విద్యార్థులు చదువు, ఇతర రంగాల్లో రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ రాణించాలని జేెఎన్టీయూ ప్రిన్సిపల్ కె.శ్రీకుమార్ ఆకాంక్షించారు.
పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు
విజయనగరం విద్యావిభాగం, పట్టణం, న్యూస్టుడే: విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ రాణించాలని జేెఎన్టీయూ ప్రిన్సిపల్ కె.శ్రీకుమార్ ఆకాంక్షించారు. ఇందుకోసం ‘ఈనాడు’ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని, దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజయనగరంలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల స్థాయి ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 8, 9, 10 తరగతుల విద్యార్థులు వ్యాసరచన, స్టోరీ టెల్లింగ్, చిత్రలేఖనం, క్విజ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ మాట్లాడుతూ క్రికెట్లో ఏ విధంగా ఆల్రౌండర్కు గుర్తింపు ఉంటుందో అదే మాదిరిగా విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. ఇటువంటి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు గెలుపోటములు ముఖ్యం కాదని భావించాలని, పోటీలో నిలవడమే గొప్ప విషయమన్నారు. ఓటమి పాలైతే అందుకు గల లోపాలు తెలుసుకొని తదుపరి పోటీల్లో పాల్గొన్నప్పుడు వాటిని సరిచేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ‘ఈనాడు’ తరఫున బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ‘ఈనాడు’ శ్రీకాకుళం యూనిట్ ఇన్ఛార్జి షేక్ కాలేషావలి, న్యాయనిర్ణేతలుగా విశ్రాంత సహాయక ప్రొఫెసర్ జక్కు రామకృష్ణ, టీవీ, సినీ ఆర్టిస్ట్ కె.నారాయణమూర్తి, సహాయక ప్రొఫెసర్ పీఎన్బీఆర్ఎస్ఎస్ శర్మ, సహాయక ప్రొఫెసర్ ఆర్.చిట్టిబాబు వ్యవహరించారు.
జిల్లా స్థాయిలో విజేతలు వీరే...
* డ్రాయింగ్: బి.యామిని సుష్మామృత (గీతాంజలి హైస్కూల్, విజయనగరం), ఎస్.హిమబిందు (శ్రీ ఆదిత్య ఇంగ్లీషు మీడియం హైస్కూల్, విజయనగరం), ఎ.నక్షత్ర (అభ్యుదయ హైస్కూల్, బొబ్బిలి)
* క్విజ్: కె.భరత్చంద్ర (నారాయణ ఇంగ్లీషు మీడియం ఈ టెక్నో పాఠశాల, విజయనగరం), జె.ఫణీంద్ర (గీతాంజలి హైస్కూలు, విజయనగరం), సీహెచ్ లోకేశ్ (ఎస్ఎస్ ఇంగ్లీషు మీడియం పాఠశాల, బొబ్బిలి)
* స్టోరీ టెల్లింగ్: వి.దీక్షిత్ (భాష్యం హైస్కూల్, విజయనగరం), జీవీ సాయిలాస్య (శ్రీ చలపతి హైస్కూల్, విజయనగరం), డి.దినేష్కుమార్ (లయన్స్ స్కూలు, పార్వతీపురం)
* వ్యాసరచన: ఎన్.జాస్మిన్ (ఫోర్టుసిటీ స్కూలు, విజయనగరం), సీహెచ్ నిత్య (అభ్యుదయ హైస్కూల్, బొబ్బిలి), ఎస్.ఉష అశ్రిత (ఫోర్టుసిటీ స్కూలు, విజయనగరం)
నాలుగు నెలలు.. 7,356 మంది విద్యార్థులు
విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు వారిలోని నైపుణ్యాలను పెంపొందించేందుకు గతేడాది అక్టోబరు, నవంబరు, డిసెంబరు, ఈ ఏడాది జనవరి నెలల్లో పాఠశాల, ప్రాంతీయ, జిల్లాస్థాయిల్లో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. విజయనగరం, రాజాం, పార్వతీపురం, బొబ్బిలి కేంద్రాల్లో 19 పాఠశాలలకు సంబంధించి జరిగిన పోటీల్లో మొత్తం 7,356 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో సత్తా చాటిన 228 మంది ప్రాంతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇందులోనూ ప్రతిభ చూపిన 36 మంది జిల్లాస్థాయి పోటీలకు హాజరు కాగా వారిలో 12 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి విజయంతోనే భవిష్యత్తు
[ 19-04-2024]
మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కోరారు. -
బడాయి మావయ్యా.. బువ్వ.. గుడ్డు ఏదయ్యా
[ 19-04-2024]
మీకు అన్నను.. మీ పిల్లలకు మావయ్యను అని చెప్పుకొని తిరిగే సీఎం జగన్మోహన్రెడ్డి ఆ మాటలను నిజం చేసుకోలేకపోయారు. ఈ ఐదేళ్లూ పిల్లలకు నాసిరకం భోజనాలే అందించారు. -
భేష్.. ముహూర్త బలం
[ 19-04-2024]
శుక్రవారం.. ఏకాదశి.. మంచి ముహూర్తం, యోగ బలం బాగుంది.. పండితులు చెప్పిన మాట.. -
తొలిరోజు 12 నామినేషన్లు
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. చీపురుపల్లి, రాజాం, గజపతినగరం నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. తొలిరోజు అసెంబ్లీ స్థానాలకు 10, విజయనగరం ఎంపీ స్థానానికి ఇద్దరు అందించారు. -
బడ్డుకొండ సంపద రూ.11.25 కోట్లేనట!!
[ 19-04-2024]
నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడి (52) సంపద అయిదేళ్లలో రూ.3 కోట్లే పెరిగిందట. ఇది విన్న నియోజకవర్గ ప్రజలు అబ్బే అంత తక్కువ ఉండటం ఏమిటని అనుకోవడం వినిపించింది. -
మాయల పకీరు జగన్ అవసరమా?: కళా
[ 19-04-2024]
మాయల పకీరు ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజలంతా ఆలోచించాలని కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. మెరకముడిదాం మండలం గర్భాం మేజరు పంచాయతీలో గురువారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. -
బోసినవ్వుల చిన్నారిని.. వైకాపా రథం చిదిమేసింది
[ 19-04-2024]
‘అమ్మా..వెంటనే వచ్చేస్తాను’ అంటూ బయటకు వెళ్లిన ఆ చిన్నారి తీరని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్లెదుటే అంత వరకూ హుషారుగా ఇంట్లో తిరిగిన ఆ బాలుడు నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయాడు. -
ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలేవీ?
[ 19-04-2024]
శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. -
జగన్ దగాతో రైతు బేజారు!
[ 19-04-2024]
గత ప్రభుత్వం రూ.36లక్షల నిధులతో సాలూరులోని దండిగాం రోడ్డులో రైతు బజారు నిర్మించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతకుముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక్క దుకాణం కూడా ఏర్పాటు చేయలేదు. -
శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం
[ 19-04-2024]
శుభకార్యానికి వెళ్లేందుకు అందరూ సరదాగా బయలుదేరారు. ప్రత్యేకంగా సమకూర్చుకున్న వాహనంలో కబుర్లు చెప్పుకొంటూ వెళ్తున్నారు. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొనడంతో ముందు భాగం ఛిద్రమైంది. -
జంఝాటం
[ 19-04-2024]
తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైకాపా ఏనాడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం అన్నదాత వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి రాక ముందు అనేక హామీలను నీటిమూటల్లో నింపేసిన సీఎం జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మేమింతే అన్నట్లు వాటన్నింటినీ అటకెక్కించేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!