logo

తెదేపా విజయంతో రాష్ట్రాభివృద్ధి

రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీశ్‌ అన్నారు.

Published : 30 Mar 2023 02:14 IST

ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్ర అధికార ప్రతినిధి జగదీశ్‌, నాయకులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీశ్‌ అన్నారు. తమ ప్రభుత్వం వస్తే రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్వతీపురంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీ చేశారు. అనంతరం పాత బస్టాండులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పురపాలిక మాజీ ఛైర్‌పర్సన్‌ డి.శ్రీదేవి, నాయకులు జి.ఉదయభాను, వెంకటనాయుడు, రవి    కుమార్‌, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

కలసికట్టుగా పనిచేయండి

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో తెదేపా విజయానికి అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు కోరారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలోని చినమేరంగిలో వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. అనంతరం సీనియర్‌ నాయకులను సత్కరించారు.

ఎన్టీఆర్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్సీ విజయరామరాజు, నాయకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని