ధాన్యం రైతు కంట కన్నీరు
ఏ గ్రామానికి వెళ్లినా కల్లాల్లోనే ధాన్యం బస్తాలు దర్శనమిస్తున్నాయి. వాటిపై గడ్డి కప్పి భద్రపరిచారు. అధికారులేమో లక్ష్యం ముగిసింది.. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే కానీ కొనలేమని చేతులెత్తేస్తున్నారు.
ఈనాడు-విజయనగరం, గజపతినగరం, జామి, భోగాపురం బొబ్బిలి, న్యూస్టుడే
భోగాపురం మండలం ములగాడలో బస్తాల వద్ద రైతు
ఏ గ్రామానికి వెళ్లినా కల్లాల్లోనే ధాన్యం బస్తాలు దర్శనమిస్తున్నాయి. వాటిపై గడ్డి కప్పి భద్రపరిచారు. అధికారులేమో లక్ష్యం ముగిసింది.. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే కానీ కొనలేమని చేతులెత్తేస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు, దళారులు రైతులను నిలువునా దోచుకుంటున్నారు. సాధారణ రకం క్వింటాకు రూ.2024, ఏ-గ్రేడ్కు రూ.2060 మద్దతు ధర ఉండగా.. రూ.1400 నుంచి రూ.1500లకు కొనుగోలు చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో 2,30,692 ఎకరాల్లో వరి సాగు చేయగా.. 5.11 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 2.64 లక్షల టన్నులు కొనాలని లక్ష్యం నిర్దేశించారు. దీన్ని చేరుకొని 20 రోజులు గడిచింది. అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఇంకా సేకరించాల్సిన ధాన్యం ఆర్బీకేల పరిధిలో 1.05 లక్షల టన్నులు ఉన్నట్లు గుర్తించి ఆ వివరాలు యాప్లో నమోదు చేశారు. ఇందులో 70 వేల టన్నులు సేకరించడానికి అంగీకరించి.. 40 వేల టన్నులకు అనుమతులు ఇచ్చి దాదాపుగా లక్ష్యం చేరుకున్నారు. మిగిలిన 60.05 వేల టన్నుల పంట రైతుల వద్దే ఉండిపోయింది. పార్వతీపురం మన్యం జిల్లాలో 1,71,762 ఎకరాల్లో సాగు చేయగా.. 3.18 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 1.91 లక్షల టన్నులు కొనాలని నిర్ణయించారు. లక్ష్యాన్ని ఎప్పుడో చేరుకోగా.. ఇంకా కల్లాల్లో, రైతుల వద్ద 53 వేల టన్నుల ధాన్యం ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇందులో 20 వేల టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 15 వేల టన్నులు తీసుకున్నారు. ప్రభుత్వ అనుమతి మేరకు మరో 5 వేల టన్నులు సేకరించినా.. మిగతా 33 వేల టన్నుల పరిస్థితి ఏమిటో ఎవరూ చెప్పడం లేదు.
సర్వం బుగ్గి
పొలాల్లో ఉన్న పంటను ఎలుకలు, పందులు నాశనం చేస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల బలిజిపేట, వంగర, గరివిడి మండలాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో ధాన్యం కాలిపోయింది. అధికారులు కొనుగోలు చేసి ఉంటే పంట కాలి బూడిదయ్యేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు.
సీఎం, గవర్నర్కు వినతులు
పండించిన ధాన్యం కొనకపోవడంతో నెలరోజులుగా కల్లాల్లో ఉంచి కాపలా కాస్తున్నామని, ఆర్బీకేలకు వెళ్తే కొనుగోలుకు మాకెలాంటి ఆదేశాలు లేవని చేతులెత్తేస్తున్నారని బొబ్బిలి మండలం మల్లంపేట రైతులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్లకు వినతిపత్రాలను పోస్టులో పంపారు. ఒక్కో రైతు వద్ద సుమారు 150 నుంచి 200 వరకు బస్తాలు ఉండిపోయాయని వాపోయారు.
* గజపతినగరం మండలంలో 4800 టన్నులు, బొండపల్లిలో 4700, దత్తిరాజేరు 5700, మెంటాడలో 3500, గరివిడిలో 1200 , వెదుళ్లవలసలో 380, చీపురుపల్లిలో 400 టన్నులు ఉండిపోయింది.
పెట్రోల్తో బైఠాయింపు
భోగాపురం తహసీల్దారు కార్యాలయం ఎదుట అన్నదాతలు పెట్రోల్ చేతబట్టి నిరసన తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడతామంటూ అక్కడే బైఠాయించారు. విషయం తెలుసుకున్న సీఎస్ డీటీ మురళి చేరుకుని ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్తానని సర్దిచెప్పినా కొనే వరకూ ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించి వెనుదిరిగారు.
ధర్నా చేస్తున్న కె.ఎ.నాయుడు, నాయకులు, కార్యకర్తలు
రైతులు పండించిన ప్రతి గింజ కొనాల్సిందేనని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి కె.ఎ.నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ధాన్యం బస్తాలను నెత్తిన ఎత్తుకొని జాతీయ రహదారి మీదుగా ర్యాలీ నిర్వహించి తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం ఉప తహసీల్దారు సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. కె.ఎ.నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో 12 వేల టన్నుల ధాన్యం పొలాలు, కల్లాల్లో ఉందన్నారు. మొత్తం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. నాయకులు లక్ష్మునాయుడు, కృష్ణ, మోహనరావు, బాలాజీ, శ్రీదేవి, విజయకుమార్ పాల్గొన్నారు.
వీరంతా గరివిడి మండలం వెదుళ్లవలస రైతులు. సంక్రాంతి నుంచి ధాన్యం కొనుగోలు ఆపేయడంతో కల్లాల్లోనే ఉంచిన బస్తాల వద్ద రేయింబవళ్లు కాపలా కాయాల్సి వస్తోందని సోమవారం విజయనగరం కలెక్టరేట్లో జరిగిన స్పందనలో కలెక్టర్ ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. అధికారులను అడిగితే తమ లక్ష్యం అయిపోయిందని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో 180 బస్తాలు జనవరి నాలుగు నుంచి కల్లంలోనే ఉన్నాయి. ఆర్బీకే చుట్టూ తిరుగుతున్నా తీసుకోవడం లేదు. పంటను ఏం చేసుకోవాలో తెలియడం లేదు. అప్పు చేసి రూ.60 వేల వరకు పెట్టుబడులు పెట్టాను. వడ్డీ భారం పెరుగుతోంది. అధికారులు త్వరలో కొనుగోళ్లు చేపట్టి రైతులకు న్యాయం చేయాలి.
బలగ సూర్యారావు, మల్లంపేట, బొబ్బిలి
నాకున్న రెండెకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పండించాను. గ్రామంలో పందుల బెడద ఉండటంతో పొలంలోనే పంటంతా ఉంచాను. నా పొలానికి దూరంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా ఆ మంటలు వ్యాపించి 43 బస్తాలు కాలిపోయాయి. మిగిలిన 110 బస్తాలు ఇంటికి తీసుకొచ్చి ఆర్బీకేలో అధికారులకు చెప్పినా కొనుగోలు చేయడం లేదు.
గుడివాడ అప్పలనాయుడు, కొప్పరవలస, వంగర మండలం, విజయనగరం
సర్దుబాటు చేస్తున్నాం ... రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా లక్ష్యం మిగిలితే ఇతర మండలాలకు సర్దుబాటు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నుంచి మరోసారి అనుమతులు రానున్నాయి.
మీనాకుమారి, డీఎం, పౌర సరఫరాల సంస్థ, విజయనగరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన ఇంతే.. మీ దారి మీరే చూసుకోండి
[ 25-04-2024]
మన్యంలోని కొండలపై ఉన్న గ్రామాలకు వస్తే వీరు ఎంత అభివృద్ధి చేశారో తెలుస్తుంది. అందుకేనేమో వీరు అక్కడికి వెళ్లరు.. ఒక వేళ వెళ్దామా అంటే రోడ్డు ఉంటే కదా.. అంత దారుణంగా ఉంది ఈ ప్రభుత్వ పాలన. -
బడ్డుకొండ.. నెల్లిమర్ల అనకొండ
[ 25-04-2024]
జగన్ చరిత్ర అయిపోయిందని, ఒక్క అవకాశమన్న వాడికి.. అదే ఆఖరైందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం కోట సాక్షిగా ఈ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చేస్తారని పేర్కొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో కూటమి విజయం ఖాయమన్నారు. -
జగన్ పాపం.. రైతులకు శాపం
[ 25-04-2024]
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, -
జగన్ బస్సులనూ వదల్లే
[ 25-04-2024]
గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధం సభలకు బస్సులన్నీ వెళ్లిపోవడంతో చాలామంది తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకున్నారు. -
నామినేషన్ల జోరు
[ 25-04-2024]
జిల్లాలో బుధవారం పెద్దసంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తరఫున అతని సతీమణి కలిశెట్టి రామలక్ష్మి రెండు సెట్లు వేశారు. -
వేదపండితుల ఆశీర్వాదంతో ముందుకు..
[ 25-04-2024]
కూటమి తరఫున విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థినిగా (తెదేపా) పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నగరంలోని తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ కె.కార్తీక్కు నామపత్రాలు అందించారు. -
లలితకుమారి నామపత్రం దాఖలు
[ 25-04-2024]
శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కోళ్ల లలితకుమారి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం ఎల్.కోటకు నాయకులు, కార్యకర్తలు తరలిరాగా ర్యాలీగా ఎస్.కోటకు చేరుకున్నారు. -
మండుటెండలో సమరోత్సాహం
[ 25-04-2024]
పసుపు, తెలుపు, కాషాయం జెండాల రెపరెపలు.. కేరింతలు, నృత్యాలతో సందడి చేసిన కూటమి శ్రేణులు.. చీపురుపల్లి వీధుల నిండా జనం.. -
అట్టహాసంగా జయకృష్ణ నామినేషన్
[ 25-04-2024]
పాలకొండ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అట్టహాసంగా బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా పాలకొండలోని కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సీతంపేటకు బయలు దేరారు. -
తీరంపై ఎందుకింత నిర్లక్ష్యం
[ 25-04-2024]
సముద్రంలో వేటాడిన మత్స్యసంపదను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించుకొనేందుకు వీలుగా తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సామాజిక కేంద్రాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయి. -
లబ్ధిదారులను మభ్యపెడుతున్న వాలంటీర్లు
[ 25-04-2024]
రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలోని రంగరాయపురానికి చెందిన వాలంటీర్లలో ఒకరు తప్ప మిగిలిన వారు రాజీనామా చేశారు. -
వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
[ 25-04-2024]
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!