logo

సంఘీభావం తెలిపితే దాడి చేస్తారా?

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని భాజపా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Published : 02 Apr 2023 05:57 IST

కలెక్టరేట్ ఎదుట నాయకుల నిరసన

కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని భాజపా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అమరావతి రైతులు ఏర్పాటు చేసిన సంఘీభావ సభకు హాజరైన పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై వైకాపా కార్యకర్తల దాడిని నిరసిస్తూ శనివారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జయరాజు మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం హింసతో పాలన చేస్తోందని, వాటిని కప్పిపుచ్చుకోవడానికి దిల్లీకి నాయకులు పరుగులు తీస్తున్నారని ఆరోపించారు. సత్యకుమార్‌పై దాడి ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. వెంటనే బాధ్యుల్ని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని