బాధితులకు రూ.1.62 లక్షల సాయం
గత నెల 22న మండలంలోని చోళపదంలో ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో అంటివలసకు చెందిన ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
నగదు అందజేస్తున్న గిరిజన ఉపాధ్యాయులు
కొమరాడ, న్యూస్టుడే: గత నెల 22న మండలంలోని చోళపదంలో ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో అంటివలసకు చెందిన ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధిత కుటుంబాల సభ్యులకు గిరిజన ఉద్యోగుల సంఘం (కొమరాడ) తరఫున ఆదివారం రూ.1,62,200 అందజేశారు. తల్లిని కోల్పోయి, అంధుడైన తండ్రి సంరక్షణలో ఉన్న ముగ్గురు పిల్లలకు రూ.45 వేలు, 6 కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున, క్షత్రగాత్రులు నలుగురికి రూ.5 వేలు చొప్పున ఇచ్చారు. జనవరిలో సరుగుడగూడ వద్ద జరిగిన ట్రక్కర్ బోల్తాపడిన ప్రమాదంలో మృతి చెందిన అల్లువాడుకు చెందిన హిమరిక హరికృష్ణ కుటుంబానికి రూ.35 వేలు అందజేశారు. ఐదుగురు చిన్నారులకు రూ.2 వేలతో సామగ్రి కొనిచ్చారు. ఉద్యోగులు పి.రాజారావు, సీహెచ్.సీతారాం, పి.లక్ష్మణరావు, నాగేశ్వరరావు, వెంకటరావు, పి.బృందావనరాయుడు, భూపతిదొర, హెచ్.అప్పారావు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం
-
Crime News
Crime news: కోర్కె తీర్చమంటే నో చెప్పిందని.. గర్ల్ఫ్రెండ్పై దారుణం
-
Politics News
Sattenapalli: కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు: నక్కా ఆనందబాబు
-
Sports News
WTC Final: ఆ సిరీస్ కంటే.. మాకిదే గ్రాండ్ ఫైనల్: ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్
-
India News
Karnataka CM: ‘ఐదు గ్యారంటీల’కు కేబినెట్ గ్రీన్సిగ్నల్.. ఈ ఏడాదే అమలు!
-
Sports News
‘ఆ పతకాలు మీవి మాత్రమే కాదు.. ఎలాంటి తొందరపాటు నిర్ణయం వద్దు’: కపిల్ సేన విన్నపం