logo

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి దుర్మరణం

మండలంలోని కొత్త ముంగినాపల్లి కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బొబ్బాది సూరమ్మ(61) దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం..

Published : 26 Mar 2023 06:01 IST

డెంకాడ, న్యూస్‌టుడే: మండలంలోని కొత్త ముంగినాపల్లి కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బొబ్బాది సూరమ్మ(61) దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్త ముంగినాపల్లి గ్రామానికి చెందిన ఈమె భర్త పైడయ్యతో కలిసి శనివారం గునుపూరుపేట వైపు నడిచి వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని