logo

జీవితంపై విరక్తితో రోగి ఆత్మహత్య

  దీర్ఘకాలిక వ్యాధి బారిన పడడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మండలంలో జరిగింది.

Updated : 26 Mar 2023 06:36 IST

వేపాడ, న్యూస్‌టుడే:  దీర్ఘకాలిక వ్యాధి బారిన పడడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మండలంలో జరిగింది. ఎస్సై రాజేశ్‌ వివరాల మేరకు బొద్దాం గ్రామానికి చెందిన జె.ఈశ్వరరావు(38) కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో వైద్యులు అతని నాలుక తొలగించారు. ఇటీవల వ్యాధి లక్షణాలు కనిపించడంతో కేజీహెచ్‌కు వెళ్లాడు. మళ్లీ శస్త్ర చికిత్స చేయాలని చెప్పడంతో ఇంటికి వచ్చేశాడు. శుక్రవారం రాత్రి పురుగు మందు తాగి, ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఎస్‌.కోట ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని