన ఉండాలే కాని వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు గుమ్మలక్ష్మీపురం మండలంలోని మూలపాడుకు చెందిన పెద్దమ్మి. -
జీవనాధారం కల్పించండి సారూ!
[ 19-03-2024]
మన్యం జిల్లాలో ఏనుగులు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఐదేళ్లుగా జిల్లా నుంచి కదలకపోవడంతో రైతులతో పాటు పలు వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
కళ్లికోటలో కరిరాజుల అలజడి
[ 19-03-2024]
కొమరాడ మండలంలోని కళ్లికోట సమీపంలో కరిరాజుల గుంపు సంచరిస్తోంది. -
బిందెడు నీటికి ఎన్ని బాధలో..
[ 19-03-2024]
పార్వతీపురం మండలంలోని చినబొండపల్లిలో పరిస్థితి ఇది. గ్రామంలో ఇంటికో కుళాయి వేశారు. డి.శిర్లాం పైలెట్ ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా చేసేవారు. -
96.99 శాతం హాజరు
[ 19-03-2024]
జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 66 కేంద్రాల్లో 10,746 మందికి గాను 10,423 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఈ కష్టాలు ఎప్పుడు తీరేనో..?
[ 19-03-2024]
-
దోపిడీలకు దారొదిలేశారు!!
[ 19-03-2024]
గరుగుబిల్లి మండలంలోని ఖడ్గవలస కూడలి వద్ద ఓ రైస్ మిల్లు యజమాని తన భార్యతో కలిసి నివాసముంటున్నారు. గత నెల 26న ఉదయం సదరు వ్యక్తి మోటారు వేసేందుకు బయటకు వచ్చారు. -
ఐదేళ్లు ఊరుకున్నారు.. చివరిలో జారుకున్నారు!
[ 19-03-2024]
బొబ్బిలి పట్టణంలోని రామన్నదొరవలస వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్ల సముదాయాల్లో కొన్నింటిని ఎట్టకేలకు పూర్తి చేశారు. మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించలేదు. -
ఎమ్మెల్యే సారూ..90 రోజుల్లో ఇల్లెక్కడ
[ 19-03-2024]
నిజంగా ప్రభుత్వం ఇస్తుందేమోనని కొందరు స్థలం కోసం, ఇంకొందరు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకుంటామని ముందుకొచ్చారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. -
అమృత్ అందలే
[ 19-03-2024]
పురపాలక సంఘాల్లో మరో 20 ఏళ్ల వరకు దాహార్తి సమస్య లేకుండా చేయాలన్నది అమృత్ 2.0 ఉద్దేశం. పార్కులు, మురుగునీటి శుద్ధి ప్లాంటు వంటి పనులు ప్రతిపాదించారు. తీరా ఈ ప్రభుత్వంలో పనులు చేస్తే బిల్లులు వస్తాయా? -
వదలా.. బొమ్మాళీ
[ 19-03-2024]
అధికారంలో ఉన్నాం.. మమ్మల్నెవరు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో అధినేత జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల ఫ్ల్లెక్సీలను విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ప్రధాన కూడళ్లు, రహదారుల పక్కన విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. -
పట్టా పుట్టించారు.. సాయం పెంచేశారు
[ 19-03-2024]
ఓట్ల వేటలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు లేని పట్టాలను పుట్టిస్తోంది వైకాపా ప్రభుత్వం. వివిధ పథకాల కింద అందిన సొమ్ము సైతం ఎక్కువ అందినట్లు చెబుతూ ప్రచారం చేసుకుంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
Suryakumar Yadav: ఐపీఎల్ మ్యాచ్లకు సూర్య దూరమేనా? ఇన్స్టా పోస్ట్ వైరల్
-
LS polls: డిపాజిట్ దక్కకున్నా పోటీకి సై.. 71 వేల మంది డిపాజిట్లు ‘గల్లంతు’
-
Hyderabad: ప్రణీత్రావుకు సహకరించింది ఎవరు?
-
IPL 2023 Rewind: గత సీజన్ ఐపీఎల్ హీరోలు.. లిస్ట్లో ఎవరున్నారంటే?
-
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
-
PM Modi: సేలం సభలో ప్రధాని మోదీ భావోద్వేగం