అభివృద్ధి జరిగితే అద్భుతమే..
సాలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలకు మహర్దశ వచ్చింది. గత ప్రభుత్వం రూసా నిధుల కింద రూ.4 కోట్లు మంజూరు చేయగా, రూ.1.60 కోట్లతో నూతన భవనం నిర్మించారు.
డిగ్రీ, పీజీ కళాశాలకు రూ.కోట్ల నిధులు
రూసా నిధులతో నిర్మించిన కళాశాల నూతన భవనం
సాలూరు, న్యూస్టుడే: సాలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలకు మహర్దశ వచ్చింది. గత ప్రభుత్వం రూసా నిధుల కింద రూ.4 కోట్లు మంజూరు చేయగా, రూ.1.60 కోట్లతో నూతన భవనం నిర్మించారు. పాత భవనాలకు రూ.1.20 కోట్లతో మరమ్మతులు చేశారు. కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదుల్లో సామగ్రి కోసం రూ.1.20 కోట్లను వెచ్చించారు. ఈక్రమంలోనే గతేడాది ఉమ్మడి జిల్లాలో ఎక్సలెన్స్ సెంటర్గా ఎంపికైంది. అనంతరం విద్యార్థినుల కోసం వసతి గృహం నిర్మించేందుకు రూ.3.60 కోట్ల నిధులొచ్చాయి. అలాగే ఎన్ఐఆర్ఎఫ్ కింద ఇప్పటికే రూ.70 లక్షలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆయా పనులు సాగుతున్నాయి. డిజిటల్ లైబ్రరీకి రూ.55 లక్షలు, ఇతర సామగ్రి కొనుగోలుకు మరో రూ.25 లక్షలు కూడా వచ్చాయి.
ఇండోర్ స్టేడియంకు ప్రతిపాదనలు..
ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాల ఆవరణలో బహుళ ప్రయోజనాల ఇండోర్ స్టేడియం నిర్మించాలని రూ.8 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు, 12.5 మీటర్ల ఎత్తయిన స్టేడియం నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసి పంపించినట్లు ప్రిన్సిపల్ టి.రాధాకృష్ణ తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ 780 మంది వరకు చదువుతున్నారు. వీరితో పాటు స్కిల్ హబ్లో 60 మంది శిక్షణ పొందుతున్నారు. వీరందరికీ స్టేడియం ఎంతగానో ఉపయోగపడనుంది. రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులు కూడా ఇక్కడున్నారు.
స్కిల్హబ్లో చేరిన విద్యార్థులకు సూచనలు చేస్తున్న ప్రిన్సిపల్
వడివడిగా వసతిగృహ పనులు..
కళాశాలకు మంజూరైన వసతిగృహ భవనం పనులను అధికారులు వేగవంతం చేశారు. సకాలంలో పూర్తిచేయాలని ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర ఆదేశించడం, నిధులు కూడా విడుదల కావడంతో పనులు త్వరితగతిన చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే దూర ప్రాంతాల నుంచి కళాశాలలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరినవారికి వసతి సౌకర్యం లభిస్తుంది. మరోవైపు డిజిటల్ లైబ్రరీ, అత్యాధునిక పరికరాలతో బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ల్యాబ్లు కూడా అభివృద్ధి చేస్తున్నారు.
అదనపు సౌకర్యాలు..
- టి.రాధాకృష్ణ, జిల్లా డిగ్రీ, పీజీ కళాశాలల ఐడీ ప్రిన్సిపల్, సాలూరు
కళాశాల అభివృద్ధితో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపట్టాం. రూసా నిధులతో భవనాలను అభివృద్ధి చేస్తున్నాం. ఎక్స్లెన్స్ సెంటర్ కావడంతో ఎన్ఐఆర్ఎఫ్ నిధులతో మరోవైపు వసతి గృహం నిర్మిస్తున్నాం. ఖేలో ఇండియా పథకంలో భాగంగా ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రూ.8 కోట్లతో ప్రతిపాదనలు చేసి కలెక్టర్కు పంపించాం. ఇవి మంజూరైన కళాశాల రూపురేఖలు మారుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొమ్మాలమ్మ తల్లి ఆలయ ప్రతిష్ఠ
[ 23-04-2024]
మండలంలోని తుమరాడ గ్రామంలో పడాల వంశీయులు నూతనంగా నిర్మించిన బొమ్మాలమ్మతల్లి ఆలయ ప్రతిష్ఠ ఉత్సవం మంగళవారం ప్రారంభించారు. -
నేను ఉన్నానన్నావ్.. విన్నానన్నావ్.. ఐదేళ్లుగా ఏం చేశావ్!
[ 23-04-2024]
‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో నమ్మించారు జగన్. ఆ మాటలు ఉమ్మడి జిల్లా ప్రజలు నిజమే అనుకున్నారు. ఇక తమ కష్టాలు తీరినట్లేనని ఓట్లు వేసి గద్దెనెక్కించారు. -
ఎంపీ అభ్యర్థినిగా కొత్తపల్లి గీత నామినేషన్
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు పార్లమెంటరీ స్థానానికి ఐదు, కురుపాం శాసనసభకు రెండు, పార్వతీపురం, పాలకొండ శాసనసభలకు ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. -
వేదనలోనూ విజయం
[ 23-04-2024]
పరీక్ష రోజే తండ్రి మృతి చెందినా ఆయన ఆశయాన్ని కుమారుడు నిలబెట్టాడు. సరిగ్గా నెల రోజుల క్రితం మార్చి 22న పదో తరగతి గణితం పరీక్ష జరిగింది. ఆ రోజు ఉదయాన్నే లేచి హడావుడిగా సిద్ధమవుతున్న ఆ విద్యార్థికి తన తండ్రి మృతి చెందిన వార్త తెలిసి తల్లడిల్లిపోయాడు. -
ఎస్.కోటను అభివృద్ధి చేస్తా
[ 23-04-2024]
ప్రశాంతమైన విశాఖ నగరానికి తాము ఐటీ కంపెనీలు తీసుకొస్తే జగన్ భూ బకాసురులను దించి కబ్జాలతో కబళించాడని, రాక్షస మూకలను దించి అశాంతి నగరంగా మార్చేశాడని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. -
పదిలో అయిదో స్థానం
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా అయిదో స్థానంలో నిలిచింది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. -
వైకాపా పతనం తప్పదు: కళా
[ 23-04-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాకు పతనం తప్పదని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి, కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు తెలిపారు. -
పార్లమెంటుకు 05 .. అసెంబ్లీకి 24
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి 05, అసెంబ్లీ స్థానాలకు 24 వచ్చాయి. ఎంపీ స్థానానికి వైకాపా అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ రెండు సెట్ల నామపత్రాలు అందజేశారు. -
కోటలో జనసంద్రం
[ 23-04-2024]
శృంగవరపుకోటలో చంద్రబాబు పాల్గొన్న ప్రజాగళం సభకు ఉమ్మడి జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. జగ్గంపేట సభ అనంతరం వచ్చిన చంద్రబాబుకు హెలీప్యాడ్ వద్ద అభ్యర్థులు శ్రీభరత్, కోళ్ల లలితకుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ, కార్యదర్శి ఐ.సుధారాజు, జనసేన నియోజకవర్గ కన్వీనర్ వబ్బిన సత్యనారాయణ, భాజపా నియోజకవర్గ కన్వీనర్ జగదీశ్వరి స్వాగతం పలికారు. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలు
[ 23-04-2024]
అరకు పార్లమెంటరీ.. -
నాలుగు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
[ 23-04-2024]
కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడు అసెంబ్లీ, విజయనగరం పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. నెల్లిమర్ల నియోజకవర్గం అభ్యర్థిగా సరగడ రమేష్కుమార్ (పార్టీ జిల్లా అధ్యక్షుడు), గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థిగా విజయనగరానికి చెందిన డోల శ్రీనివాసరావు (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ఉన్నారు. -
ప్రకటనల మోత.. ఏదీ రైలుబస్సు కూత
[ 23-04-2024]
మారుమూల ప్రాంతంలో సౌకర్యంగా ఉన్న రైలుబస్సు సేవలకు గ్రహణం పట్టింది. ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే సాలూరు రైల్వే స్టేషన్లో రైలు కూత వినిపించకుండా పోయింది. -
ట్రాఫిక్ నియంత్రణ కత్తిమీద సామే
[ 23-04-2024]
నగరం సమీపంలోని చెల్లూరు కూడలిలో మంగళవారం జరిగే సిద్ధం సభ నిర్వహణపై పోలీసులు, అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విజయనగరం, మన్యం, విశాఖ జిల్లాలకు అతిప్రధానమైన రెండు జాతీయ రహదారులకు ఆనుకుని వేదిక ఏర్పాటు చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
జగన్ చెప్పారంటే.. చేయరంతే!
[ 23-04-2024]
ప్రతి ఒక్కరి గుండెచప్పుడు విన్నా.. ప్రజల కన్నీళ్లను చూశా.. సమస్యలన్నీ తీరుస్తా.. అని పాదయాత్రలో హామీల వర్షం కురిపించిన సీఎం జగన్ గద్దె ఎక్కిన అనంతరం వాటన్నింటినీ తుంగలో తొక్కేశారు. -
పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. బొబ్బిలి గురుకుల పాఠశాల విద్యార్థులు కె.వరుణ్ 600కు 592, ఎం.హర్షవర్థన్ 592, కె.రాకేష్ 590 మార్కులు సాధించారు. -
‘ప్రజల్ని దోచేసిన వైకాపా’
[ 23-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రజల కష్టాన్ని అధిక ధరలు, ఛార్జీల రూపంలో దోచేసిందని కూటమి చీపురుపల్లి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. గరివిడి మండలం కోడూరు, ఏనుగువలస గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM