రైతుల ఆలోచనలు మారితే ఆర్థికవృద్ధి
ఆధునిక పద్ధతులను అవలంబించి వ్యవసాయం చేస్తే లాభదాయక ఫలితాలు ఉంటాయని గుంటూరు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ విజయాభినందన పేర్కొన్నారు.
నూతన వంగడాల పుస్తకాలు ఆవిష్కరిస్తున్న డీఈ, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు
గుమ్మలక్ష్మీపురం, కురుపాం గ్రామీణం, న్యూస్టుడే: ఆధునిక పద్ధతులను అవలంబించి వ్యవసాయం చేస్తే లాభదాయక ఫలితాలు ఉంటాయని గుంటూరు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ విజయాభినందన పేర్కొన్నారు. రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం కిసాన్మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల తర్వాత కేవీకేలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. వ్యవసాయంలో రైతుల ఆలోచనలు మారితేనే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందన్నారు. నూతన వంగడాలు, వ్యవసాయ పరికరాలు, విస్తరణ కేంద్రాల గురించి వివరించారు. ఎంపీపీ పద్మావతి మాట్లాడుతూ కేవీకేని పర్యాటకంగా తీర్చిదిద్దడం సంతోషమన్నారు. అనంతరం గిరిజన నృత్యకారులు ప్రదర్శనలిచ్చి ఆకట్టుకున్నారు. చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం సహ సంచాలకుడు సురేష్కుమార్, ప్రిన్సిపల్ శాస్త్రవేత్త ముకుందరావు, కేవీకే ప్రోగ్రాం సమన్వయకర్త డాక్టర్ పాత్ర్, రాగోలు వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త సత్యనారాయణ, సర్పంచి సునీత, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు సుజాత, టి.సునీత, ఉమ్మడి జిల్లాల రైతులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సచివాలయం ఉద్యోగులు అందుబాటులో ఉండాలి
[ 28-03-2024]
బలిజిపేట మండలంలోని వంతరాం గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని గ్రామప్రజలు అధికారులను అభ్యర్థించారు. -
మూలకు చేరిన మూడు చక్రాల ఆటోలు
[ 28-03-2024]
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ కింద మంజూరు చేసిన మూడు చక్రాల ఆటోలు కొన్ని చోట్ల మూలకు చేరాయి. -
లుంబూరు కాలనీలో సౌకర్యాలేవన్నా!
[ 28-03-2024]
ప్రభుత్వం ఆర్భాటంగా ఇళ్లు కాదు... ఊళ్లే నిర్మించేస్తామంటూ అట్టహాసంగా జగనన్న కాలనీలను మంజూరు చేసి నాలుగేళ్లవుతున్నా నేటికీ కనీస సదుపాయాలు కల్పించలేదు. స్థలాలిచ్చాం... మీరే కట్టుకోండంటూ లబ్ధిదారులను గాలికొదిలేసింది. -
అసంపూర్తి పనులు.. తప్పని అవస్థలు
[ 28-03-2024]
సీతానగరం మండల కేంద్రం నుంచి పలు గ్రామాలను అనుసంధానించేందుకు నిర్మించిన రహదారుల అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగలడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. పదేళ్లుగా అధ్వానంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి ఈ ఏడాది నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. -
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
[ 28-03-2024]
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వసతులు
[ 28-03-2024]
పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ కేంద్రాల వద్ద అన్ని వసతులు పక్కాగా ఉండాలని కలెక్టరు నిశాంత్కుమార్ ఆదేశించారు. -
జలకలే
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో 2020-21లో జలకళ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారు పది వేల దరఖాస్తులు వచ్చాయి. నాలుగేళ్లలో 373 బోర్లకు రూ.5.55 కోట్లతో పరిపాలనా అమోదం ఇచ్చారు. -
జనం జీవితాల్లో బూడిద
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలోని వేపాడ, ఎస్.కోట, ఎల్.కోట, బొండపల్లి, గురుగుబిల్లి, పాచిపెంట, పాలకొండ మండలాల్లో కొండలను పిండి చేస్తున్నారు. అనుమతులు కన్నా అదనపు విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి జేబులు నింపుకొంటున్నారు. -
బిల్లులు రాక.. నిర్మాణాలు సాగక
[ 28-03-2024]
-
ఔత్సాహికం.. అల్లంతదూరం
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలనే మాట వినిపించడం లేదు. వారికి అందించాల్సిన శిక్షణ తరగతులు, అవగాహన సదస్సులు దూరమయ్యాయి. దీంతో నిరుద్యోగ సమస్య రానురానూ తీవ్రమవుతోంది. -
ఆపద్బాంధవులకూ కష్టాలే!!
[ 28-03-2024]
అగ్ని ప్రమాదం సంభవిస్తే ఠక్కున గుర్తొచ్చేది అగ్నిమాపక దళమే. భారీ యంత్రాలు, బరువైన పరికరాలతో ఎంత పెద్ద భవనాలనైనా ఎక్కి మంటలను అదుపు చేసేందుకు మృత్యువుతో పోరాడుతారు. మరి ఆ విభాగానికే కష్టమొస్తే.. అలాంటి పరిస్థితే జిల్లాలో నెలకొంది. -
వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా చేరికలు
[ 28-03-2024]
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి రాజాం నియోజకవర్గ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. -
అనుమానంతోనే భార్యను చంపేశాడు
[ 28-03-2024]
ఆమె వృద్ధురాలు.. వయసు 60 ఏళ్లు.. కానీ తాగిన మైకంలో భర్త అనుమానించేవాడు. నిరంతరం వేధించేవాడు. చివరకు హత్య చేసి, దారుణానికి ఒడిగట్టాడు. జియ్యమ్మవలస మండలంలోని సింగనాపురంలో ఇటీవల జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. -
ఇంటర్ మూల్యాంకనం 50 శాతం పూర్తి
[ 28-03-2024]
కొత్తగా ఏర్పడిన జిల్లాలో తొలిసారిగా ఇంటర్మీడియట్ మూల్యాంకనం నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 50 శాతం దాటి జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి చేసినట్లు క్యాంపు అధికారి ఎస్.తవిటినాయుడు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి