మళ్లీమళ్లీ ఖరీఫ్ పాట
అతి పెద్ద జలాశయం.. కావాల్సినంత నీరు.. అందుబాటులో నిధులు.. అయినా సాగునీటికి కటకటే.. తోటపల్లి పరిధిలో ఏళ్లుగా ఇదే పరిస్థితి.
ఈ ఏడాదీ పూర్తిస్థాయిలో కాని తోటపల్లి జలాశయం పనులు?
జలాశయం వద్ద మధ్యలోనే ఆగిపోయిన రాతికట్టు పనులు
పార్వతీపురం, న్యూస్టుడే: అతి పెద్ద జలాశయం.. కావాల్సినంత నీరు.. అందుబాటులో నిధులు.. అయినా సాగునీటికి కటకటే.. తోటపల్లి పరిధిలో ఏళ్లుగా ఇదే పరిస్థితి. గరుగుబిల్లి మండలంలో ఉన్న ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ కింద సీతానగరం, బలిజిపేట, బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాల్లోని భూములున్నాయి. ఈ ప్రాంతాలకు నీరందించేందుకు తొమ్మిది డిస్ట్రిబ్యూటరీలతో నేరుగా సరఫరా చేసే మరో మూడు వ్యవస్థలున్నాయి. వీటి కింద 20,521 ఎకరాలు సాగవ్వాలి. 2015 నుంచి నీరు విడుదల చేస్తున్నా వేల ఎకరాలు ఇంకా ఎండుతూనే ఉన్నాయి.
చెల్లింపుల్లో జాప్యం..
ఈ సంవత్సరం ప్రధాన కాలువ కింద తొమ్మిది డిస్ట్రిబ్యూటరీల పనులను పూర్తి చేస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. 430 నిర్మాణాలతో పాటు జలాశయం వద్ద రాతికట్టు, ఇతర పనులు చేసేందుకు రూ.59 కోట్ల వ్యయం అవుతుందని భావించారు. గట్ల పటిష్ఠం, రాతిగట్లు వేయడం, మట్టికట్ట, విద్యుద్దీపాల అమరిక, అత్యవసర పనులు, కాలువలకు లైనింగ్.. తదితరాలన్నీ పూర్తయితే ప్రతిపాదిత ఆయకట్టుకు నీరందుతుంది. ఆరంభంలో పనులు చురుగ్గా మొదలయ్యాయి. అనంతరం ఎక్కడికక్కడే పడకేశాయి. గుత్తేదారులకు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరగడంతో ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు.
అసంపూర్తిగా..
గతేడాది సుమారు ఎనిమిది వేల ఎకరాలకు మాత్రమే కాలువ నీరు పారినట్లు జల వనరుల శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది కొన్నిచోట్ల పనులు చేపట్టినప్పటికీ అవి అసంపూర్తిగా ఉండడం వల్ల ఆయకట్టు తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదనే వాదన కూడా ఉంది. వాతావరణం అనుకూలిస్తే మరో రెండు నెలలు మాత్రమే పనులు చేయగలరు. ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో అది కూడా కష్టంగా కనిపిస్తోంది.
పిల్లకాలువలే లక్ష్యంగా చేయిస్తున్నాం
గతేడాది ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించాం. ఈ ఏడాది మిగిలిన 12 వేల ఎకరాలకు ఇచ్చేలా పిల్ల కాలువల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నాం. ప్రస్తుతానికి ఇవే ప్రాధాన్య పనులుగా ముందుకెళుతున్నాం. కాలువ లైనింగ్ పూర్తికాకపోయినా ఈ ఖరీఫ్నకు నీటిని సరఫరా చేస్తాం. జూన్ వరకు నిర్వహణకు గడువు ఉంది. చెల్లింపుల్లో కొంతమేర జాప్యం ఉన్నప్పటికీ గుత్తేదారులు సహకరించి పనులు చేస్తున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో నీరందిస్తాం.
రామచంద్రరావు, కార్యనిర్వాహక ఇంజినీరు, తోటపల్లి జలాశయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి విజయంతోనే భవిష్యత్తు
[ 19-04-2024]
మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కోరారు. -
బడాయి మావయ్యా.. బువ్వ.. గుడ్డు ఏదయ్యా
[ 19-04-2024]
మీకు అన్నను.. మీ పిల్లలకు మావయ్యను అని చెప్పుకొని తిరిగే సీఎం జగన్మోహన్రెడ్డి ఆ మాటలను నిజం చేసుకోలేకపోయారు. ఈ ఐదేళ్లూ పిల్లలకు నాసిరకం భోజనాలే అందించారు. -
భేష్.. ముహూర్త బలం
[ 19-04-2024]
శుక్రవారం.. ఏకాదశి.. మంచి ముహూర్తం, యోగ బలం బాగుంది.. పండితులు చెప్పిన మాట.. -
తొలిరోజు 12 నామినేషన్లు
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. చీపురుపల్లి, రాజాం, గజపతినగరం నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. తొలిరోజు అసెంబ్లీ స్థానాలకు 10, విజయనగరం ఎంపీ స్థానానికి ఇద్దరు అందించారు. -
బడ్డుకొండ సంపద రూ.11.25 కోట్లేనట!!
[ 19-04-2024]
నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడి (52) సంపద అయిదేళ్లలో రూ.3 కోట్లే పెరిగిందట. ఇది విన్న నియోజకవర్గ ప్రజలు అబ్బే అంత తక్కువ ఉండటం ఏమిటని అనుకోవడం వినిపించింది. -
మాయల పకీరు జగన్ అవసరమా?: కళా
[ 19-04-2024]
మాయల పకీరు ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజలంతా ఆలోచించాలని కూటమి చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. మెరకముడిదాం మండలం గర్భాం మేజరు పంచాయతీలో గురువారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. -
బోసినవ్వుల చిన్నారిని.. వైకాపా రథం చిదిమేసింది
[ 19-04-2024]
‘అమ్మా..వెంటనే వచ్చేస్తాను’ అంటూ బయటకు వెళ్లిన ఆ చిన్నారి తీరని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్లెదుటే అంత వరకూ హుషారుగా ఇంట్లో తిరిగిన ఆ బాలుడు నిమిషాల్లోనే విగతజీవిగా మారిపోయాడు. -
ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలేవీ?
[ 19-04-2024]
శస్త్రచికిత్స చేస్తామని ఆపరేషన్ గదికి తీసుకెళ్లి గంటల కొద్దీ ఉంచి తర్వాత రోగిని బయటకు పంపించేశారంటూ అతని సహాయకులు గురువారం సాయంత్రం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. -
జగన్ దగాతో రైతు బేజారు!
[ 19-04-2024]
గత ప్రభుత్వం రూ.36లక్షల నిధులతో సాలూరులోని దండిగాం రోడ్డులో రైతు బజారు నిర్మించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతకుముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక్క దుకాణం కూడా ఏర్పాటు చేయలేదు. -
శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం
[ 19-04-2024]
శుభకార్యానికి వెళ్లేందుకు అందరూ సరదాగా బయలుదేరారు. ప్రత్యేకంగా సమకూర్చుకున్న వాహనంలో కబుర్లు చెప్పుకొంటూ వెళ్తున్నారు. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొనడంతో ముందు భాగం ఛిద్రమైంది. -
జంఝాటం
[ 19-04-2024]
తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైకాపా ఏనాడూ ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం అన్నదాత వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలోకి రాక ముందు అనేక హామీలను నీటిమూటల్లో నింపేసిన సీఎం జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే మేమింతే అన్నట్లు వాటన్నింటినీ అటకెక్కించేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి