సీఎం దృష్టికి ఏనుగుల సమస్య
మన్యంలో సంచరిస్తున్న ఏనుగులతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వి.కళావతి సీఎం జగన్మోహన్రెడ్డిని కోరారు.
జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యే కళావతి
సీతంపేట, భామిని, న్యూస్టుడే: మన్యంలో సంచరిస్తున్న ఏనుగులతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వి.కళావతి సీఎం జగన్మోహన్రెడ్డిని కోరారు. ఈమేరకు గురువారం ఆయనకు వినతిపత్రం అందించారు. గజరాజుల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని విన్నవించారు. జీవో నం.57ను సవరించాలని, భామిని మండలం చిన్నదిమిలి వద్ద వంశధార పిల్ల కాలువను మంజూరు చేయాలని, వీరఘట్టం, భామిని, బాలేరు, బత్తిలి పీహెచ్సీలను 50 పడకల సామాజిక ఆసుపత్రులుగా అప్గ్రేడ్ చేయాలన్నారు. మరికొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే ‘న్యూస్టుడే’కు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
North Korea: కిమ్కు ఎదురుదెబ్బ.. విఫలమైన నిఘా ఉపగ్రహ ప్రయోగం..!
-
General News
Tirupati: తిరుపతి జూలో పెద్దపులి పిల్ల మృతి
-
General News
Road Accident: పుష్ప-2 షూటింగ్ నుంచి వస్తుండగా ప్రమాదం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్, పైలట్ మధ్య సయోధ్యపై సందేహాలు
-
Crime News
దారుణం.. భార్యపై అనుమానంతో శిశువుకు పురుగుల మందు ఎక్కించాడు!