logo

మహిళపై వీధి కుక్కల దాడి

రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన టి.ఈశ్వరమ్మపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.

Updated : 24 Mar 2023 03:22 IST

బాధితురాలిని వాహనంలో తరలిస్తున్న కుటుంబ సభ్యులు

రాజాం గ్రామీణం, న్యూస్‌టుడే: రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన టి.ఈశ్వరమ్మపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం పొలం పనులు చేసుకొని ఇంటికి వస్తుండగా దారిలో ఉన్న శునకాల గుంపు మూకుమ్మడిగా దాడి చేసింది. దీంతో ఆమె కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు స్పందించి, వెంటనే రాజాం సీహెచ్‌సీకి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని