రెండు మండలాలు.. 137 పంచాయతీలు
స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇంటింటికీ చెత్తసేకరణ, సంపద సృష్టి కేంద్రాల (ఎస్డబ్ల్యూపీసీ) నిర్వహణ తీరుతెన్నులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘ఎండ్ టు ఎండ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అడుగులు
జమ్ముపేటలోచెత్త సంపద కేంద్రాలపై అవగాహన కల్పిస్తున్న జడ్పీ సీఈవో అశోక్కుమార్, డీపీవో నిర్మలాదేవి
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇంటింటికీ చెత్తసేకరణ, సంపద సృష్టి కేంద్రాల (ఎస్డబ్ల్యూపీసీ) నిర్వహణ తీరుతెన్నులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘ఎండ్ టు ఎండ్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చాలనేది దీని ఉద్దేశం. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో ఇప్పటికే శిక్షణ ప్రారంభమైంది. విజయనగరం, పార్వతీపురం మన్యం రెండు జిల్లాల్లో రెండు మండలాలు, 137 పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించారు. విజయనగరం జిల్లాలో 80, మన్యంలో 57 పంచాయతీలున్నాయి.
చెత్త సేకరణపై అవగాహన
చెత్త సేకరణపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఇంటి నుంచి సేకరించిన వ్యర్థాలను సంపదసృష్టి కేంద్రాలకు తరలించి, తద్వారా వర్మీకంపోస్ట్ తయారీ చేయడంతో పంచాయతీలు ఆదాయవనరులు సమకూర్చుకునేలా చేస్తారు. ఇందుకోసం ఎంపిక చేసిన పంచాయతీలతో పాటు విజయనగరం జిల్లాలోని బొండపల్లి, మన్యంలోని పాచిపెంట మండలాల్లో అన్ని పంచాయతీలను ఆదర్శగ్రామాలుగా మారుస్తారు. ఇప్పటికే ఈ ప్రక్రియ జరుగుతున్నా కొన్ని చోట్ల కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, క్లాప్మిత్రలకు జీతాలు నెలనెలా ఇవ్వకపోవడం వంటివి ప్రతిబంధకాలుగా నిలుస్తున్నందున వీటిని అధిగమించే చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఆరుచోట్ల శిక్షణ
రెండు జిల్లాల్లో శిక్షణ నిమిత్తం ఆరు కేంద్రాలను ఎంపిక చేశారు. స్థానిక శిక్షణ కేంద్రాల్లో (ఎల్టీసీ) జిల్లా వనరుల కేంద్రం సిబ్బంది ద్వారా ఎంపీడీవో, కార్యదర్శులు, ఈవోపీఆర్డీ, పంచాయతీ సిబ్బంది, సర్పంచి, ఉపసర్పంచులు, పంచాయతీ సిబ్బంది, క్లాప్మిత్రలకు శిక్షణ ఇస్తున్నారు. విజయనగరం జిల్లాలో గుర్ల మండలం జమ్ముపేట, చీపురుపల్లి మండలం కర్లాం, భోగాపురం మండలం నందిగాం పంచాయతీల్లో ఈ నెల 24 నుంచి శిక్షణ ప్రారంభమైంది. ఏప్రిల్ ఆరోతేదీ వరకు ఇవ్వనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో పెదభోగిలి, వీరఘట్టం, సాలూరులో ఇచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు ఆయా జిల్లాల పంచాయతీ అధికారులు నిర్మలాదేవి, బి.సత్యనారాయణ ‘న్యూస్టుడే’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లుంబూరు కాలనీలో సౌకర్యాలేవన్నా!
[ 28-03-2024]
ప్రభుత్వం ఆర్భాటంగా ఇళ్లు కాదు... ఊళ్లే నిర్మించేస్తామంటూ అట్టహాసంగా జగనన్న కాలనీలను మంజూరు చేసి నాలుగేళ్లవుతున్నా నేటికీ కనీస సదుపాయాలు కల్పించలేదు. స్థలాలిచ్చాం... మీరే కట్టుకోండంటూ లబ్ధిదారులను గాలికొదిలేసింది. -
అసంపూర్తి పనులు.. తప్పని అవస్థలు
[ 28-03-2024]
సీతానగరం మండల కేంద్రం నుంచి పలు గ్రామాలను అనుసంధానించేందుకు నిర్మించిన రహదారుల అభివృద్ధి పనులు అసంపూర్తిగా మిగలడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. పదేళ్లుగా అధ్వానంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి ఈ ఏడాది నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. -
సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
[ 28-03-2024]
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వసతులు
[ 28-03-2024]
పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ కేంద్రాల వద్ద అన్ని వసతులు పక్కాగా ఉండాలని కలెక్టరు నిశాంత్కుమార్ ఆదేశించారు. -
జలకలే
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో 2020-21లో జలకళ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సుమారు పది వేల దరఖాస్తులు వచ్చాయి. నాలుగేళ్లలో 373 బోర్లకు రూ.5.55 కోట్లతో పరిపాలనా అమోదం ఇచ్చారు. -
జనం జీవితాల్లో బూడిద
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలోని వేపాడ, ఎస్.కోట, ఎల్.కోట, బొండపల్లి, గురుగుబిల్లి, పాచిపెంట, పాలకొండ మండలాల్లో కొండలను పిండి చేస్తున్నారు. అనుమతులు కన్నా అదనపు విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి జేబులు నింపుకొంటున్నారు. -
బిల్లులు రాక.. నిర్మాణాలు సాగక
[ 28-03-2024]
-
ఔత్సాహికం.. అల్లంతదూరం
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలనే మాట వినిపించడం లేదు. వారికి అందించాల్సిన శిక్షణ తరగతులు, అవగాహన సదస్సులు దూరమయ్యాయి. దీంతో నిరుద్యోగ సమస్య రానురానూ తీవ్రమవుతోంది. -
ఆపద్బాంధవులకూ కష్టాలే!!
[ 28-03-2024]
అగ్ని ప్రమాదం సంభవిస్తే ఠక్కున గుర్తొచ్చేది అగ్నిమాపక దళమే. భారీ యంత్రాలు, బరువైన పరికరాలతో ఎంత పెద్ద భవనాలనైనా ఎక్కి మంటలను అదుపు చేసేందుకు మృత్యువుతో పోరాడుతారు. మరి ఆ విభాగానికే కష్టమొస్తే.. అలాంటి పరిస్థితే జిల్లాలో నెలకొంది. -
వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా చేరికలు
[ 28-03-2024]
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి రాజాం నియోజకవర్గ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. -
అనుమానంతోనే భార్యను చంపేశాడు
[ 28-03-2024]
ఆమె వృద్ధురాలు.. వయసు 60 ఏళ్లు.. కానీ తాగిన మైకంలో భర్త అనుమానించేవాడు. నిరంతరం వేధించేవాడు. చివరకు హత్య చేసి, దారుణానికి ఒడిగట్టాడు. జియ్యమ్మవలస మండలంలోని సింగనాపురంలో ఇటీవల జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. -
ఇంటర్ మూల్యాంకనం 50 శాతం పూర్తి
[ 28-03-2024]
కొత్తగా ఏర్పడిన జిల్లాలో తొలిసారిగా ఇంటర్మీడియట్ మూల్యాంకనం నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 50 శాతం దాటి జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తి చేసినట్లు క్యాంపు అధికారి ఎస్.తవిటినాయుడు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!