ప్రారంభానికి ఎదురుచూపులు
జిల్లా ఆసుపత్రిలో పడకల ఇబ్బంది వేధిస్తోంది. రెండేళ్ల క్రితం వంద పడకల ఆసుపత్రిని 150కి పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రోగుల తాకిడి పెరిగింది.
పార్వతీపురం పట్టణం, న్యూస్టుడే: జిల్లా ఆసుపత్రిలో పడకల ఇబ్బంది వేధిస్తోంది. రెండేళ్ల క్రితం వంద పడకల ఆసుపత్రిని 150కి పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో రోగుల తాకిడి పెరిగింది. దీంతో కొత్తగా వైద్యులను నియమించి పరికరాలను తీసుకొచ్చారు. ఇది బాగున్నా పడకలు చాలక రోగులు అవస్థలు పడుతున్నారు. కొన్నిసార్లు 300 మందికి పైగా రోగులు వస్తుండటంతో ఒక్కో మంచంపై ఇద్దరు ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. దీనికి తోడు నెలకు 300కు పైనే ప్రసవాలు జరుగుతుండటంతో బాలింతలు వారమైనా ఆసుపత్రిలో ఉంటున్నారు. ప్రసవానికి వచ్చిన వారు కొన్నిసార్లు వేచి ఉండాల్సిన పరిస్థితి. దీంతో గదులు సరిపోవడం లేదు. ప్రస్తుతం రూ.21 కోట్ల నాబార్డు నిధులతో ప్రత్యేక ప్రసూతి విభాగం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. అది పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టనున్న నేపథ్యంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న బర్త్ వెయిటింగ్ హాలు, బాలల సత్వర చికిత్స కేంద్రాలను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. వీటిని పరిశీలించి త్వరలో ప్రారంభించనున్నట్లు ఏపీఎంఐఎస్డీసీ ఈఈ సత్యప్రభాకర్ తెలిపారు.
ఇది జిల్లా ఆసుపత్రి లోపల ఏర్పాటు చేసిన బర్త్ వెయిటింగ్ హాల్. 2020 డిసెంబరులో కేంద్రం విడుదల చేసిన రూ.30 లక్షలతో దీని నిర్మాణం ప్రారంభించారు. కొన్ని నెలల కిందటే భవనం సిద్ధమైనా సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. వీటిని అధికారులు సరిచేయించినా అందుబాటులోకి తీసుకురాలేదు.
రంగులతో సిద్ధంగా ఉన్న జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం భవనాన్ని రూ.1.06 కోట్లతో నిర్మించారు. గ్రహణమొర్రితో పాటు చిన్నారులకు వచ్చే రుగ్మతులకు వైద్య సేవలు ఇక్కడ అందించాల్సి ఉంది. ఈ భవనం పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రారంభించడం లేదు. దీనికి తోడు సంబంధిత వైద్యాధికారి, సిబ్బంది నియామకాలు జరగలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి విజయంతోనే భవిష్యత్తు
[ 19-04-2024]
మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కోరారు. -
బడాయి మావయ్యా.. బువ్వ.. గుడ్డు ఏదయ్యా
[ 19-04-2024]
మీకు అన్నను.. మీ పిల్లలకు మావయ్యను అని చెప్పుకొని తిరిగే సీఎం జగన్మోహన్రెడ్డి ఆ మాటలను నిజం చేసుకోలేకపోయారు. ఈ ఐదేళ్లూ పిల్లలకు నాసిరకం భోజనాలే అందించారు. -
భేష్.. ముహూర్త బలం
[ 19-04-2024]
శుక్రవారం.. ఏకాదశి.. మంచి ముహూర్తం, యోగ బలం బాగుంది.. పండితులు చెప్పిన మాట.. -
తొలిరోజు 12 నామినేషన్లు
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. చీపురుపల్లి, రాజాం, గజపతినగరం నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. తొలిరోజు అసెంబ్లీ స్థానాలకు 10, విజయనగరం ఎంపీ స్థానానికి ఇద్దరు అందించారు. -
బడ్డుకొండ సంపద రూ.11.25 కోట్లేనట!!
[ 19-04-2024]
నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడి (52) సంపద అయిదేళ్లలో రూ.3 కోట్లే పెరిగిందట. ఇది విన్న నియోజకవర్గ ప్రజలు అబ్బే అంత తక్కువ ఉండటం ఏమిటని అనుకోవడం వినిపించింది. -
మాయల పకీరు జగన్ అవసరమా?: కళా
[ 19-04-2024]
మాయల పకీరు ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజలంతా ఆలోచించాలని కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. మెరకముడిదాం మండలం గర్భాం మేజరు పంచాయతీలో గురువారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. -
బోసినవ్వుల చిన్నారిని.. వైకాపా రథం చిదిమేసింది
[ 19-04-2024]
‘అమ్మా..వెంటనే వచ్చేస్తాను’ అంటూ బయటకు వెళ్లిన ఆ చిన్నారి తీరని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్లెదుటే అంత వరకూ హుషారుగా ఇంట్లో తిరిగిన ఆ బాలుడు నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయాడు. -
ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలేవీ?
[ 19-04-2024]
శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. -
జగన్ దగాతో రైతు బేజారు!
[ 19-04-2024]
గత ప్రభుత్వం రూ.36లక్షల నిధులతో సాలూరులోని దండిగాం రోడ్డులో రైతు బజారు నిర్మించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతకుముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక్క దుకాణం కూడా ఏర్పాటు చేయలేదు. -
శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం
[ 19-04-2024]
శుభకార్యానికి వెళ్లేందుకు అందరూ సరదాగా బయలుదేరారు. ప్రత్యేకంగా సమకూర్చుకున్న వాహనంలో కబుర్లు చెప్పుకొంటూ వెళ్తున్నారు. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొనడంతో ముందు భాగం ఛిద్రమైంది. -
జంఝాటం
[ 19-04-2024]
తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైకాపా ఏనాడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం అన్నదాత వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి రాక ముందు అనేక హామీలను నీటిమూటల్లో నింపేసిన సీఎం జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మేమింతే అన్నట్లు వాటన్నింటినీ అటకెక్కించేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు