గ్రామీణ రహదారులకు మోక్షం
రాష్ట్రంలో రహదారుల నిర్వహణ సరిగా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యంత్రాంగంలో కదలిక వచ్చింది. అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లకు మరమ్మతులు చేసే దిశగా జిల్లాలో కసరత్తు జరుగుతోంది.
మరమ్మతులకు 20 మార్గాల గుర్తింపు
కొమరాడ మండలం అర్తాం నుంచి కళ్లికోటకు వెళ్లే రహదారి ఇది. గోతులమయంగా మారిన దీన్ని మరమ్మతులకు అధికారులు ప్రతిపాదించారు.
పార్వతీపురం, న్యూస్టుడే: రాష్ట్రంలో రహదారుల నిర్వహణ సరిగా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యంత్రాంగంలో కదలిక వచ్చింది. అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లకు మరమ్మతులు చేసే దిశగా జిల్లాలో కసరత్తు జరుగుతోంది. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అవసరమైన నిధులపై అంచనాలు రూపొందించాలని పీఆర్, ర.భ., ప్రజా పనులు, గిరిజన సంక్షేమ శాఖల అధికారులను కలెక్టరు నిశాంత్కుమార్ ఆదేశించారు. ఈ అంచనాలను బుధవారం నాటికి సమర్పిస్తే సీఎంవోకు పంపించనున్నారు.
జిల్లాలో నియోజకవర్గానికి ఐదు రహదారుల చొప్పున 20 ప్రతిపాదించారు. వీటిని అత్యంత ప్రాధాన్యమున్న జాబితాలో చేర్చారు. ఇప్పటికే వీటిలో కొన్ని పనులు జరుగుతుండగా మిగిలినవి అత్యంత దయనీయ స్థితిలో ఉన్నట్లు చూపారు.
నియోజకవర్గాల వారీగా..
కురుపాం..
కొమరాడ మండలంలోని అర్తాం -కళ్లికోట (4.5 కి.మీ), గరుగుబిల్లి మండలంలోని వల్లరిగుడబ- రాయందొరవలస (2.5 కి.మీ), జియ్యమ్మవలస మండలంలోని బీజేపురం-తురకనాయుడువలస (7.7 కి.మీ), చినమేరంగి - పిప్పలభద్ర (4.4 కి.మీ), పూర్తిగా కోతకు గురైన కురుపాం మండలంలోని నీలకంఠాపురం-జరడ (9 కి.మీ) మార్గం.
పార్వతీపురం..
పార్వతీపురం మండలం ఎన్.ములగ - డోకిశిల (5 కి.మీ) బలిజిపేట మండలం బర్లి - అరసాడ, అరసాడ-మురగడం, సీతానగరం మండలం బూర్జ -గాజులవలస, ఏగోటివలస మీదుగా గాదెలవలస వరకు.
సాలూరు..
పాచిపెంట మండలం పద్మాపురం-ఏతంవలస, మెంటాడ మండలం లక్ష్మీపురం, పిట్టాడ, జయతి రోడ్లు.సాలూరు నుంచి మక్కువ వరకు ఉన్న రోడ్డును ప్రస్తుతం జాతీయ అభివృద్ధి బ్యాంకు నిధులతో మెరుగుపరుస్తున్నారు. ఇక్కడ సాలూరు పట్టణంలో పోస్టాఫీసు, శివాజీ బొమ్మ వద్ద రోడ్లను ప్రాధాన్యత జాబితాలో చేర్చారు.
పాలకొండ..
సీతంపేట మండలం ముత్యాలు కూడలి నుంచి చాకలిగూడ వరకు (7 కి.మీ), తొత్తడి - బోయనగూడ, జంపరకోట - అచ్చబ, వీరఘట్టం మండలం సీపీఎస్ - చిమిడి (5 కి.మీ), నవగాం కూడలి -జంపరకోట మార్గాలకు మరమ్మతులు చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
[ 20-04-2024]
ఆంధ్రా దారులు ఇంత ఘోరమా.. ఈ మాట ఎవరన్నా తల దించుకోవాల్సిందే.. మన దగ్గర రోడ్డుకు ఒడిశా వారు వచ్చి మరమ్మతులు చేస్తుంటే అంత కన్నా.. సిగ్గు ఏముంటుంది. మన పాలకుల చేతగాని తనానికి ఇదే నిదర్శనం. -
తోటపల్లి పార్కు జీవం తీసేశారు
[ 20-04-2024]
మన్యంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా తెదేపా హయాంలో 2016-17 మధ్య తోటపల్లి ప్రాజెక్టు గట్టుకు ఆనుకొని ఐటీడీఏ ఆధ్వర్యంలో పార్కు ఏర్పాటు చేశారు. -
అయిదేళ్లలో బొత్స సోదరుల ఆస్తులు రెట్టింపు
[ 20-04-2024]
నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు అధిక సంఖ్యలోనే దాఖలయ్యాయి. శృంగవరపుకోట అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అఫిడవిట్ దాఖలు చేయలేదు. -
వాహనాల్లో కుక్కేశారు.. ట్రాఫిక్లో ఉంచేశారు
[ 20-04-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నామినేషన్ల పర్వం సాగింది. ఈక్రమంలో వైకాపా అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలతో పాటు కూలీలను తరలించారు. -
తరలింపు వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
[ 20-04-2024]
నామినేషన్ ఘట్టానికి వైకాపా కార్యకర్తలను తరలించిన ఆటో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు రాజాన దిలీప్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. -
ఉల్లంఘనలు కనిపించడం లేదా?
[ 20-04-2024]
పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగారావు ఏం చేసినా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తున్నా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తోంది. -
ప్రజలకు జగనన్న షాక్
[ 20-04-2024]
తాము అధికారంలోకి వస్తే విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తామని నాడు ప్రతిపక్ష నేతగా బాకా ఊదారు సీఎం జగన్. బాదుడే.. బాదుడు అంటూ అప్పటి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేశారు. దీంతో నిజమని నమ్మేశారు కొందరు ప్రజలు. -
చందనోత్సవ వైఫల్యాలపై నివేదిక ఏదీ..?: అశోక్
[ 20-04-2024]
సింహాచలం దేవస్థానంలో గతేడాది చందనోత్సవ సమయంలో జరిగిన వైఫల్యాలపై చేపట్టిన విచారణ నివేదిక ఇప్పటికీ బయటకు రాలేదని ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అన్నారు. -
ప్రజావ్యతిరేక పాలకుడు జగన్
[ 20-04-2024]
ప్రజావ్యతిరేక పాలకుడు జగన్కు రోజులు దగ్గర పడ్డాయని, వైకాపా వచ్చిన తర్వాత దోపిడీ ఎక్కువైందని చీపురుపల్లి ఎన్డీయే అభ్యర్థి కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారన్నారు.