logo

బస్సెక్కుతూ జారిపడి వృద్ధుడి మృత్యువాత

రాజాం బస్టాండ్‌ ఆవరణలో బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

Updated : 30 Mar 2023 02:36 IST

సన్యాసినాయుడు (పాతచిత్రం)

రాజాం గ్రామీణం, న్యూస్‌టుడే: రాజాం బస్టాండ్‌ ఆవరణలో బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెర్లాం మండలం లోచర్ల గ్రామానికి చెందిన వెలమల సన్యాసినాయుడు(63) మందులు కొనేందుకు రాజాం వచ్చి తిరిగి వెళ్లేందుకు బలిజిపేట బస్సు అనుకొని పాలకొండ బస్సు ఎక్కుతుండగా కాలు జారిపడిపోయారు. బస్సు వెనుక చక్రం కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి భార్య నారాయణమ్మ, కుమారుడు కూర్మారావు, కుమార్తె నాగమణి ఉన్నారు. విద్యుత్తు శాఖలో లైన్‌మేన్‌గా పనిచేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని