logo

‘ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మితే ప్రజలే నష్టపోతారు’

ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మితే ప్రజలే నష్టపోతారని తితిదే ఛైర్మన్‌, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి అన్నారు.

Updated : 07 Feb 2023 03:30 IST

సమావేశంలో పాల్గొన్న తితిదే ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే తదితరులు

కొత్తవలస, న్యూస్‌టుడే: ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మితే ప్రజలే నష్టపోతారని తితిదే ఛైర్మన్‌, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. కొత్తవలసలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లను సమన్వయం చేసుకుని పనిచేయాలని గృహ సారథులకు సూచించారు. పార్టీ పరంగా త్వరలో బీమా పథకం ప్రవేశపెడతామని వెల్లడించారు. బిల్లులు రాలేదని, కార్యకర్తల కోసం పని చేయలేదనే ఆలోచనలు పెట్టుకోకుండా, పార్టీ కోసం పనిచేయాని  జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కోరారు. అనంతరం మండలాల వారీగా రహస్య భేటీ నిర్వహించారు. ఎంపీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ రఘురాజు, విజయకుమార్‌, జీసీసీ ఛైర్మన్‌ స్వాతిరాణి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని